This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనం
 
తల్లిదండ్రుల మరియు గురువుల బాధ్యత. ఈ విధమైన ప్రబోధనము వలన
తల్లిదండ్రులు, గురువులు, పిల్లలు అందరు అంతటను భగవత్తత్త్వమును
దర్శించగలుగుతారు. అందరికి ఆత్మోన్నతి మనశ్శాంతి లభిస్తాయి.
 
1. ప్రతిరోజూ ఉదయం 4గం॥ల 45ని॥లనుండి 5గం॥ల వరకు పావుగంట
సేపు భజనలు, భక్తిసంగీతం, ప్రార్థనాగీతాలవంటివి, (వారికి తగినవిగా మీరు
భావించేవానిని) వారికి వినిపించేలా ఏర్పాటు చేయాలి. వినమని వాళ్లని
ఎప్పుడూ నిర్బంధించవద్దు. వినగా వినగా, వాళ్ళే క్రమంగా వినడానికి
 
అలవాటు పడతారు.
 
45
 
2.సమయం 5గంటలైనా వారు మేల్కొనకపోతే, భక్తిగీతాలను వినిపిస్తూనే,
వారిని ప్రేమగా బుజ్జగిస్తూ, సరదాగా లాలిస్తూ నిద్రనుండి మేల్కొల్పాలి.
3. భక్తిసంగీత నేపథ్యం( BACKGROUND)లోనే, వారితో సరదాగా
ఆడుతూ,పాడుతూ, ముచ్చటిస్తూ, తమతో సమానంగా ముఖంకడిగి,
స్నానంచేయించి, తలదువ్వి, (ఆడపిల్లలైతే జడలువేసి) శుభ్రమైన సంప్రదాయ
దుస్తులను ధరింపజేసి, ముఖముపై నుదుటి మధ్యభాగంలో స్ఫుటంగా
కనిపించేలా తిలకమును పెట్టాలి.
 
4. ముఖముపై తిలకధారణ (బొట్టునుంచుకొనుట) తప్పనిసరి. ఎల్లప్పుడూ
బొట్టు లేదా తిలకము ముఖముపై ప్రకాశించేలా చూసుకోమని వారికి
ప్రతిబోధిస్తూ ఉండాలి. కొన్నాళ్లకు వారికే ముఖముపై తిలకపు శోభ అలవాటై,
ఎప్పుడైనా తల్లిదండ్రులలో యే ఒక్కరి ముఖముపై తిలకము లేదా బొట్టు
లోపించినా వారే మనకు గుర్తు చేస్తారు.
 
ఈ విధంగా పిల్లలను ఉదయాన్నే సూర్యోదయానికి కొద్దిగా ముందుగా
సంసిద్ధులను చేసి, వారికి -
 
ఒక చక్కని 'ఆట'గా సంధ్యావందనమును పరిచయం చెయ్యాలి.
(కావలసిన వస్తువులు- చిన్న పళ్ళెములు 2 - నీళ్లచెంబు. పంచపాత్ర,మరియు
ఉద్ధరిణె లేదా గ్లాసు మరియు చెంచా, ఒక పీట లేదా ఆసనం లేదా చిన్న