2023-05-28 17:37:41 by ambuda-bot

This page has not been fully proofread.

అగ్న్యాధానం, అఘోరహోమం, అశ్మారోహణం, మౌంజ్య
జినదణ్ణధారణము, ఆచార్యునిచే కుమార పరిగ్రహణము,
ఆచార్యుడు శిష్యుని అగ్న్యాది దేవతలకు వప్పగించుట,
సుముహూర్తం (జీలకఱ్ఱ, బెల్లం), మంగళాష్టకములు,
గురుపాదోపసంగ్రహణము, గాయత్ర్యుపదేశము, ఉభయ
వ్రతోపదేశము, గోదానము, సూర్యసందర్శనము, అగ్ని
కార్యము.(ఈ అగ్నిని మూడు రాత్రులు పరిరక్షించుకోవాలి.
 
త్రిరాత్రవ్రతనిష్ఠుడై ప్రాతరగ్నికార్యము, గోత్ర
ప్రవరలతో అనుశాసనము, భిక్షావందనము, (మాతృభిక్షతో
ప్రారంభించాలి). సదస్యం, సాయంకాలం మరల
సంధ్యావందనం అగ్నికార్యాలతో మొదటిరోజు
కార్యక్రమం పూర్తవుతుంది.
 
ఇలానే రెండుపూటలా సంధ్యావందనము, అగ్నికార్యము
విధిగా చెయ్యాలి. మధ్యాహ్నం సంధ్యావందనం చేస్తే
సరిపోతుంది. ఈ విధంగా రెండురోజులు చేసి, నాలుగవ
రోజున పాలాశప్రయోగము - మేధాజననము.
మోదుగచెట్టు మొదటలో దాని కొమ్మను పాతి దానివద్ద
 
13
 
ఉపవీతముగా ధరింపబడుచున్నది కావున దీనికి
యజ్ఞోపవీతమని పేరు. యజ్ఞస్య ప్రసృత్యా అజినం
వాసోవా దక్షిణత ఉపవీయ దక్షిణం బాహుముద్దరేత్
వధత్తే సవ్యమితి యజ్ఞోపవీతమ్ - అని యజ్ఞోపవీతం
నిర్వచింపబడినది. దేవతానుగ్రహం కోసం చేయబడిన
యే కర్మయైనా యజ్ఞమే.
 
'ఉపవ్యయతే దేవలక్ష్మమేవ - తత్కురుతే
ఇత్యుపవీతమ్' 'దేవలక్ష్మ' దే అంటే దేవుడని తెలిపే
చిహ్నము. ఇది ధరించినవాడు భూలోకంలో దేవుడేనని
ఈ ఉపవీతం తెలియజేస్తుందట. కాగా మానవుడు
దివ్యత్వాన్ని పొందడానికి ఇది పాస్పోర్టులా
ఉపయోగపడుతుందని భావం. ఇది ఆ అర్హతను
సూచిస్తుందన్నమాట.
 
ఏమిటీ ఉపవీతం? దీనికింతటి మాహాత్మ్యం ఎలా
వచ్చింది? అనే విషయం కొద్దిగా తెలుసుకుందాము.
ఉపవీతమంటే దారాలుచే పేనబడిన ఒక త్రాడు. సువాసినీ
స్త్రీ వడకిన దారంతో, వేదపఠనం చేస్తున్న బ్రాహ్మణుడు
 
15
 
పాలాశప్రయోగము చేయాలి. దీనిలో ప్రణవ శ్రద్ద మేధా
దేవతలనర్చించి, పాలాశదండమును మేఖలాజినములను
మోదుగ చెట్టు మొదట విసర్జించి, నూతన వస్త్రములను
ధరించి, భోజన సంతర్పణాదులచే బ్రాహ్మణులనర్చించి,
వారి యాశీస్సులను పొందుతారు. ఈ పలాశ
ప్రయోగమునే మేధాజననమంటారు. ఈమేధాజననంతో
ఉపనయన సంస్కారదీక్ష పరిసమాప్తమవుతుంది.
 
ఈ అంశాలను కొద్దిగా తెలుసుకుందాం. ఉపనయన
సంస్కారంలోని మొదటి అంశం -
 
1. రక్షాబంధనం : సంకల్పించిన యీ ఉపనయనం
నిర్విఘ్నంగా కొనసాగించవలసినదిగా ముందుగా
రక్షాబంధన దేవతలను 'విశ్వేత్తాతే'... అనే మంత్రంతో
ఇంద్రుణ్ణి, 'బృహత్సామ... మంత్రంతో పుంస్త్యమును,
బలమును వటువునకు చేకూర్చి మమ్ములను కూడా
రక్షింపవలసినదని ప్రార్థించి రక్షాబంధనం ధరిస్తారు.
2. యజ్ఞోపవీతధారణం: రక్షాబంధనము తరువాత
యజ్ఞోపవీత ధారణకు సంకల్పిస్తారు. యజ్ఞ్యార్థమై
 
14
 
96 బెత్తల ప్రమాణంతో 9 పోగులు లేదా దారములతో
మూడు సూత్రములుగా పేని తయారుచేస్తారు. 3
పోగులను కలిపి ఒక గ్రంథి (ముడి) వేస్తారు. ఈ
సూత్రమును ప్రప్రథమంగా బ్రహ్మగారు కల్పించిన
కారణంగా దీనికి బ్రహ్మసూత్రమని, యీ గ్రంథికి
బ్రహ్మగ్రంథి లేక బ్రహ్మ ముడి అనిన్నీ వ్యవహారమేర్పడింది.
బ్రహ్మాగ్రే కల్పయామాస వేదార్హాణామనుత్తమమ్
యస్య చ ధృతిమాత్రేణ బ్రహ్మసూత్రేణ తే ద్విజాః
భవన్తి బ్రాహ్మణా నామ్నా దేవార్హాశ్చ త్రయస్త్విహ - అని
స్మృతి వచనం.
 
ఇంకా స్వాధ్యాయబ్రాహ్మణంలో కేవలం బ్రహ్మ
సూత్రాన్ని అంటే యీ యజ్ఞోపవీతాన్ని ధరించిన
కారణంగానే దేవాసుర సంగ్రామంలో దేవతలకు విజయం
లభించిందని ఒక ఉపాఖ్యానమే -
 
'ప్రసృతాహవై యజ్ఞోపవీతినః ప్రసృతేనవై యజ్ఞేన దేవాః
స్వర్గంలోకమయాన్ న ప్రసృతేనా సురాః' అని
చెప్పబడింది.
 
16