This page has not been fully proofread.

38
 
దేవీ అశ్వధాటి
 
కోలాహల క్షపిత
 
పోషణ నభా
 
సభః = మేఘై ర్నభా తీతి నభః మేఘాలచేత ప్రకాశించనిది. న భ ఖం శ్రావణే
నభః - ఆకాశం, శ్రావణమాసం. కడగండ్ల కలకతో కాలం గడుపుతున్న దేవతా స్త్రీలకు ఆ దేవి
శుభ పరంపరలను వర్షించే శ్రావణమేఘం. స్త్రీల పట్ల ఆమె కత్యంత ప్రీతి..
 
మన్మథపత్ని పట్లగల ప్రేమచేత ఆమెకు రతిప్రియగా పేరువచ్చింది. ఆమె హరనేత్రాగ్ని
సందగ్ధ కామ సంజీవ నౌషధి. ముక్కంటి కంటి మంటవల్ల బూడిదైనాడు మన్మధుడు. అతడిని
బ్రతికించ మని దేవతలూ పతి భిక్షపెట్టమని రతిదేవి ఆ పరాశక్తిని ప్రార్థించారు. అప్పుడామె
మన్మథుడిని పునర్జీవితుడిని చేసి రతిదేవికి వైధవ్యదోషం అంటకుండా చేసింది. ఈ మన్మథ
పునరుజ్జీవనానికి దేవీ కటాక్షమే సంజీవన మూలిక. కనుక ఆ దేవిని ఉపాసించే స్త్రీలు నిత్య
సుమంగళు లైతారు.
 
ఆమె పులోమ జార్చిత, పులోమ మహర్షి పుత్రిక శచీదేవి, ఇంద్రుడి భార్య. నహుషుడు
స్వర్గాన్ని పాలించిన రోజుల్లో అతడు దేవేంద్రుడిని పరదేశాలకు పారిపోయేట్లు చేశాడు. అప్పుడు
బృహస్పతి శచీదేవికి త్రిపుర సుందరీ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆమె ఆ దేవిని అర్చించింది.
ఆ దేవీ అనుగ్రహంతో తన భర్తనూ తమ రాజ్యాన్నీ తిరిగి పొందగలిగింది.
 
అగస్త్యుడి భార్య లోపాముద్ర. ఆమె జగదంబికను అర్చించి అభేద భావాన్ని పొందింది.
దానితో దేవి లోపాముద్రార్చితగా వాసికెక్కింది. ఇలా దేవతా స్త్రీలకు సుఖ పరంపరలను కల్పించి
వారిని ఉన్నతలుగా చేయటం ఉమాదేవికి అభీష్టం.
 
త్రిలోక సౌభాగ్య కరీం, భుక్తి ముక్తి ప్రదా ముమాం ॥
ఆరాధ్య సుభగాం నారీం, కిం సౌభాగ్యం న విందతి ॥
 
పద్మపురాణం
 
ఇలా భగవతి శచీ ముఖ్యామర వధూ సేవితగా పతివ్రతాంగనాభీష్ట ఫలదాయినిగా
సువాసిన్యర్చన ప్రీతగా వినుతి కెక్కింది.
 
నీ చే
 
నీల మేఘాలను చూచిన నెమళ్లు ప్రణయానంద భావోద్వేగంతో నాట్యంచేస్తాయి. అలాగే
ఆమె అందమైన నల్లని కబరీ భరాన్ని చూచి ఆనందంతో ఈశుడు నటేశుడై తాడు.
కలిత లీలా కదంబ విపినే
 
శృంగార వనమైన కదంబ వనంలో విలాసంగా ఆమె విహరిస్తుంది. అంటే ప్రపంచ
రూపక్రీడలో కదంబవనంలో విహరిస్తుంది. ఆమె లీలావినోదిని.
విశేషాలు
 
ఈ శ్లోకం అంతటినీ కాళిదాసు దేవతా స్త్రీలకే పరిమితం చేయటం విశేషం. ప్రత్యేకించి
మనకిది ధ్యాన శ్లోకం వంటిది.
 
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ।
యత్రైషాస్తు న పూజ్యంతే, సర్వాస్తత్రాఫలాః క్రియాః ॥
 
మనుస్మృతి