2023-05-26 04:33:42 by srinivas.kothuri

This page has been fully proofread once and needs a second look.

విన్నపము.
 

 
మూడు శతాబ్దులకు ముందు విశ్వగుణాదర్శమున వేంకటా

ధ్వరియను మహాకవి కలికాలమహిమ నిట్లు వర్ణించినాఁడు.

శ్లో. "హర్మ్యస్థాన మధర్మకర్మవితతే ర్దుర్మానధర్మాసనం

శాస్త్రస్తోమలలాటకూధూలిపిలయః శాంతి స్వానా మపి,

ఆమ్నాయార్థవచస్సమాపనదినం, సంస్థా సదర్బాచావిధే
ధేః
అర్థాశాజనిభూ రభూ దిహ మహానర్థావహోయం కలిగి.
 
లిః
 
కలికాల మెట్టి దన:- అధర్మకృత్యములకు సౌధము; దురభి

మానమునకు ధర్మపీఠము. శాస్త్రములకు లయకాలము; క్రతువులకు

శాంతిపాఠము; వేద వాక్కులకు అనధ్యయనదినము; సజ్జనపూజకుహద్దు;

ధనాశకు పుట్టినిల్లు. ఇంతేకాదు. పెక్కనర్థములకు మూలకందము"అని.

 
వేసవిలో ఎండలు, వర్షాకాలమున వానలు, శీతకాలమున

చలియు విజృంభించుట ప్రకృతిసిద్ధమైనట్లే కలియుగమున అధర్మము

క్ర
మవృద్ధినందుటయు నై సర్గికము కావచ్చును. కాని యావజ్జగత్తు

నకుఁ గలుగు శీతవాతాతపాదిపీడలను తప్పింపలేకున్నను, కంబళ

తోత్రోపానహాదిసాధనములచే స్వవిషయమున నేని తప్పించుకొన

బుద్ధిమంతుఁడు యత్నించుట సహజధర్మమైనట్లే, ధర్మాధర్మస్వరూప

మెఱిఁగిన పెద్దలు అధర్మము నరికట్టుటకై ధర్మస్వరూపము నెఱిఁగి,

తా నాచరించుటయే కాక, జిజ్ఞాసువులకు తెలుపుటయు నై సరికము .
ర్గికము .
కలి కాల కాలుష్యము నట్లు వర్ణించిన యా వేంకటాధ్వరి కవివరుఁడు--

 
శ్లో."ఏతాదృశే కలియు గేపి శశేతేషు కళ్శ్చి
 

జ్జాతాదరో జగతి యః శ్రుతిమార్గ ఏవ,

యత్కించి దాచరతి పాత్ర మసౌ స్తుతీనాం

శ్లాఘ్యం దురాప మపి కిం న మరేరౌ సర శ్చేత్ ॥
 
H
 

 
 
ఇట్టి కలియుగమందుసై తము నూఱుమందిలో నేయొకడైనను

వేదమార్గమున నాదరము గలిగి, యే కొంచెము వేదధర్మము నాచరిం

చినను, ఎడారిలోని చిన్న నీటిగుంటవలె ఆ ధార్మికుఁడు శ్లాఘాపాత్రుఁ
 

డగును" అనెను,