2023-05-14 13:43:28 by ambuda-bot

This page has not been fully proofread.

విన్నపము.
 
మూడు శతాబ్దులకు ముందు విశ్వగుణాదర్శమున వేంకటా
ధ్వరియను మహాకవి కలికాలమహిమ నిట్లు వర్ణించినాఁడు.
శ్లో. "హర్మ్యస్థాన మధర్మకర్మవితతే దుర్మానధర్మాసనం
శాస్త్రస్తోమలలాటకూలిపిలయః శాంతి స్పవానా మపి,
ఆమ్నాయార్థవచస్సమాపనదినం, సంస్థా సదర్బావిధే
అర్థాశాజనిభూ రభూ దిహ మహానర్థావహోయం కలిగి.
 
కలికాల మెట్టి దన:- అధర్మకృత్యములకు సౌధము; దురభి
మానమునకు ధర్మపీఠము. శాస్త్రములకు లయకాలము; కతువులకు
శాంతిపాఠము; వేద వాక్కులకు అనధ్యయనదినము; సజ్జనపూజకుహద్దు;
ధనాశకు పుట్టినిల్లు. ఇంతేకాదు. పక్కనర్థములకు మూలకందము"అని.
వేసవిలో ఎండలు, వర్షాకాలమున వానలు, శీతకాలమున
చలియు విజృంభించుట ప్రకృతిసిద్ధమైనట్లే కలియుగమున అధర్మము
కమవృద్ధినందుటయు నై సర్గికము కావచ్చును. కాని యావజ్జగత్తు
నకుఁ గలుగు శీతవాతాతపాదిపీడలను తప్పింపలేకున్నను, కంబళ
ఛతోపానహాదిసాధనములచే స్వవిషయమున నేని తప్పించుకొన
బుద్ధిమంతుఁడు యత్నించుట సహజధర్మమైనట్లే, ధర్మాధర్మస్వరూప
మెఱిఁగిన పెద్దలు అధర్మము నరికట్టుటకై ధర్మస్వరూపము నెఱిఁగి,
తా నాచరించుటయే కాక, జిజ్ఞాసువులకు తెలుపుటయు నై సరికము .
కలి కాల కాలుష్యము నట్లు వర్ణించిన యా వేంకటాధ్వరి కవివరుఁడు--
శ్లో."ఏతాదృశే కలియు గేపి శశేషు కళ్చి
 
జ్జాతాదరో జగతి యః శ్రుతిమార్గ ఏవ,
యత్కించి దాచరతి పాత్ర మసౌ స్తుతీనాం
శ్లాఘ్యం దురాప మపి కిం న మరే సర శ్చేత్ ॥
 
H
 
ఇట్టి కలియుగమందుసై తము నూఱుమందిలో నేయొకడైనను
వేదమార్గమున నాదరము గలిగి, యే కొంచెము వేదధర్మము నాచరిం
చినను, ఎడారిలోని చిన్న నీటిగుంటవలె ఆ ధార్మికుఁడు శ్లాఘాపాత్రుఁ
 
డగును" అనెను,