2023-05-14 13:43:39 by ambuda-bot

This page has not been fully proofread.

ఆస్తికత్వము.
 
ఆదివో దాసమహారాజు తపోనిష్ఠలో నున్న పరిస్థితిలో దేశము
తామపీడితము కాగా ఆ యువద్రవమును తొలగించుటకై రాజ్యపాల
కుడవు ధర్మాత్ముడవైన నీవు కావలయు నని దివోదాసమహారాజును
బ్రహ్మ ప్రోత్సహించెను. అప్పుడా రాజర్షి యిట్లు చెప్పెను... దేవత
లను ప్రజలు ధర్మబద్ధులై యథావిధిగా పూజించుచుండుట, ఆ దేవతలు
భూతలనుందు అడుగు పెట్టకుండ తమ లోకమందె యుండుట, నిశ్ఛిద్ర
ముగా నేను రాజ్యముచేయుట. ఈనిర్ణయముపై నేను రా రాజ్యము
 
చేయుదును. అని.
 
55
 
దానికి బప్మి అంగీకరించెను. అంతట మహారాజు కాశీపుర
మందు నివసించుచు పరిపాలనము చేయుచుండెను. కాశీపురాధీశ్వరు
డగు శ్రీవిశ్వేశ్వరుడుకు-డ సపరివారముగా తప్పుకొనెను. యోగశక్తు
లతో, దివ్యమహిమలతో దివోదాసమహారాజు ధర్మబద్ధముగా ఎట్టి
లోపములు రాకుండ పరిపాలనము అద్భతముగా జరుపుచుండెను.
 
అట్లు వైదిక ధర్మభూయిష్ఠ మై నిశ్ఛిద్రముగా నడచుచున్న
దివోదాసరాజ్యములోని కాశీపురములో శ్రీ విశ్వేశ్వరపవేశము జరు
గుటకు ప్రజలలో అధర్మాభిరుచిరూపమైన ఛిద్ర మేర్పడవలయును.
దానికై ప్రజలలో అట్టి అధర్మోపదేశములు, వ్యామోహింప జేయు
నట్టి సర్వసమర్థతలు గల మహాపురుషుని ద్వారా జరుగవలయును. అని
యెంచి యిట్టి మార్గ మవలంబింపబడినది శ్రీహరి పుణ్యకీర్తి యను
పేరుతో అతిసుందరమైన బుద్ధరూపమును ధరించెను. శ్రీదేవి లోక
వ్యామోహకరమగు పరివాజి కాస్వరూపమును ధరించెను. గరుత్మం
తుడు వినయకీర్తి అను పేరుతో లోకోత్త
రాకృతితో శిష్యరూపమును
ధరించెను. ఆపరివాజికయు, శిష్యుడును పుస్తకహస్తులై యుండిరి.
శిష్యుడు సంసారనివర్త క మైన ధర్మస్వరూపమును గూర్చి ప్రశ్నింపగా
గురువు బోధించుచుండెను. ఈ విధముగా, లోకులు వచ్చి వినుచుండ
బౌద్ధమతధర్మములను అనగా అవైదిక మతధర్మములను వివరించుటలో
అవి సులభముగా ప్రజలలో వ్యాపించినవి. ఈ విషయ మీ శ్లోకము
లలో చెప్పబడినది.
 
D