2023-05-14 13:43:28 by ambuda-bot

This page has not been fully proofread.

ఈ గ్రంథము నేఁటి స్వతంత్ర భారతమున వెలువడుచున్న,
నాస్తికత్వ ప్రబోధక గ్రంథములందలి విషయముల నెత్తి ఖండించి
భారతీయుల సంప్రదాయము చెడకుండ సోపపత్తికముగా ఆస్తిక్య
మును లోకులకుఁ దెలియఁ జూటుచున్నది. ఇంతకంటె ఈ గ్రంథ
 
మునుగూర్చి కాని, శ్రీ శాస్త్రుల వారిని గూర్చి గాని వారిని పాఠక
లోకమున కడ్డుగా గాఁదలఁచుకొనలేదు. ఇది 254 పుటలుగల చిన్న
పుస్తకమైనను, విషయగాంభీర్యమునుబట్టి సముద్రమువలె నుండుటచే,
నిట్టి యుత్తమ విమర్శగ్రంథముపై మాదృశు లుపోద్ఘాతము వ్రాయ
సాహసమగుననియు, వేత్తలగు సజ్జనులు పక్షపాతము లేక సత్యము
గ్రహించి యానందింతురనియు, నిష్పాక్షిక బుద్ధులు, సత్యాన్వేషణ
తత్పరులునై న ప్రతిపకులునై తము ఆర్ష సిద్ధాంతములందలి వాస్తవము
గ్రహించి, గౌరవహానిభయమునఁ బైకిఁగాకున్న మానె. అంతరంగ
ముననై న నామోదింపక మానరనియు, కావున ఆస్తికజనులతో పాటు
 
గ్రంథరచన కై
 
నాస్తి కమతాసక్తులుగూడ శ్రద్ధగా పఠించి,
శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రులుగారు చేసిన పరిశ్రమమును గ్రహించి సౌజ
న్యము చూపఁగలరనియు విన్నవించుకొనుచున్నాను.
 
అమలాపురము.
 
దుర్ముఖి మార్గశీర్ష శుద్ధ
దళమీబుధవాసరము.
 
ఇట్లు,
 
సు జ న వి ధేయుడు
 
వెంపరాల సూర్యనారాయణశాస్త్రి.