2023-05-28 17:37:41 by ambuda-bot

This page has not been fully proofread.

చేరకుండా ఉండాలంటే, తమ బిడ్డలు సర్వాంగీణంగా
సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే, తప్పకవారు
ఉపనయన సంస్కారం పొందాలని తల్లిదండ్రులు
గ్రహించాలి. లేకుంటే 'మాతా శత్రుః పితా వైరీ యేన
బాలో న పాఠితః' తమకు తగు సమయంలో
తగినట్లుగా విద్యాబుద్ధులు చెప్పించని తల్లిదండ్రులను
బిడ్డలు శత్రువులుగా సంభావించి నిందిస్తారు. తుదకు
వారు సంఘవిద్రోహశక్తులుగా మారిపోయే అవకాశ
మున్నది. కావున బుద్ధిజీవులైన త్రైవర్ణికులు ముఖ్యంగా
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మువ్వురు తమ బిడ్డలకు
సకాలంలో ఉపనయన సంస్కారం జరిపించి వారికి
తగిన మార్గనిర్దేశం చెయ్యాలి.
5. నేడు తరుణావస్థలోని విద్యార్థులెందరో జ్ఞాన
సముపార్జనా దక్షులై యుండి కూడా విద్యాసముపార్జన
లోని ఒత్తిడులను తట్టుకొనలేక పిచ్చెత్తి, ఆవేశ
కావేశములకు లోనై తుదకు ఆత్మహత్యలకు కూడా
పాల్పడుచున్నారు. మరికొందరు నేరప్రవృత్తి
 
9
 
అనగా కొద్దిపాటి భోజనస్వీకారనిరతుడై, అధమపక్షం
మూడు రాత్రులు, లేదా యధాశక్తిగా, 12 రాత్రులు లేదా
ఒక సంవత్సరకాలము బ్రహ్మచర్య అధఃశయన
అగ్నికార్యజప హోమతత్పరుడై, వ్రతనిష్ఠయందుండి
తరువాత వ్రతపరిసమాప్తి సూచకంగా 'మేధాజననం'
చేసుకోవాలి. మేధాజననంతో ఉపనయన సంస్కారం
పూర్తయినట్లు గ్రహించాలి. మేధాజనన పర్యంతము తాను
నిత్యము అగ్నికార్యం చేస్తున్న అగ్నిహోత్రం ఆరిపోకుండా
పరిరక్షించుకోవాలి. ఒకవేళ అగ్నిహోత్రం చల్లారితే
ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నమాట.
 
అందుకని కనీసపక్షం త్రిరాత్రవ్రతం తరువాత
నాలుగవరోజున మేధాజననంతో పూర్తయ్యేలా 4 రోజుల
పాటైనా ఈ ఉపనయన సంస్కారంతో మన బిడ్డలను
సంస్కరింపచేసుకోవాలి. ఇది త్రైవర్ణికులైన తల్లిదండ్రుల
బాధ్యత. దీనిని సక్రమంగా నెరవేర్చకపోతే వారు తమ
బిడ్డల అధ్యాత్మిక పురోగతికి ద్రోహం చేసినట్లే.
 
నేడు ఉపనయనాన్ని ఏదో వివాహమునకు
 
11
 
కలవారవుతున్నారు. సకాలంలో ఉపనయన
సంస్కారమే వీరికి చేసియుంటే వారికీ విధమైన దుస్థితి
పట్టి యుండెడిది కాదని చేతులు కాలిన పిమ్మట
వారి తల్లిదండ్రులు పశ్చాత్తాప పడడం మనం
చూస్తూనే ఉన్నాం.
 
ఉపనయన సంస్కృతులైనవారు గాయత్రీ
జపానుష్ఠానము, సకాలసంధ్యావందనము, బ్రహ్మచర్య
పాలనముల వల్ల ఇంద్రియ నిగ్రహము, కార్యదక్షత,
ఓజస్సు, తేజస్సులను కలిగి ఒత్తిడులను అతిక్రమించి
ఉన్నత శిఖరాలను అన్ని రంగాలలోనూ అధిష్ఠిస్తారనేది
నిర్వివాదాంశం. నూటికి నూరుపాళ్లు నిజం.
ఉపనయనం ఎన్ని రోజులు చేయాలి?
 
ఉపనయన సంస్కారాన్ని కనీసపక్షంగా నాలుగు
రోజులు జఱిపించాలని శాస్త్రం. ఎందుకంటే ఉపనయన
సంస్కారముచే సంస్కరింపబడిన వటువు కేవలం
సాత్వికాహార నిష్ఠతో అనగా క్షారలవణ వర్జితాహారమును,
క్షీరాన్నము, ఆవుపాలు మాత్రము సేవిస్తూ 'లఘ్వాశీ'
 
10
 
ప్రతిబంధకత్వమును తొలగించే తంతుగా ఒకపూట
నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారు. దీనివల్ల
వ్యయప్రయాసలే తప్ప వటువునకు ఏ విధమైన
ప్రయోజనము ఉండదు. కనీసము త్రిరాత్రవ్రతమునైనా
బ్రహ్మచర్యాధశ్శయన క్షారలవణవర్జన నియమములతో
ఆచరించినవారికి 'మేధాజననం' సిద్ధిస్తుంది.
మంత్రానుష్ఠానార్హత లభిస్తుందని గ్రహించాలి.
 
కాగా,
 
నేడు మనం చేస్తున్న ఏకరాత్రోపనయన
సంస్కారము అశాస్త్రీయము, వ్యర్థముగా గ్రహించాలి.
అసలు మానేయడంకన్నా సకాలంలో ఒకరోజైనా జరిపి
గాయత్ర్యుపదేశార్హత కోల్పోకుండా పిల్లలను వ్రాతృత్వ
దోషం నుండి రక్షిస్తున్నామని సమర్థించుకుంటున్న
తల్లిదండ్రులకు నమస్కారం!
ఉపనయన సంస్కారం :
 
ఈ ప్రక్రియలో ప్రధానంగా రక్షాబంధనం, యజ్ఞోపవీత
ధారణం, నాందీ సమారాధనం, లఘుభోజనం (తల్లి లేదా
చెల్లి)తో, కేశవపనం (పంచశిఖలను ధరింపచేయుట),
 
12