2023-05-28 17:37:43 by ambuda-bot

This page has not been fully proofread.

కన్నా సమయం ఎక్కువ పట్టదు. ఈ విధానాన్ని మూడు
రోజులపాటు త్రిరాత్రదీక్షగా ఉభయ సంధ్యల యందును
విధిగా వటువు ఆచార్యుని వద్ద నేర్చుకోవాలి. మొదటిరోజు
ప్రాతరగ్నికార్యం పూర్తయిన తరువాత గోత్రప్రవరలు
చెప్పిస్తూ భిక్షాటనంలో శిక్షణ నియ్యాలి. దీనినే
భిక్షావందనమంటారు. భిక్షాటనమునకు భిక్షావందనమనే
పేరు. 'తతోగురుం మాతరం అన్యాన్ గురూంశ్చ
నమసృత్య భిక్షాంయాచయేత్' అనే సూత్రము ప్రకారం
వ్యవహారంలోనికి వచ్చిందని చెప్పవచ్చు.
 
దీనిలో వటువునకు ఓం చతుస్సాగర పర్యన్తం
గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు... ఆరేయగోత్రః.....
సూత్రీ.. శాఖాధ్యాయీ... నామా అహంభోః అభివాదయే
అని ప్రవరను చెప్పిస్తూ మన దేశాచారం ప్రకారం
ఆచార్యుడు తొలిభిక్షను తల్లిచేత వేయిస్తాడు. కారణం
ముందుగా తల్లిని, మాతృదేవోభవ అని, తరువాత
పితృదేవోభవ, ఆచార్యదేవోభవ ఇలా క్రమాన్ని శ్రుతిమాత
నిర్దేశించింది.
 
33
 
కార్యములను వటువుచే సక్రమంగా చేయించాలి.
మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం మాత్రం చేయిస్తే
సరిపోతుంది. ఈ విధంగా త్రిరాత్ర దీక్షను పూర్తిచేయాలి.
తరువాత 4వ రోజు కార్యక్రమం...
 
14. పాలాశప్రయోగం లేదా మేధాజననం :
 
పాలాశమంటే మోదుగ చెట్టు అని అర్థం.
మోదుగచెట్టుమొదట చేసే సంస్కారం కాబట్టి, దీనికి
పాలాశప్రయోగమని పేరు వచ్చింది. ఉపనయన
సంస్కారవ్రత దీక్షగా మూడు రోజులు ఆమభిక్ష చేసి,
నాలుగవ రోజున భిక్షాన్నమును సంపాదించి,
ఆచార్యునితో పాటు గ్రామమునకు వెలుపల తూర్పున
లేదా ఉత్తరమున నున్న మోదుగ చెట్టు మొదట ఈ
పాలాశకర్మను చెయ్యాలని శాస్త్రం. ఈ విధంగా
చేయడానికి అవకాశము లేకుంటే గృహమందే
ప్రాచీముఖంగా గాని ఉత్తరముఖంగా గాని, ఒక
మోదుగచెట్టు కొమ్మనుంచి, దానిమొదట ముందుగా
సంకల్పం, గణపతిపూజ చేసి మూడుమండపాలలో
 
35
 
13. బ్రాహ్మణాశీర్వాదము :
 
భిక్షావందనము తరువాత బ్రాహ్మణాశీర్వాదముతో
ఉపనయనం పూర్తయినట్లే. బ్రాహ్మణులను యథాశక్తిగా
సంతర్పణ, వస్త్రాలంకరణ దక్షిణలచే సంతృప్తి పరచినవారి
ఆశీస్సులను పొందడం సంప్రదాయం. దీనినే సదస్యం
అంటారు. దీనిని కొందరు భిక్షావందనమయిన వెంటనే
చేస్తారు. కృష్ణాజిల్లాలో ఈ సంప్రదాయం కనిపిస్తుంది.
గోదావరి జిల్లాలలో మధ్యాహ్నం 4గం. లకు వేదస్వస్తి,
సదస్యము జరిపించే ఆచారము వ్యవహారంలో ఉంది.
తరువాత సాయంకాలం సంధ్యావందనం మరియు
అగ్నికార్యములతో ప్రథమదివస కార్యక్రమం పూర్తయినట్లే.
 
ఉపనయనం ఇంతటితో అయిందనుకుంటే
పొరపాటే. అగ్నికార్యం హోమాలు చేసిన ఈ
అగ్నిహోత్రాన్ని త్రిరాత్రదీక్షానిష్ఠుడైన వటువు లేదా అతని
సంబంధులు చల్లారిపోకుండా విధిగా మూడురోజులూ
పరిరక్షించాలి. రెండవ మూడవ దినములలో ఆచార్యుడు
ఉభయ సంధ్యల యందు సంధ్యావందన, అగ్ని
 
34
 
ప్రణవ, శ్రద్ధా, మేధాదేవతలనావాహన చేసి ప్రాణప్రతిష్ఠ
గావించి ఆయా మంత్రాలతో వానికి షోడశోపచార పూజ
చేసి అప్పములతో కూడిన శుభాన్నమును నివేదన చేసి,
తరువాత అగ్నిని ప్రజ్వలింపచేసి, షట్పాత్రప్రయోగం చేసి
పిమ్మట - యశ్ఛందసామిత్యాది మంత్రాలతో ఏకాదశ
హోమములు వటువుచే చేయించాలి. తరువాత
'అనేన పాలాశహోమేన భగవాన్ సర్వాత్మకః
శ్రీయజ్ఞేశ్వరః ప్రీణాతు. సర్వం శ్రీయజ్ఞేశ్వరార్పణమస్తు!
అని హోమాదికమంతయు యజ్ఞేశ్వరార్పితముగా
సమర్పించాలి. పిమ్మట (అపరేణాగ్నిం) అగ్నికావలివైపున
వటువు మేఖలాజినదండములను మోదుగు చెట్టుపై
నుంచి 'అన్యాని నూతన వస్త్రాణి ధారయేత్''ఇతరములైన
నూతన వస్త్రములను మేఖలను ధరించి బ్రాహ్మణులకు
భోజనం పెట్టి ఆచార్యునితో పాటుగా ఇంటికి వచ్చి
బ్రాహ్మణాశీర్వాదములను పొందవలెను. ఈ కార్యక్రమము
వల్ల ప్రణవ, శ్రద్ధా, మేధాదేవతల మఱియు
బ్రాహ్మణాశీర్వాద ఫలితముగా వటువునకు బ్రహ్మచర్య
 
36