<?xml version="1.0" encoding="UTF-8"?>
<TEI xmlns="http://www.tei-c.org/ns/1.0">
<text>
<body>
<pb n="1" />
<p>రాణా ప్రతాపసింహచరిత్ర</p>
<p>( ఐతిహాసిక ప్ర బంధము.)</p>
<pb n="2" />
<p>ప్రొద్దుటూరు
శ్రీ జానకీ ముద్రాక్షరశాలయందు ముద్రితము.
1934 ప్రథమ ముద్రణము 500 ప్రతులు.
1935 ద్వితీయ ముద్రణము 1000 ప్రతులు.
.</p>
<pb n="3" />
<p>శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి సమీక్ష.</p>
<p>(భారతి నవంబరు 1943.)</p>
<p>రాణాప్రతాపసింహ చరిత్ర తలమానిక మువంటి గ్రంథము. ఆహృదయ
మీ రాణాప్రతాపచరిత్రయందు మహాభారతమునం దెంత యున్నదో యంత
యున్నది. భారతము పూర్వకాలము కథనే చెప్పును. అందులోనున్న ధర్మము
మాత్రమే మనజాతిది. ఆవిషయము ద్వాపరయుగమునాఁటిది. మనపరిస్థితులతో
సంబంధము లేనిది. పతాపసింహచరిత్ర మనధర్మమునేగాక మన పరిస్థితులను
గూడ చెప్పును. పతాపసింహునికన్న ధర్మరాజాదు లేమియు నెక్కువవారు
కారు. వస్తురమ్యతకుగాని, కథాచమత్కారమునకుగాని, ఇందలి భిన్న పాత్రల
భిన్న తావిశిష్టతకుగాని భారతమున కీగ్రంథము తీసిపోదు. వస్తు విటువంటిది.
కవి యెటువంటివాఁడు? వ్యాసునకు తిక్కన్నకు నెంత వీరరసావేశ మున్నదో
యంత వీరరసావేశము గలవాఁడు. న న్నెవరైన భారతములోని యుద్ధపంచ
కము తిక్కన్నగారు వ్రాయకయుండుచో మఱియెవరు వ్రాయగల్గుదురని
ప్రశ్నించినచో నేను "రాజ శేఖరశతా వధానిగా" రని సమాధానము చెప్పెద.
యుద్ధవర్ణన యెచ్చటచూచినను, తిక్కన్న గారి రచనతో దులదూగుచున్నది.
ఈగ్రంథము అస్వతంతజాతి కొక స్మృతి×ంథము వంటిది.
రాణాపతాపునకు మహాత్మునకు గల సామ్యము భారతజాతికి గల
యస్వతంత్రత. మహాత్మునిది కత్తిలేని సాత్త్వికపు పోరు. పతాపునిది కత్తి
గల సాత్త్వికపు పోరు. నేఁటి సత్యాగ్రహమునకు ఆనాఁటి ప్రతాపుని యు
ధర్మమునకు భేదమే లేదు.
3
ఈ రచన భారతమును దలపించుచున్నది. ఈకవి చాల చోట్ల నన్నయ్య
గారిని పోలినట్లు వ్రాయును. ప్రతాపునిశౌర్యాగ్ని రాజి నుండి యత్యుగ్రమై
పాతికయేండ్లు తగుల బెట్టిన ఘట్టము. ఆశౌర్యము, ఆయుద్ధములు, ఆప్రతిజ్ఞలు
అవి యన్నియు వ్రాసినచో పట్టరానంత గ్రంథ మగును. ఈకవిసార్వభౌముఁడు
ఈఘట్టము చిత్ర చిత్రములుగా వ్రాసెను. మొదట నే చెప్పితినిగదా ఈగ్రంథము
యుద్ధ పంచకమువలె నున్నదని.</p>
<pb n="4" />
<p>ప్రతాప్యుడు ప్రకృతి బిడ్డ భోగ విముఖుడైన రాజ ప్రతాపుఁడు గాంధీ
వంటివాఁడు. ఏసుక్రీస్తు వంటవాడు. మహస్థల వంటివాడు. ఇట్లు వ్రాసిన
నూరక పెరిగిపోవును. "శ్రీనృపలోక జగద్గురుండు మాయప్ప ప్రతాపదేవుఁడు"
ఇందు రసధ్వని వేయిమూర్తుల రూపు గుచున్నది. హృదయమునుండి
వచ్చిన భాష యనగా నిది. ఇట్టి రచన మహాకవులే చేయఁగలరు.
అంతయునైనది గాని, ఓయి ప్రతాపా! శ్రీనృపలోక సగ్గురూ!
మాయప్పా!
సీ॥ అక్బరు విశ్వంభరాధీశమౌళిది
ధనసేవ! నీయది కైవసేవ!
మతని కుండినదెల నెహికబలము ని
న్నాశ్రయించిన దెల్ల నాత్మబలము!
యాతని దెల్లప్పు డాత్మవైభవము! నీ
యది నిరంతరము నాత్మావబోధ!
మతని దందఱకన్ను లలరించు భోగంబు!
నీది జగముమెచ్చు నిండుత్యాగ!
ఆ॥ వెళ్లే మతఁడు జగము గెలిచె! నాక్మ గెల్చితివి నీ!
వాతఁ డితరజనుల నాశ్రయించు!
నీవు స్వాశయ.ఁడవు! నీకు - నాతని కెన
లేదు జగము కొందు మీదులైన
ఇంక నౌకమాట. ఈరసప్రవాహములో ప్రవాహమువెంటనే పోయి
విమర్శించితిని. వేఱక గతి లేదు. కాని, ప్రవాహము నడుమను తీరము వెంట
నంగుళమంగుళము కల తామరపూలు, కలువపూలు, నీటి బెగ్గరులు మొద లైన
శోభలు పాఠకులే చూచుకొనుచు చదువుకొనవలయును. ఇది పరమో త్తమ
గ్రంథములలో నొకటి.
వలయువారు:-
జకోపకారిణీస్టోర్సు, ప్రొద్దుటూరు,
"
•
J
:
1
:
}</p>
<pb n="5" />
<p>వి
605)
జాణే
68
లెస్ట నెంటు కర్నల్ జేము టాడ్డుదొర ( Lieutenant Colonel-James-Tod )
రాజస్థాన దేశ చరిత్రము ( Appals and Antiquities of Rajasthan) చదివి నప్పటినుం
డియు నా గ్రంథము నెడ నా కతిశయ గౌరవము గలిగెను. ఆ యితిహాసరంగమున నర్తిం
"చిన పాత్రములలో "మహారాణా ప్రతాపసింహుఁడు" పూర్వాభిగణ్యుఁడు. స్వాతంత్ర్య
శబ్దమునకు మున్నెన్నఁడును లేని రసార్ణసంపత్తిఁ గూర్చిన 'విశ్వవీర చూడామణి.' భగీరథ
ప్రతీకాశ కార్యదీక్షా ధురంధరుఁడు. చిన్న రాజ్యమున కధీశ్వరుఁడయినను మాతృ దేశభక్తి
పరత్వము పెంపున నీ రాజర్షి
పుంగవుఁడు 55 లక్షలు పాదాతిబలము, 15 లక్ష లాశ్వికదళము,
10 వేలు వారణములు, 10 వేలు పిరంగులు గలిగి ప్రపంచోన్నత ప్రబల సార్వభౌముఁ
డయిన యక్బరుపాదుపాతో నిరువదియైదు వత్సరములు మహాసంగ్రామము నడిపి స్వా
తంత్ర్యము నిలుపుకొని ధర్మవీర శిరోమణియని కీర్తి మోసెను.
నిజమా క్తికసితాతపత్రచ్ఛాయల సమగ్రదక్షిణాపథ రాజ్యము లన్నింటికీఁ జలువఁ
గూర్చి దశదిశల ధవళకీర్తిచంద్రికలు నెఱపి శ్రీకృష్ణ దేవరాయలు యశఃకాయుఁడై న పిదప
నతని యనంతరము వారి పరిపాలనమున రాజ్యము చెదరి, పాయలై, చెడి, దేశమంతయు
ననంత నిరంతర సంగరములలో మునింగిన కాలమగుట "రాణా ప్రతాపసింహుని" వీర విక్రమ
విహారకథనములు దక్షిణభారతమున వ్యాపింప నవకాశము తక్కువ యయ్యెను. ఆకార
ణమున నితని పేరు దక్షిణాపథమున నేపదిమందియైన నెఱింగియుందురో లేదోయని సందేహ
ముండెడిది. ఉత్తర భారతదేశమునమాత్ర మా మహావీరుని దివ్యనామముఁ గీర్తించి పుల
కితశరీరులుగాని వారు లేరు.
పూజ్యులగు పూర్వమహాకవులు పలుమాఱు వ్రాసిన పురాణాంశములఁ గుఱించి
కాని, కల్పితకథలను గొనికాని ప్రబంధములు రచించుట తొలుతటినుండియు నాకు రుచించి
నదిగాదు. అతిశయోక్తు లకుఁబోక జరిగినది జరిగినట్టులు వ్రాసిపెట్టిన సత్యమగు దేశచరిత్ర
ములు ప్రజాప్రభోధక ప్రబల సాధనములని నావిశ్వాసము. కావున నింతకుముందు ఘూర్జర
దేశచరిత్రమందలి "వీరమతీదేవి చరిత్రము" మేవాడ్ దేశ చరిత్రమునందలి "చండనృపాల
చరిత్రము" పద్యగ్రంథములుగ విరచించితిని. ఎన్ని విధములనయినను యత్నించి లోకోత్తర
వీరవ్రతుండగు "ప్రతాపసింహుని" దివ్య చరిత్రముఁ గూడఁ గావ్యముగ రచించి యాంధ
భాషాయోషామణి మృదుపదార విందముల చెంత సమర్పించుకొని కృతకృత్యుఁడఁ గావలె</p>
<pb n="6" />
<p>2
నని నాకుఁ గొండంత కోరిక గలిగినది. ఆ విశ్వవీరుని నామధేయము కనఁబడిన గ్రంథముల
నెల్లఁ దెప్పించుకొని పఠించితిని. భాగ్యవశమున ననేకామూల్యాంశములు గడింపఁగలిగితిని.
వత్సరములకొలఁది నామహాభాగుని గుణగణము లూహించి, భావించి, ధ్యానించి, తన్మ
:
యుఁడ నగుచుంటిని.
చౌరా
-
కోటల
ఇతివృత్తము సంపూర్ణముగఁ జరితాత్మకము. రంగము పవిత్రమయిన యార్యా
వర్తక్షేత్రరాజము. ప్రధాననాయకుఁ డుత్తమోత్తమ భారతీయ శిరోమణి. అయిన నుత్తర
హిందూస్థానమందలి (అహమ్మదాబాదు - అసహుల్ వారా - ఝసల్ మియర్
ఘర్) మున్నగు పురముల నామములును, డోంగరీశుఁడు - సో నెగుఱ్ఱమహీంద్రుఁడు
మహమ్మజ్జలాలుద్దీనక్బరు - ఖాఖానర్-హకీంహుమాం మీర్జా అబ్దూరహిమాజ్)
లోనగు పురుషుల నామధేయములును, (మండలగృహము అంతల్లా - కుంభల్ మియర్ -
చేవందా - చానార్ దుర్గము - తారాఘర్ రణ స్తంభపుర దుర్గము) మొదలగు
-
పేళ్లును శ్రుతికటువులై దీర్ఘములై ఛందోగణములలో సులభముగ నిముడనివై యున్నవి.
మఱియు నిది 25 సంవత్సరము లవిచ్ఛిన్నముగ సాఁగిన మహాసంగామము. సాధనములు
శరచాపములుగావు. తుపాకులు- శతఘ్నులు, మాతృకలోఁ బదునాలుగుపుటలున్న ప్రతా
పసింహరాజచంద్రుని చరిత్ర మొక్క కళ తక్కువగ వెలుఁగుచున్నది. రాజస్థాన దేశ చరిత్ర
మనేక రాజ్యములను వీరయోధులను గుఱించి వ్రాయఁబడినది. కావునఁ బతాపుని పాత్ర
మును బ్రత్యేకముగను సమగ్రముగను బోషింప నవకాశము లేకపోయియుండుట సత్యము.
ఆ కొఱవడిన 'ఆధ్యాత్మికకళ'ను జేర్చి యా రాజగురుమహాసార్వభౌముని పాత్రమునకు
వన్నె చేకూర్చి నిర్వచనకావ్యముగ వెలయిప నారంభించితిని.
-
1932 మార్చి నెలకు మూఁడాశ్వాసములు వాయఁగలిగితిని. ఆరోగ్యము చాలక
కడపఁ దాఁటి కదలఁజాలని దుర్బలస్థితి నుండి గ్రంథ మంతటితోఁ గడమవడిపోవునేమో
యని పలుమాఱు వగ నొందితిని. పదునెనిమిది మాసము లంతరాయమున కోర్చి మఱల
నారంభించి యొకమాసమున గ్రంథముఁ బూర్తి చేసితిని. నా పరమమనోరథఫల స్వరూప
మగు ప్రతాపదేవుని దివ్యచరిత్రము నాద్యంతము రచించి నిర్వహింప ననుగ్రహించి నాకు
మనః పరితృప్తి గలుగఁ జేసిన యీశ్వరుని కరుణామయత్వమును గొనియాడితిని.
ఈ గ్రంథమున కావిష్కరణమహోత్సవముఁ దీర్చిన మిత్రులు ప్రశంసాపాత్రులు.
ఆవిష్కరణ సభ "కావ్యకళానిధి" బిరుదము నొసంగి నన్ను గౌరవించినందులకై ప్రొద్దు
టూరు హైస్కూలులో "కళానిధి" బహుమానము శాశ్వతముగా నెలకొలిపిన శ్రీ
(
వు బహదూరు వి. వసంత రావుగారి యాదార్యమును గణింతును.</p>
<pb n="7" />
<p>3
1934 జనవరి మాసమున గ్రంథము ప్రతులు నాయొద్దఁ జేరెను. నాయెఱిఁగిన కవు
లకును, బుడితులకును, మిత్రులకును, బంపుకొంటిని. వారందఱు సంతోషించి నాయోగ్య
తకు మించి నన్నుఁ గొనియాడిరి. వారికృతమును మఱవను. ఒక్కొకచోఁ బది - పదు
నాఱు పుటలవఱకును బ్రాఁకిన యమూల్యాభిప్రాయములను సంగ్రహపఱచి ముద్రింపించి
నందులకై వారు క్షమింతురని నమ్మదును. నా గ్రంథము నెడ నపారాదరము నెఱపిన బ్ర
చిలుకూరు నారాయణరావు పంతులు ( M. A. P.H.D. ) గారీ యుదార-మృదు-హృద
యమును నేను ప్రత్యేక విశ్వాసముతోఁ గొనియాడు చున్నాను. ప్రతాపమహారాణా
గారీ త్రివర్ణ చిత్రపటము ప్రతు లొక సహస్రము నాకుఁ బంపి యుపకరించిన భారతీపత్రికా'
సంపాదకులు శ్రీ. గన్న వరము సుబ్బరామయ్యగారి సాయము స్మరింతును. మైసూరు-
మద్రాసు విశ్వవిద్యాలయములవారు గ్రంథమును వరుసగా "నింటర్ మీడియెట్_బి. వ."
పరీక్షలకుఁ బాఠ్యముగ నిర్ణయించి నన్నుఁ బ్రోత్సహించిరి.
చతుర్థాశ్వాసమున నొక్క యెడను బంచమాశ్వాసమున నొక్క తావునను గొన్ని
పద్యములను జేర్చుటతప్ప నీముద్రణమున నా చేసిన మా ర్పొక్కండును లేదు. ఈ కావ్య
మున లేశమేని గుణము గనఁబడు నేని యిది యాంధ్ర మహాజనులమన్ననకుఁ బాత్రమై
శాశ్వతస్థాయి నలరారుఁ గాతమని పరమేశ్వరుని బ్రార్థించుచు నుపరమించు చున్నాను.
ప్రొద్దుటూరు.
1—9—35.
}
అవధాని పంచానన -
ఇట్లు,
కవిసింహ - కావ్యకళానిధి,
డి. రాజ శేఖరశతావధాని.</p>
<pb n="8" />
<p>అభిప్రాయములు.
The book has duly been presented to His Highness, the "Maharana"
Sahib Bahadur and I am desired to Convey to you His Highness's thanks for the
same.
Udaipur.
20-8-1934.
Yours faithfully,
}
The poet has far excelled his original Todd. The central character, the
hero of heroes is Rana Pratap. He is depicted as the truest Rajayogin. With no
kingdom, no forts, no army, no shelter. no food, except edible grass, he raises
the banner of freedom aloft, holds it high for twenty five years against Akber,
the greatest emperor of the day, declining to whisper into the ears of Raja Man
Singh one word of submission to the Mogul Fadushah. His stern simplicity, his
intrepid valour, his resolve to defy fate and worship at the shrine of liberty, his
unyielding pride in his Solar descent, his patriotic attachment to the barren
wilds of the Aravalli Hills, his chivalrous courtesy even unto the enemy are all so
painted in words that the written word appears to transcend the best colouring
effect on the convass. No sense of despair mars the effect of his marvellous courage.
The series of his [Pratap's] valourous deeds constitute a reading that is rivalled in
Telugu literature only by the deeds of Bhishma and Abhimanyu in Thikkana's
Bharata.
TEJ.SIMHA,
Madras.
19-6-34.
The portraiture of the opposite camp is no less elevating. One can easily
find modern parallels for Akbar and Man Singh. There does not however appear
to be a parallel to "Abdur Rahiman" the chif minister of Akber. He is the noblest
of the noble, the flower of Islam, the truest devotee of true Virtue............... The
nationalistic outlook of the work is really a pleasure to ponder over........………………….………
3
Private Secretary.
In two
The poet's style is classic. It is what moderns in Telugu call "Grandhic."
However the flow is so natural, the language is so idioulatic, the illustrations
are so familiar, the expression is so homely and pithy that the most modern pedant
would have very little quarrel with the poet for the style employed.
cantos does the poet show his partiality for Sanskritic metre. The rest of the
work abounds in the quick mellifluous cadence of the native metre.
}
"THE HINDU."
The production of this beautiful book marks an epoch in the modern
Telugu literature. The author takes us back to those glorious days of India when
Freedom's battles were fought in the great theatre of the Indo-Gang etic plain. It
is highly Miltonic in conception and the reader's attention is sustained throughout
by the rich mental imagery contained in verse after verse. There is a superb touch</p>
<pb n="9" />
<p>of epic grandeur about the work and the intense heroism and love of country
displayed by "Rana Pratap" are very well depicted; in short the reader is roused
to a sense of hero-worship. The tense situation between the Hindu hero on one
side and the Great Mogul on the other, is rendered highly melodramatic and the
reader cannot go through this portion of the work without a thrill of enthusiasm.
The whole work is classical in tone and the historical background is so true and
accurate that the author deserves immense congratulations for his great deligence
and fidelity to details.
I have very great pleasure to commend this book for introduction in
High Schools and Colleges.
}
Anantapur.
22-4-1934
I have read a portion of your work. As a matter of fact no opinion is
needed for your beautiful poetry. As for as I read it is very interesting with
beautiful thoughts and charming style.
Yours sincerely
GULAM DASTAGIR,
D. E. O. Cuddapah-Anantapur Dists.
Rajahmundry.} CHILAKAMARTI LAKSHMI NARASIMHAM.
19-5-34
The work is certainly on a par with our epic poems. You have kept
up your word that your composition will be in "9**55."
}
Cokanada.
18-11-34
25-9-34
M. VEKATA RAMAIYA
A book of this kind is oppurtune at present. "Rana Pratap Singh," is
sure to inspire the leaders and the rank and file to act like a phalanx in union,
and sacrifice their lives, if necessary, for the cause of the country.
P. PARTHASARATHI IYENGAR,
}
Sub-Judge.
A
Subordinate Judge.</p>
<pb n="10" />
<p>1
of
గీ1 పక్వమగు తీయమామిడి పండుమాడ్కిఁ బదపదంబున రసముట్టి పడుచునుండఁ
బదియు నెనిమిది వందలు 4 పద్యములను గావ్యముగ వ్రాసి కంటి వ ఖండకీర్తి !
గీః సరళముగను జల్లఁగనుర సంబుఁగురిసి తన్మయత్వముఁ గూర్చి గ్రంథంబునడుపు
ప్రజ్ఞ నీసొమ్మటంటి; నా పట్టులందుఁ దిక్కనక మీద్రుఁ దలపించు
+
దీప్తిఁగంటి !
కొజ్జబుతి
గీ॥ ఉత్తమోత్తమ వీగుల కుండవలయు నుత్తమోత్తమ గుణముల
నిల్వుటద్దంబునై యొప్పు నీప్రతాపువీర చరితంబు "రెండవ భారతంబు" !
గీః అన్న! నేఁటి మహాసభాధ్యక్షుఁడనయి బారుతీరిన విబుధుల ప్రార్థనమ్ము
వఱలఁ "గావ్యకళానిధి" బిరుద మొసఁగు భాగ్యమునుగాంచి పరవశత్వంబుఁగంటి.
జనమంచి శేషాద్రిశర్మ.
}</p>
<p>(ఆవిష్కరణ మహాసభాధ్యతులు.)
(తిరుపతి వెంకటేశ్వరులు)
(ఎం. ఏ. పి. హెచ్. డి.)</p>
<p>ప్రొద్దుటూరు.
17-12-1933
♦
ఎచ్చట నేరసము చిలుకవలయునో అచ్చట నారసము గలదియై, నిర్దుష్టమై,
"రెండవభారత" మన్నంత యంద చందములతో మీకవిత యున్నదని నాకుఁ దోఁచినది.
ఇది సూత్రపాయమైన నా ముఖ్యాభిప్రాయము.
కడియం.
అనంతపురం.
29-4-34
చెళ పిళ వెంకటశా
చెళ్లపిళ్ల
వెంకటశాస్త్రీ
స్త్రీ</p>
<p>నమస్కారములు. తాము సాదరముగ పంపిన "రాణాప్రతాపసింహ" చరిత్రమును
కృతజ్ఞతతో స్వీకరించినాను. దాని నామూలాగ్రముగఁ జదివితి. చరిత్ర గ్రంథమును
కావ్యముగ వ్రాసి రసవంతముగ నిర్వహించడము కష్టమైనపని. మీకథాకథనవిధాన మిప్ప
టీ కద్వితీయమైనదని చెప్పిన అతిశయోక్తి అని తలంపరని నమ్ముచున్నాను. ఇంతటి పెద్ద
కావ్యాల నింతచక్కగ వ్రాయఁగల వా రింక నుండడము శుభావహము. మీకవితాధార చే
తనిసినాను. మీకు ధన్యవాదములు.
చిలుకూరు నారాయణరావు,</p>
<p>క॥ చదివిన భారతమేకద చదువంగా వలెనటన్న సామెత వృధయై
పొదలుఁ బ్రతాపచరిత్రము చదివినవారలకు నెందు సత్కవితిలకా!</p>
<pb n="11" />
<p>5)
చ। పలుకులఁ దేనె లుట్టిపడు!
భిలు! వినువారి వీనులకు
య్యిలఁ చుల లేదు నీకవిత
దలలఁ గదల్పఁజేయు విబు
కడప.
23-12-1933.
7
♦
భావములందు స్వతంత్య్ర దీప్తి శో
విందు లొసంగు కథావిధాన! మి
యెతయుఁ దిక్కన భారతం బె! యాఁ
ధపరికరంబున కంచుఁ దెల్పెదళ్.
మైసూరు.
30-8-34
కావ్యపురాణతీర్థ, విద్వాజ్,
జనమంచి వెంకటసుబ్రహ్మణ్యశర్మ,
ఆంధ్రోపాధ్యాయుఁడు.
పరశ్శీతప్రణమములు:
తమ రచన చాల గొప్పది. ఒకానొక కాలమున నేనును ప్రతాపరాణా చరిత్రమును
పద్యకావ్యముగ వ్రాయ నుత్సాహపడి యుపక్రమించి యుండినవాఁడను. సుమారు 300
పద్యములు వ్రాసి నడుమంత్రమున వదలితిని. వాఁత గ్రంథము గూడ నా వద్ద లేక నశించినది.
తమ గ్రంథముఁ జదువ మొదలిడఁగానే నా ప్రయత్నము నిరవశేషముగా నశించుట
యెతో మేలే యాయె ననిపించినది. ఇంత గొప్ప గ్రంథమును ఒక టేధారతో అందదుకులు
తొడుకులు లేక రచించి ముగింపఁగల్గిన తమశక్తి సామర్థ్యముల కాశ్చర్యపడి యభినందించు
చున్నాను. తమిది ప్రబంధముల పక్వతతోఁ గూడిన పురాణశయ్య. ఈ శైలిలో నిజ
ముగాఁ దా మొక పురాణమునే వాసియుండిన నెట్లుండెడిదోయని యాశపడుచున్నాను.
ఈస్థితిలో నీకావ్యము నింతర సవంతముగాఁ బఠనీయముగాఁ జేయశక్తులు చాలమంది లేర
నుట నిస్సందేహమైన విషయము. ఎక్కువ విన్నవింపలేను. యధావకాశముగా గ్రంథ
మును బూగ్లిగాఁ బఠింతును.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ.
శా॥ భావాభ్యున్నతి, దానికి కొదగిన
రూపన్యాస మద్దానికిక్
లావణ్యంబిడు సుప్రసాద గుణలీలల్ దానికి సత్కళా
జీవంబౌ రసమాధురీమహిమము శ్రీ సిద్ధించి నీకావ్య వి
ద్యావైశద్యము పండెనోయి! కవిసిం హా! నీకు బ్రహ్మాయు వౌ.
శా॥ సమ్యగ్వాఙ్మయ పద్ధతినడదు భాయోషకు నీచపుం
గ్రామ్యంపుంబడి దాపరించె: విమల ప్రాచీకళాసూచక
1</p>
<pb n="12" />
<p>స్వామ్యంబుల్ నశియించె! నిట్టియెడ దు స్సాహిత్యధూమ్యాకుల
భ్రామ్యజ్ఞతికి నీతా పకృతి దీవ్యజ్యోతియై ద్యోతిలుక్!
చ॥ తఱచిన భారతంబొకఁడు తక్క నిజానకు వీర కావ్య మీ
వఱ కుదయింపలేదు మనవాఙ్మయమందొకఁడైన; జాతికి
బరువము మాతృదేశమున భక్తి మదిక్ బురికొల్పి నేఁటి కా
తఱుఁగు భవత్ప్రతాపుచరితంబునఁ దీఱినదోయి! మిత్రమా!
మ। పరమాభ్యున్నత భావపర్వత పతద్వాగుంభ గంభీర ని
ర్ఘరవీచీ రసధారఁ గావ్య సరసిక్ సంధించి ఛందఃపరం
పరలక్ కాల్వలు జాలువార్చి తెలుగు మాగాణి జాతీయకా
వ్యరసారామము వెంచితోయి! కవిసిం హా! కావ్యపంచాననా!
సీ! అలచిత్రకారు రంగులమాఱి రాణాప్రతాపసింహక్ష్మాపు రూపపటము
ననరాదుకాని; నీ । యమృతాక్షరన్యాసమూర్తిముం దది వెఱ బొమ్మమాత్ర!
బ్రహ్మకల్పముదాఁక . వన్నెమాయనియట్టు లాత్మయ కొలిమి మీ రాగ్ని బలిమి
కవనంపుమూసలోఁ 4 గఱఁగి మేల్సీసాన జాతీయ తాముద్ర . పోతపోసి
గ్రీ వీరరాణావతాపరా డ్విగ్రహమును దెనుఁగుఁగోవెలఁ బ్రాణప్రతిష్ఠ చేసి
నిలిపితివి! చేరి మనసారఁ గొలుచు నాంధ్ర వీర సంతతివాంఛ లీ డేరుఁగాక.
కాళహ సి.
4-9-34
కవితాకళానిధి: బలిజేపల్లి లక్ష్మీకాంతకవి.
ఆధునికులగు తెలుఁగు కవులకు దేశభక్తి-దేశాభిమానములు శూన్యములు. వారి
గ్రంథములలో దేశప్రబోధకములగు రచనములు తక్కువ. చారిత్రాత్మకములు కడుంగడుఁ
దక్కువ. చరిత్రాత్మకములై దేశభక్తి నుద్దీపింపఁజేయు పద్య కావ్యములు లేనే లేవు.
వేలసంఖ్యను మించిన తెలుఁగు కవులలో దేశమును దలఁచుకొనువా రరుదు. భావకవుల కీ
గొడవ పట్టనేలేదు.
ఈ సుకవి కవిత్వము రసవంతమైనది. శైలి మధురమైనది. ధార గంగా ప్రవాహ
వేగముగలది, పదములు పొందికయు భావగౌరవమును మిక్కిలి మెచ్చఁదగినవి. జాతీయ
ములును లోకోక్తు లును తమంత వచ్చి మూఁగి పడినట్లున్నవి. ప్రతిఘట్టమునను బ్రతి పద్య
మునను గవికిఁగల దేశభక్తియు, శూరశిఖామణి యగు పతాపసింహమహారాజసింహుని</p>
<pb n="13" />
<p>9
యం దీ కవిసింహునకుఁగల భక్తి-గౌరవములు తొలుకాడు చున్నవి. ఎచ్చటఁ జదివినను
జదువకుల హృదయములు కరఁగి నీరుగాక మానవు. ఎంతటి దేశద్రోహులైనను దేశ
భక్తులు మాఱక మానడు. ఇట్టి విశేషములు వివరముగఁ దెలుపఁబూనిన నిది యొక
గ్రంథమంత యగును.
నిడుదవోలు.
మంగిపూడి వెంకటశర్మ.
♦
♦
గీ॥ మొగముముందఱి యిచ్చక మ్ములకు దిగక మనసులో మాట వల్కు పేశీ మంచిదేని
నామతంబున వీరరా + ణాపతాపచరిత గమగమల్ పైఁ జిమ్ము జాజిపువ్వు;
కప్పురపుఁ బల్కు పొదిగిఁటఁ
కుదుపు టొరపిళ్ళ సుడియక
చిదుమఁగారాని రసమొదుఁ
గవిసికొన్న వింతయేడాకులరఁటి బాలెంతరాలు!
కుదురునడల నిండుకొని పాఱు నెలఁదోఁగనీటికాల్వ !
జిందువాఱ గింజ లలమని కమ్మనా రింజ పండు;
తీర్పు మార్పుల నంది పందిరులఁబోక యనువుమై నల్లు నవకపు టడవిమల్లె
చిఱునగవుఁదేలు చిటిపాప చిన్ని మోము సిగ్గుఁఱనాడు ముగుద కుచ్చితపుఁజూపు!
నలఁతవోని కుచేలు ని ల్లాలిహృదయ! మొడలెఱుంగని వీరు క ట్టడి కటారు!
విధులు నవ్వు వసంత వా సరములందు : జలకమాడి చల్వలు గట్టి కలప మలఁది
ప్రొద్దుట 'షికారు' వెడలు మారుతమువోలె నందుఁగాత వికృతి జన స్వాగతమ్ము !
ప్రొద్దుటూరు.
17-12-1933
విద్వాజ్ కవిసింహ అవధానిపంచానన,
గడియారము. వెంకట శేషశాస్త్రి
తెలుఁగు పండితుఁడు. మునిసిపల్ హైస్కూల్,
గీః కాలకుహరమ్మున బిట్ట కతల ముచ్చమునిఁగి తనుఁగు ప్రతాపసిం హుని చరిత్ర
నీకలము యోగదండమై నీవచస్సు జీవనద మంత్రమై చిరంజీవిఁజేసె.
అమృతబీజాక్షరమ్ముల 4 నామహాత్ముకతకుఁ బ్రాణమ్ము వోసిన శ్రీ కవివి! రాజ
శేఖరా! నీసమాఖ్య సుస్థిరతఁగాంచె ధన్యతమమయ్యె నీకవితా ప్రవణత!
తళుకు నగిషీలు లేక ముస్తాబు లేక, చికిలి చిత్తరి జిలుగు బచ్చెనలు లేక,
మెఱుఁగు మఱుఁగులు, గులుకుల మురువు లేక, కసరతులు పల్లటీల్ లేక, గతి మలఁపక,
తాత ముత్తాతనాఁటి ఛాందసములేక పాత కొత్తల నడిమిత్రోవల ఘటించి
వస్తువునకౌ పదార్థ సం పత్తిఁ గూర్చి వ్రాయఁబడినది ప్రకృతిప బంధ మిద్ది!
సానఁదీరిన మెఱుఁగు వజ్రాలమాలఁబోలు: సారళ్యమున నీపదాలచాలు;</p>
<pb n="14" />
<p>10
నీదు
సహజధారకుఁ బొసఁగెఁ బ్రసాదగుణము: భవ్యన వ్యానుకూప దాంపత్య సరణి.
నుఱుఁగుఁదరగలఁ బొర్లెత్తితొరఁగు గాంగనిర్ఘరము గెల్వ సఱచు బందెము
భావ వీచీ సమాలోల వాకవంతి! ప్రస్తుతి కతిక్రమించె ధారాప్రసక్తి !
వీరరస మేకధారగా వెడలఁగ్రాము "హోల్డిఘాట్" ముస్నుగా భీకరాహవ ప్ర
కరణములు విన్నఁ జదివిన నరుని గుండె: నడికడలి నుప్పెనక్ సుడి వడ్డెడు పడవ
వడువు నొడి-దుడుకులఁబడి యడలవలయు.
ఆలు పిల్లలతోఁ బ్రతా , పావనీశుఁ డడవులం బడ్డ యిడుమలఁ దడవు నపుడు
కంటఁ దడిపెట్టవలె నెట్టి కటికయైన: ముదముఁ దెల్పితి నిటు మనఃపూర్వకముగ.
మున్నంగి - లక్ష్మీనర సింహశర్మ.
ఏలూరు.
సీ॥ ఈకాలమునఁ గవు । లింతయుద్రంథమ్ము పూని రచించుటం తైన గొప్ప!
ఇంత గ్రంథములోన 4 నెచటనైన రసంబు చిప్పిలుచుండుట
కన్నీరు పులకలు Xమ్మనై కరుణమ్ము వీరరసము వెళ్లి
జీవకళల్ గల్గి యీ వీర చరితమ్ము సరిగ భారతమును జ్ఞప్తి ఁదెచ్చు!
*
గీ॥ నవ్య భారత సృష్టి రాణాప్రతాప! భావపుష్టి పనౌచితి పద్యగతియు
గొప్ప గొప్ప!
విరిసె నౌర!
దివ్యముగఁ దోఁపఁ గృతిదిద్ది తీర్చినాఁడు రాజశేఖరకవి! కవి శ్రీ రాజమౌళి
సీ! పంచపాండవులొక్క ప్రభువయి రాణాప్రతాపసింహుుడు ప్రత్యక్షమయ్యె!
ఢిల్లీశ్వరుని గూడి శ్రీ యల్లరాధేయు వైఖరి మానసింహుండు । గానఁబడియెఁ!
దక్కుయోధులు రెండు దిక్కుల గుణకర్మ యోజనల్ భారతయోధులట్ల
యుద్ధముల్ భారత యుద్ధంబులట్ల, "రెండవ భారతం" రాణాప్రతాప!
గీ॥ ధర్మమర్మములను వీరకర్మములను జక్కఁగృతి గూర్చి తిక్కన సాటిచెప్ప
నొప్పుననఁగ నాంధ్రావళి కుపకరించె రాజ శేఖరకవి! కవి రాజమౌళి!
పొద్దుటూరు.
17-12-33
కవిరత్న, కసిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి.
రాణాప్రతాపసింహచరిత్ర ప్రత్యేక వై లక్షణ్యముగల యొక యద్వితీయకావ్యము.
భారతము_ భాగవతము విడిచినఁ బలుమాఱు చదువఁదగ్గ గ్రంథములు లేక యాంధ్ర
విద్యార్థుల ముగలార్చు చుంటిమి. మీ రా కొఱఁతఁ దీర్చితిరి.</p>
<pb n="15" />
<p>11
గ్రంథము మొదటినుండి తుదివఱకు 1800 పద్యము లొక్కఁడే లిరికుగా (Lyric)
వ్రాసిన మీ యపూర్వము నలౌకికము నగు నా వేశము నెట్లు ప్రశంసింపవలెనో యేర్పడకు
న్నది. మన పూర్వకవులేయైన మానసింహు నెంత యధమునిగా మార్చియుందురో! అతని
యుదా
త్తత, యాద్ధ్యత్యము, శౌర్యము కన్నులఁ గట్టినట్లు చిత్రించిన మీరు " Poet is
the noblest specimen of his Age అనిన కార్లైలుగారి పలుకు సత్యము గావించి
తిరి. ఏండ్ల పర్యంతము లోపలనే కుములుచుండి హఠాత్తుగ నగ్ని పర్వతమునుండి పొంగి
నిరాఘాటధాటితోఁ బ్రవహించు "లావా"వలెనున్న మీకావ్య మాంధ్రదేశమునఁ బ్రసరించి
హృదయముల నుడికింపఁ గలదు.
తెనుఁగున గణింపఁదగిన గ్రంథములఁ గూడ "రహి-మహి" జాబితానుండి యన్ని
పదము లవిచ్ఛిన్నముగా స్వీకరింపఁ బడినవి. అట్టి లోప మొక్కఁడును లేక విమర్శకుల
యెదురఁ దలయెత్తి చరింప మీ రవకాశము గలిగించితిరి. మూ లేతిహాసమునఁ బదునాలుగు
పేజీలున్న యితివృత్తము గ్రహించి మూలాతిక్రమణము చేయక వీరకరుణముల రెంటినే గై
కొని జీవరస మొలికించి పాఠకునకుఁ బరమాణువంత వినుగుకూడఁ దోఁపకుండునట్లు
రచించిన మీ యద్భుతశక్తి కొనియాడఁ దగియున్నది.
ప్రొద్దుటూరు.
17_12_35.
వి. ఉమామహేశ్వరుఁడు, బి. ఏ.
గీ॥ "తెలిసె! తెలిసె! నిప్పుడు తేట తెల్లమయ్యె' నేలరాడోఁ మా యన్నయ్య యిల్లు గదలి
యేలపాల్గొనఁడో ప్రజా ! హితములైన పనులయం"దని నామనం । బునఁ దపింతు!
నేలుచుఁ డెఁ!
నా తపసు పండె! హేతు వీ నాఁడు తెలిసె' నే ననుకొను రీతిగ గుడిలోన దేవుఁ
డున్నటుల మిన్న కింటఁ గూర్చుండ లేదు! మేలు మేలు! చితోడ్డడు
దివిరి స్వాతంత్ర్యరక్షణ
ప్ర్రబల శత్రు వక్బరు ఢిల్లీ
ధైర్యలక్ష్మితోడ కొలంది
శత్రువీరుల గుండియల్
దీక్షతోడ దుర్నిరీక్ష తేజమున శత్రువు నెదిర్చి
పొదుపాయె యే త్రివచ్చిన తొణకక కత్తి గట్టి
దండుతోడ లావు మెఱసి యసంఖ్య బలంబుగలుగు
జలదరింపఁ జైతకాశ్వము వైరి వ క్షములపైన
గొరిజ మోవఁగ దుముకించి యురవడించి యొర దిగిచి కత్తి కుత్తుకల్ నరికి నరికి
నెత్తురు వసంతమాడి లో కోత్తరముగ హాల్డిఘాటాదిగా సమరాంగణముల
నిలిచి వీర విహారము సలిపి మేనఁ దొరగు రక్తముల్ జడివాన గుఱిసి రాజ
పుత్ర కాయము లొగి గాయ ములుగ మాఱఁ జెట్టునీడ సౌధము గడ్డి-రొ ట్టెతిండి</p>
<pb n="16" />
<p>12
పట్టుపొన్పై శిలాతతి। । యట్టె పండి పట్టపుందేవి బిడ్డలు చుట్టుఁ గొలువ
నబ్బురంబుగఁ దాను సిం హంబువలెనె యడ్డులేని యరణ్యరాజ్యము వరించి
యక్బ రీఁజూచు నీవుల । కాస పడక యేక్షణమ్మును స్వాతంత్య్ర దీక్ష విడక
నిది నిజం
మే సుమండి!
చాలునని పాదుషాయె వేసారువఱకు "అన్న యక్బరు తోడఁ బో శ్రీ రాడుచుండె
ఎల రాఁడొ మా అన్నయ్య యిల్లు గదలి! ఇందు కేసుమి రాఁడని యిపుడు తెలి
తప్పని సరిగ రాణాపతాపసింహుఁ డిచటఁ గవిసింహమై పుట్టె!
సిద్ధముగ దొడ్డ యా రాజ శేఖరుండు! ఇపుడు డీ. రాజ శేఖర
కత్తి కలమయ్యె! విశ్రాంతి గాంచి శ్రమముఁ బాసి స్వీయ చరిత్రము వ్రాసెనను
భావపుష్టి, పదాచితి, + పద్యగతుల నితరు లేగుణముల మెత్తు . రేని నేను
మని శతవధాని పూర్వజ స్మంబులోని చర్య మఱువని జ్ఞాపక శక్తి మెత్తు!
ప్రొద్దుటూరు,
♦
17-12-83
చ తెనుఁగున భారతంబు మఱి
పుని చరితంబుఁ బోల్ రచన
ఇట్ల', మెచ్చుకొను
ఏ.కె. ముని.
దిక్కన దాఁటినఁద నీప్రతా
ముక్ నినుఁబోలిన సత్కవీంద్రుని
గని విన దాంధ్రభూమిసుమి! గ్రంథము రెండవభారతం బె! నీ
వు నపరతిక్క యజ్వవని పూజ్యులు వల్కుట తథ్యమే యగుక్.
ఉ॥ ఈయఖల ప్రపంచమున 4 నెందును లేనివి భారతంబు రా
♦
మాయణమట్టి కావ్యములు! నందలి వీరులకన్న మిన్నయై
పాయని ధైర్యశౌర్యగుణ వైభవధూర్వహు నొక్కనిక్ మహా
నాయక సార్వభౌము జతనంబున నిచ్చితి వెట్టి ప్రోడవో!
♦
గీ! పరమగీతా రహస్యంబు భౌతి దీని ముప్పదైదుకోటులు హైందవులు దినం:
.
భ క్తి ఁ ఔరాయణముచేయ , భరతఖండ మఖిల విశ్వోన్న తైశ్వర్య మందు టక
సి. సుబ్రహ్మణ్యశర్మ.
ఎచ్చటఁ జూచినను శైలి కరము మనోహరమై యనర్గళధారా విలసితంబై
శాంధ్ర పదయుతంబై యలరారుచున్నది. చరిత్ర విషయముల నింత లలితముగా ప్ర
ట కడింది. అయినను గ్రంథకర్తగారు దీనిని మిక్కిలి నైపుణ్యముతో వీరరస ప్రధాన
రచించి యునికి శ్లాఘనీయము. "కావ్యకళానిధి" బిరుదమునకుఁ గవిగా రెంతయు సC</p>
<pb n="17" />
<p>13
ఈ గొప్పకావ్య మన్ని విధములఁ బ్రశంసనీయము. ఆంధ్రభాషాయోష కొక యనుత్తమ
భూషణంబై విలసిల్లు చున్నది. గ్రంథమంతయు నొకేస్థాయిగా రసవంతముగా వ్రాయుట
చాలఁగస్టము. కవిగా రతిచమత్కారముగా నిర్వహించి యున్నారు.
"విమకృ కాగ్రేస"""
నాగపూడి-కుప్పుస్వామయ్య బి.ఏ.
గీతా పారాయణమునకువలె నడుగడుగునకు ద్విగుణీభూతో త్సాహంబున ధారాళ
దా? మోపాకంబునఁ వెలసిన భవద పారస్వాతంత్ర్య వీర ప్రబంధముఁ బఠించి నాయనుభవిం
చిన యానందమునకు మేరయే లేదు. అనర్గళధారాశుద్ధి గలిగి యుపమా సందర్భములఁ
గాళిదాసుని దలపించుచు, నుభయభాషాప్రవేశ గాంభీర్యముఁ దెల్పుటకోయన సాంస్కృతి
కంబుల నటనటఁ బచరింపుచుఁ దెలుఁగునుడికారంపుఁ దీయందనంబులఁ దిక్కయజ్వ కుద్ది
యనిపించుచు లోక జ్ఞతం దెల్పు నుడుల నవల్ప బుగఁ గురియించుచు మీకాన్యరచన మ
పారప్రతిభా వైశద్యమును వెల్లడించింది. ఉ తమములగు జాతీయములు జానుదెనుఁగు ను
డికారములు చక్కనినానుడులు మనోహరాలంకారములు గుంపులు గుంపులై తమంత
వచ్చి దూఁకినట్లు గ్రంథమంతయు రససమాకీర్ణమై శ్లాఘనీయమై యున్నది. ఈ గ్రంథము
భారతమునకుఁ బై చేయి. ఈగ్రంథము వ్రాసి మీరు ధన్యులై యాంధ్రలోకము ధన్యతఁ
బడయఁ జేసితిగి. ఈగ్రంథముఁ గూర్చి యెంతదూరము ప్రశంసించినను కొఱఁతయే యగును.
యస్. విశ్వనాథశర్మ,
ఞ
లెక్చురర్, నైజాంకాలేజి,
ఉ కాంచితి నీదుపొ త్తమున ఖండపు టోపికతోడఁ! బూర్తిగా
మంచిది శుద్ధి! కూర్పు కడు శీ మంచిది! మంచిది శయ్య! పాకమ్ు
మంచిది! రీతియు మిగుల మంచిది నీకృతియందుఁ! గాన ని
న్మిచు కవీశ్వరుల్ ధర జ నింతురు నూటికిఁగోటి కొక్కరై
5-8-1935.
కాశీ-కృష్ణాచార్యులు,
శతావధాని.
వ
మీకావ్య మిప్పటి కబ్బపుంబలుకులమ్మకుఁ గులుకుందొడవు. చూచి పరమానం
దము ననుభవించితిని. జాతికి వార్తకుఁ గని. సహృదయహృదయముల రంజింపఁ జేయుచున్న
ది. మొగల్ చక్రవర్తులఁ దబ్బిబ్బుపఱచిన ప్రతాపసింహుని చరిత్రమును వర్ణించుటకు మిము
వంటి కవిసింహులే సమర్థులు. మీ రచన నవకవుల కాదర్శకమై ముద్దులొలుకు చున్నది.
ఉభయభాషాప్రవీణ జి. జాషువా.</p>
<pb n="18" />
<p>14
ఆనంద మందితి. ప్రతాపుని పాత్రముఁ జక్కగఁ బోషించితిరి. ఆనాయకుని
మును బ్రౌఢచర్యలు నమోఘముగ వర్ణించితిరి. కాలస్థితి ననుసరించి వలయు సో
యుఁ బెద్దల యెడ గౌరవము నద్భుతముగ వివరించితిరి. కులగురువులగువారికెల్ల నీతి
గలిగిన "భామాసాహి" శిష్యవాత్సల్యము త్యాగము వివరించునెడ నానంద బాష
కెంతయు నడ్డులేకపోయె. జోషీబాయి - పృధ్వీరాజు అబ్దూరహిమానుల ధీరోదా.
గుణసంపత్తియు సార్వభౌమునిముంగల జరపు సంభాషణమును క్షత్రియకులమ
కు వన్నె పెట్టుచున్నవి. అది యిది యననేల! గ్రంథమంతయు రసమున నుజ్జూఁతలు
న్నది. పిప్పి వెదకినను గానరాదు. కడుదీనదశఁ గూడ బిడికెడు మన్నెత్తి మేవాడ
మాతృభూమిని శిరసావహించి ప్రకటించిన దేశమాతృభక్తితత్పరత నిరుపమానముగ
పఁగలిగితిరి.
గా. రామేశ్వరరావు.
కావ్యములలో ప్రత్యేక లక్షణములతో శోభిల్లునవి అకుడు. ఏకావ్యమును
ను ఒక్క అచ్చులోనుండి తీసినకమ్మి. ఒక పోటోకు సకలు, కావ్యశిల్పమున ప్రతే
క్షణ్యమును గలిగినవి శ్రీతిరుపతి వెంకటకవుల గ్రంథములు. తరువాత అట్టి ప్రతే
కాశముతో వచ్చినది ఈ 'రాణాప్రతా పసింహచరిత్ర' యని చెప్పిన సాహసము కా
ఎంత ఛందోయాత్ర చేసినను భాషావాహిని భావవాహినితో సమగతిని ప
నదిగాని కుంటువడ లేదు. అలయలేదు. వెనుబడ లేదు.
ప్రతాపునివలెనే యీకవియు వీరవ్రతుఁడేమో యనిపించునట్లు ఎంతకాలన
యో అంతర్హితమైయున్న ప్రతాపవహ్ని ఒక్క మాకుగాఁ బైకుబికి వచ్చినదా ఆ
నడిచినది కావ్యము: ప్రతాపుని అతని ప్రతిస్పర్ధులనుగూడ సమదృష్టితోఁ గాపా
నది కవి మనీష. పిడి కెడు మట్టిని జేకొని మేవాడవీరులు మాతృభూమిని శిరసావహి
చిత్రించిన యీకవి చాతుర్యము వర్ణ నాతీతము.
18-8-34.
"కృష్ణాపత్రిక. "
బహుకాలమున కొక గొప్ప పురాణమును జూడఁ గలిగితిమి. ఈ పురాణ
మైన ఐతిహాసికము. ఈ గ్రంథము భారత-భాగవతాదుల సంతతిది. ఇఁక ముంద
పల్లెయందును భారత-భాగవతములవలె దీనిని గూడఁ బౌరాణికులు జనులకుఁ
పింపవలెను. తిక్క-న-పోతనలు నామము లెంతకాలము ఆంధ్రులందు స్మృతిపధము
నో యంతకాలము మన కవిశేఖరుని నామమును స్మరింపఁ బడుచుండుఁగాక.
1</p>
<pb n="19" />
<p>15
ము భారతమున కెందును దీసిపోవనిది ఆధునికులలో నింతకన్నఁ బెద్ద గ్రంథములు (పురా
ణములు) వ్రాసినవారు లేకపోలేదు. కాని వానికన్న నీగ్రంథమే పూజనీయమైనది.
మాతృదేశభక్తి . స్వాతంత్య్రరక్తి, సాహసౌదార్య ధైర్య కార్యోద్వృత్తి వీనిని బుటబుటయం
దును బద్యపద్యమఁదును బ్రకటించి యా యా రసములఁ జక్కఁగాఁ బోషించి యాంధులను
సంతతాఖండ మృదుమధుర మధుధారాకవిత్వ రసానుమోదకులగాఁ జేసిన మనకావ్య
కళానిధిగారి జన్మము ధన్యమైనది....
... వీరరస మొక్కఁడే యిందు గ్రహింపఁ
బడినది. అదియే మన కిప్పు డవసరమైనది. అది చచ్చుటచే మనమును జచ్చినట్లే యున్నా
ము. ఇక ముం దాలంకారికులు "ఏకోరసో వీరఏవ" యని నియమింతురుగాక.
శ్రుతి
గ్రంథమంతయు నిర్వచనమేయైనను కవిత యొక్క చోటనైనను కుంటువడక
కటువు జబ్బుయల్లిక పులిమిపుచ్చుటకై తెచ్చుకొనిన పాదపూరణములు. ఎందును గాన
రావు. బెందడి బిలుకులు లేక తీర్చి మలిచిన రాళ్ళతోఁ గట్టిన కవితాపుణ్యాలయ మిది. మం
చి సామెత లిముడ్పఁబడియున్నవి. ప్రతాపుని గుణము లనంతములుగా వర్ణింపఁబడినవి.
ఇట్టి యుత్కృష్టగ్రంధము సర్వాంధలోకమందు శాశ్వతముగ నాదరణీయమై వెలయుఁగా
తమని కోరుచున్నాము.
0_1_44 ఫసలీ.
"గోలకొండ పత్రిక."
ఈకవిగారు 1900 పద్యములుగల బ్రహ్మాండమైన చరిత్రమును రచించిరి. దేశచరి
త్రములలోనుండి యిదివర కెన్నడు నెవ్వరు నింత గ్రంథమును బద్యములుగు రచియించి
యుండలేదు. గసానుగుణవర్ణనములతోఁ బద్యములు నిర్దుష్టముగఁ జక్కని నడకతో నొప్పు
చున్నవి. పలువురు తలంచునట్లు వీరిని యతిప్రాసలేమియుఁ గష్టపెట్టలేదు. శంకరకవి చెప్పి
న ట్లిందుఁ దాముతామే యుచితస్థితి వచ్చి నిలిచి కష్టపెట్టునని భయపడు వారిని నవ్వు చున్నవి.
కవిగారి కవిత్వ శైలి కిప్పటి ప్రసిద్ధకవులు హర్షజలరాశిఁ దేలెదరు. సంస్కృతమునుండి
యా ధ్రీకరించుటకును ఇతర భాషలలోనుండి తీసి యాంధ్రగ్రంథ మార్గమునకుఁ దెచ్చుట
కును జాల భేద మున్నది. రెండవది మిగులఁ గష్టము. కవిగారి నింతవఱకుఁ బ్రస్తుతింతుము.
భావనామ సంర
"ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక."
శ్రావణ - భాద్రపదములు.
ఇతర వర్ణ నములలో నెంతయుఁ బ్రొద్దుపుచ్చక వీరకరుణములతోనే విశేషించి
గ్రంథము నింపిన యీ కవిగారిశక్తి విద్వత్కవుల మనస్సును హరింపఁ జాలియున్నది. గ్రంథ
మంతయు మృదుమధురపదభూయిష్ఠము. ధార ధారాళము. ద్రాక్షాపాకము. కృతి నిర్దుష్టము.</p>
<pb n="20" />
<p>18
పండిత పామరజనరంజకము. పూర్వకవులు భారతభాగవతాది పురాణేతిహాసములలోని -
చరిత్రములు లిఖించియున్నారు. ఈ కవి యట్లుగాక యధునాతన చరిత్రమును వ్రాసి
యున్నాఁడు. అందును కథా నాయకుఁడు హిందుపైనను బతివీరుఁడు యవన చక్రవర్తి
యయిన యక్బరు. ఈపేరుతోపా టితని పక్షమునఁ జేరిన వారందఱ పేర్లును నిట్టి తురుష్క
భాషకుఁ జేరినవే. వీరియుద్ధము భారతాది యుద్ధములవలె వస్త్రశస్త్ర ధనుస్సాధముగాక
ప్రాకృతసాధన భూయిష్ఠము. ఇట్టిదానిఁ బ్రాచీనకవితాధారలో నడిపించి గ్రంథమునకు
వన్నె తెచ్చిన యిక్కవిపౌఢిమ కడుంగడు శ్లాఘ్యము. రంగారాయ చరిత్రాదుల
వంటివి కొన్నియున్నను నవి యతిప్రౌఢములై కేవల పండితైక వేద్యములేకాని యాంధ్ర
భాషావిదుల కందఱకును సులభములుగావు. కనుక దేనజూచినను నీ గ్రంథము మిక్కిలి
కొనియాడఁ దగియున్నది. ఇట్టి చరిత్ర రచించి తన యసాధారణ ప్రతిభ నేకాక దేశభక్తి ని
సనాతన ధర్మతత్పరత గ్రాంధిక భాషాభిమానము వెల్లడించిన యీ రాజ శేఖరముగారు
కడు ధన్యులు.
భావ, మార్గశిరము
"అభినవ సరస్వతి"
ఈ మహాకవి విద్యా శేఖరుఁడైన సంపన్న గృహస్థువు. అనేక గ్రంథములు రచించిన
కవిలోక శిఖామణి. గ్రంథము సర్వోత్తమమైనది. నవరత్నములను ప్రసిద్ధికలను. కాని
యిం దన్ని పద్యములు రత్నములే యనవలయు. ప్రతాపసింహుఁడు ధనబలముమాత్రము
లేకున్నను దేశాభిమానబల మపారముగఁ గలవాఁడగుటచేఁ బోరాడుచు సైనికుల కుత్సా
హము గలిగించుచున్న తావుల గల పద్యములఁ జదివినచో దుఃఖాశు, బిందు సందోహము
ప్ర్రవాహరూపము దాల్పకపోదని మా విశ్వాసము. ఉదాహరింతమని యేభాగమును జది
విన నం దొక్క పద్యమైన వదలఁ దరముగాదు. ఏభాగము చూచిన యతిప్ర్రాసముల కై
కక్కు–రితిపడిన జాడ గానరాదు. శైలి గంగా ప్రవాహమువలె నున్నది.
ఆషాడ బ ౧౦ లు
"లింగ"
ణ
టాడ్డుదొర గ్రంథము పూర్ణ చరిత్రాత్మకము. ఆ బంగారమున కీకవి సువాసన
యబ్బించినాఁడు. కవీశ్వరుఁడు ప్రతాపుని ప్రతాపము నుగ్గడించుటలో వైరివీరుల విశేష
మును మఱవలేదు. అక్బరు ముఖ్యమంత్రి "యబూరహిమాను" శీల మప్రతిమానము.
అతఁడు మహాత్ముఁడేసరి. యజమానినే ధిక్కరించి ప్రతాపుని సర్వస్వతంత్రునిఁ జేసిన నిరు
1 పమాన శాంతచిత్తుఁ డీయద్దూరహిమాను. భౌమాసాహి శీలము ప్రతాపసింహుని శీలమున
కెనయనఁ దగును. కవిత్వము కేవలము భావ ప్రధానమైనదేకాక ఘట్ట ఘట్టమును గర</p>
<pb n="21" />
<p>రసాయనంబై యనర్గళధారా ప్రవాహ పరిపూర్ణంబై మృదుమధుర పద భూయిష్ఠమై
శైలి శ్లేష-ప్రసాద మహిమలఁ జెన్నొందుచు యుద్ధపుఁబట్టుల దిక్కన సోమయాజి శై లిని
డలపీంచుచుఁ గొన్ని యెడలఁ బోతన కంకంటి పాపరాజప్రధానుల స్మరణకుఁ దెచ్చుచున్నది.
పస్తుతాంధకవికుంజరులలో నీ కవి యసమాన విఖ్యాతి వహించి యున్నాఁడు.
శ్రావణ శుణి లు.
"కౌమోదకి"
రు
నీరి కృతులు దిగంత విశ్రాంత కీర్తివహించి జయపతాకము నెలకొలిపినవి. కవికుల
కోటిలో వీరి కగ్రతాంబూల మీయక తప్పదని "ఢంకా" వాయించినది వీరి "రాణా
ప్ర్రతాపసింహ" చరిత్ర. ఈగ్రంథ ప్రాశస్త్యము వివరించి చెప్పఁదలఁచిన నీగ్రంథమంత
గ్రంథము వ్రాసినఁగాని తేటపడదు. ఏ యే సమయమం దే యే పదము ప్రయోగించిన
రస ముట్టిపడునో యా యా సమయమున నా యా పదమునువాడి జిలిబిలి ముద్దుపలుకుల
తో, ధారాళమైన ధారతో, లలితములైన పదములతో, సరళమైన శైలితో, గ్రంథమంతయు
నొ కే తీఱున నడిపించిన వీరి యద్భుతశక్తి సంశ్లాఘ్యము. ఆంధ్రుల పాలిటి కల్పవృక్ష మిది.
కవిత్రయము వారు భాషా గురువులై యాంధ్ర కవిత్వమునకు మార్గదర్శకులైనట్లు నవీన
ప్రబంధములకు వీరు మార్గదర్శకులగుచున్నారు. వేయేల! యీ గ్రంథము వా
యునపుడు వీరే రాణాప్రతాపసింహులైరో, రాణాప్రతాపసింహుఁడే కవిసింహులగు వీరి
రూపముఁ దాల్చెనో యనిపించినది. అరుగరాచిన కొలంది పరిమళ మతిశయించు శ్రీగంధపుఁ
జెక్కవలె నీగ్రంథము చదివిన కొలంది నమృతరస మొలుకు చున్నది. ఈగ్రంథము మహా
భారతమువలె నైతిహాసికు లితిహాసమనియుఁ గవి వృషభులు మహాకావ్యమనియు క్లౌ
ఘింపవలెను. అన్ని గ్రంథము లొకయెత్తు. రాణాప్రతాపసింహ చరిత్ర మొక్క యెత్తు.
ఆంధ్రభాషా రామామణి కిది శిరోభూషణము, ఆంధ్రవాఙ్మయక్షేత్రమున ఫలించిన పారి
జాతము, ఆంధ్రలోకమున నవతరించిన మహారత్నము. రాజశేఖరు నింట వెలసిన వాగ్దేవి.
కవి గావించిన యాంధ్రసార స్వతకృషి నుండి యుద్భవించిన యమృతకలశము.....
ఓమహాకవీ!
గీః నీదు కావ్యంబునం దెంత నిగ్గు గలదొ! వ్రాయుచో భారతం బంత గ్రంథ మగును!
సారమును గాంచఁ గొన్ని వర్షములు పట్టు నన్న! దీని గుణంబెన్న నలవియగునె!
నూజివీఁదు.
"వై జయంతి"</p>
<pb n="22" />
<p>18
...... ఈ వీర చూడామణి (ప్రతాపసింహుఁడు) భారతీయులకు నిత్యోపాస్యుఁడు.
ఈతని యుదా తచరిత్రము నిరంతర పారాయణ యోగ్యము. వస్తు గౌరవమునను గ్రంథవిస్తృ
తిని యీకాలమున వెలువడుచున్న కావ్యములలో దీనికి మహత్త్వము సమధికమై యొప్పినది.
ఈ కవి వీరసత్వ సంపన్నుఁడు. ఈయన కృతులు వీరరస ప్రతికృతులు. వీర
వరుల గాధ లీ వీర సత్త్వు ని హృదయమునకు సాక్షాత్కారము నొసఁగి వీరరస పరివాహి
నులగు పృథుల కావ్యములై వెలసినవి. ఇట్లు అగ్గలించిన అలవాటునను పెంపు గనిని నే
రుపునను, చేయి వడిదిరిగిన యీయన నేఁడు రచించిన యీ రాణాప్రతాపసింహచరిత్ర
మీ యన రచనములకు మేల్బంతి. దీనిని వెలయించి యిపు డీయన కావ్యకళానిధియైనాఁడు.
ఈయఖండ కావ్యమున కవితాసామగ్రి గ్రంథకర్తృ సామర్థ్యమున కుద్దిగ నున్నది. ఈ
గ్రంథమున కవితా సామగ్రికిఁ గొఱంతయేలేదు. ఉపమాలంకారము లిం దసంఖ్యముగఁ
గలవు. వానిలోఁ బెక్కింటి కపూర్వతయు నబ్బినది. గ్రంథమున నవిరళముగనున్న సవ్య
కల్పనములు గ్రంథకర్త కల్పనా కౌశలమునకుఁ జక్కని తెలివిడి. కవితాధార ఉత్కూల
ముగఁ బొంగిన వర్షాకాలమునందలి మహానదీ ప్రవాహమువలె నిరాఘాటముగ పరుపులు
వారుచుండును. అందంగు దానఁ బూర్వకవుల ధోరణియు పొడకట్టు చుండును.
*
కవి తనస్వతంత్రశక్తి నన్నింటను గనబఱచినాఁడు. అది యిందలి విశేషము. ఇట్టి
గ్రంథములు కేవల చరిత్రాత్మకములు వీరరస ప్రధానములు నయినవి ఆంధ్రవాఙ్మయు
మునకుఁ క్రొత్తలు. వెనుకటివారి కట్టివానిపయి రుచి పుట్టినది కాదు యే యిద్దఱు-ముగ్గురకో
తప్ప, నేఁటివారిలోఁ గొందఱ కట్టి రచనములు గిట్టినను అఖండత అవునుగాని దయిపోయి
నది. అఖండముగ నట్టి గ్రంథములఁ బెక్కింటిని రచియించి యాంధ్రమున కర్పించిన యతఁ
డిప్పటి కీరాజ శేఖరకవియే కనుపించునది. ఈయన రచనములవలన నాంధ్ర సాహిత్యము
బలుపుఁ గనినది. దీనికై యీ కావ్యకళానిధి నెంత కొనియాడినను దీఱదు.
రకా
"భారతి"
డిసెంబరు 1934.
Ge</p>
<pb n="23" />
<p>asust Bros
for
2)
:
కావ్యకళానిధి, కవిసింహ & అనధానిపంచానన,
దుర్భాక రాజశేఖరశతావధాని.</p>
<pb n="24" />
<p>విషయ సూచిక.
విషయము.
భారతదేశముపై మహమ్మదీయుల దాడి.
దూలారావు యుద్ధము.
గజినీమహమ్మదు దండెత్తి వచ్చుట,
ఘోధీమహమ్మదు దండెత్తి వచ్చుట.
సంయుక్త స్వయంపరోత్సవము.
చిత్తూరు మొదటి ముట్టడి,
హమీరుసింహుని పరిపాలనము,
ప్రథమాశ్వాసము.
కుంభుడు మేవాడ దేశము నేలుట.
మేవాడ దేశము పై బేబరు దండెత్తి వచ్చుట.
చిత్తూరు రెండవ ముట్టడి.
కర్ణావతీదేవి పంపిన తోరమును హుమయూను గ్రహించుట.
హుమయూను రాజ్యభష్టుం డగుట.
అక్బరు జననము,
హుమయూను మఱల రాజ్యము గ్రహించుట. ఆక్బరు పట్టాభిషేకము .
అక్బరు దిగ్విజయములు.
చిత్తూరు మూడవ మట్టడి.
ఉదయసింహుఁ డుదయపురముగటి కాపుర ముండుట,
ఉదయసింహుఁడు జగముల్లుని రాజు చేయఁ గోరుట.
ఉదయసింహుడు దీవింగతు డగుట
శలుంబాకృష్ణ సింహుఁడు జగమల్లుఁడు పట్టభద్రుఁడగుట ననుమతింపకపోవుట.
కృష్ణసింహుఁడు కోపోద్దీసితుం డగుట.
కృష్ణసింహుఁడు సింహాసన మధిష్ఠింపుమని ప్రతాపుసింహు నిర్ధించుట.
ప్రతాపసింహుని పట్టాభిషేక మహోత్సవము,
ప్రతాపసింహుని సాగరసింహుఁ డాక్షేపించుట.
కృష్ణసింహుఁడు సాగరసింహునకు హితము నుపదేశించుట.
సాగరసింహుఁడు ప్రతాపసింహుని నిలువరించుట.
ప్రతాపసింహుఁడు సాగరసింహుని దేశము వీడిపొమ్మని యాజ్ఞాపించుట.
ప్రతాపసింహుఁ డనుచరులఁ గూడి 'ఆహేరియా' వేఁటఁకు బోవుట,
ద్వితీయాశ్వాసము.
పసింహు నర్థించుట.
ప్రతాపసింహుఁడు సూక్తుని రాజధాని కంపునుని కృష్ణ
కృష్ణసింహాదు లుగాదికానుకలు కొనితెచ్చుట.
పుట.
3
* 0 00 గా
6
1
17
19
21
25
27
28
30
82
38
89
42
45
46
48
50
51
55
57
58
60
61</p>
<pb n="25" />
<p>1
'}
2
విషయము.
ప్రతాపసింహుఁడు వేఁటకు వెడలుట
రాజపుత్ర నై వ్యమధ్యమునకు వరాహము వచ్చుట. ప్రతాప-నూ క్తులు వాదించుట,
కృష్ణసింహుఁడు సూక్తునకు బుద్ధి చెప్పుట.
నూకుఁ డవినయము చూపుట.
ప్రతాపసింహుఁడు కృష్ణసింహునకుఁ గోపోపశమనము చేయుట,
హరభట్టు సూక్తునకు నీతి గఱపుట,
ప్రతాపసూస్తులు పోరయత్నించుట. హరభట్టారకుఁ డాత్మార్పణము గావించుట,
ప్రతాపసింహుఁడు సూక్తుని దేశభక్టుని గావించుట.
ప్రతాపసింహుఁ డనుచరులతోఁ గర్తవ్య మాలోచించుట,
కృష్ణసింహుఁడు తన విశ్చయము నెఱింగించుకొనుట,
భానుసింహుఁడు తన నిర్ణయము దెలుపుట.
మనస్సింహ.శ్యామసింహుల యభిప్రాయము.
తేజసింహుఁడు తన తెరం గెఱింగించుట.
రామచంద్రదేవుఁడు తన మనోగతము తెలియఁజేయుట.
భీమచాందు తన సాయము వివరించి చెప్పుట.
ప్ర్రతాపసింహుని నిర్ణయము-నిబంధనములు,
మేవాడ దేశమంతయుఁ బాడువడి యరణ్యముగ మారట.
ఆక్బరు రణ స్తంభపురదుర్గము గొనుట,
ఆక్బరు ఘూర్జరదేశము జయించుట.
అక్బరు వంగదేశము జయించుట,
అశ్బరు-మానసింహుల మంత్రాంగము.
అక్బరుచక్రపర్తికి మానసింహుఁడు మనస్తాపోపశమనము చేయుట.
మానసింహుఁడు ఘూర్జగమునకు వెడలుట.
మానసిఁహుఁడు ప్రతాపసింహుని దర్శించుకొనుట.
స్త్రతాపసింహునితో మానసింహుఁడు సంధిమాటలు జరుపుట.
సింహుఁడు మానసింహు నధిక్షేపించుట,
తృతీయాశ్వాసము,
ణ
అక్బరు మేవాడపై సైన్యముల సంపుట.
హాల్డీసూటు కనుమవర్ణనము •
మానసింహుఁ డనుచరులను హాల్దీఘాటుకనుమఁ జొర నియోగించుట,
కృష్ణసింహుఁడు కనుమ నాక్రమించుట - యవనులు రాత్రి దండు విడియుట,
రాజపుత్రనైన్యము లెదిగివచ్చి హాల్టీఘాటుకనురుఁ జేరుట,
సూర్యోదయము,
ప్రతాపసింహుఁడు సూర్యోపాసనము చేయుట,
పుట,
62
64
65
66
67
63
09
71
72
77
73
79
80
82
83
85
88
E9
90
91
92
95
96
97
99
109
115
116
17
118
121
123
124</p>
<pb n="26" />
<p>విషయము.
ప్రతాపసింహుఁ డనుచరులతో ఁజేయు యుద్ధప్రశంస,
ప్రతాపసింహునితోఁ గృష్ణసింహుఁడు తన పబ్బదల నెఱింగించుకొనుట,
తేజసింహుఁడు తన శక్తి యుక్తు లెఱిఁగించుకొనుట,
భీమచాందు పరాక్రమవాక్యములు.
మొగలు సైన్యఁబులు యుద్ధమున
పతాపసింహుని విషాదము .
తి
మన కాయత్తమగుట . ప్రతాపసింహుఁడు యుద్ధసన్నద్ధుఁడగుట,
ప్రతాపసింహుఁడు పై న్యాధిపతుల యుద్ధమునకుఁ బురికొల్పుట,
రాజపుత్ర సేనాధిపతులు యవనసేనలను దాఁకుట,
ఖేల్వాపతీ-యబూర్ రహీహనుతోఁ జేయు యుద్ధము.
తేజసింహుఁడు యవననైన్యము పైఁబడి ధ్వంసము చేయుట,
కృష్ణ సింహుఁ డాసఫ్ ఖాను పైఁ గవియుట.
ప్ర్రతాపసింహుడు తోడరమల్లు పైన్యములను దాఁకి చీకాకు గావించుట,
శ్యామసింహ-ఖాసింఖానుల యుద్దము.
భానుసింహుఁడు యవనసేవలను దాఁకుట.
రామచంద్రదేవుని యుద్ధము,
ఖండేరావు యుద్ధము.
బేడ్లా.K^ టేరియా ప్రభువుల యుద్ధము.
3
భిల్లలు యఐనులతోఁజేయు యుద్ధము,
మధ్యాహ్న వర్ణనము — మానసింహుఁడు పిరంగులం పేలిపించుట.
చంద్రభట్టు రాజపుత్రులకు రణోద్రేకము కలిగించుట.
తేజసింహుఁడు విజృంభించి పిరంగులపై నేగుట.
తేజసింహునకుఁ గృష్ణ సింహుఁడు తోడగుట .
యవని సేనాపతు లోక్కుమ్మడి రాజపుత్రసేనలఁ దాఁకుట,
ప్రతాపసింహుని ద్వితీయ యుద్ధము.
యవనులవారణబలముతో రాజపుత్రులకైన యుద్ధము .
భీమచాందుయుద్ధము. బుడుతకీచులు పిరంగులు పేల్చుట.
ఖండేరావు యుద్ధము.
భానుసింహ-వీరబలుల యుద్ధము.
రామచంద్రదేవుని ద్వితీయ యుద్దము,
శ్యామసింహాదుల యుద్ధము,
ఖండేరావు రణరంగమునఁ గూలుట,
చంద్రభట్టారకుఁడు యవనులపైఁ గవియుట.
తేజసింహుని మూడవ యుద్ధము.
తేజసింహుని నిర్యాణము. ప్రతాపసింహుఁడు విజృంభించి యవనసైన్యముఁ దాఁకట
ప్రతాపసింహుఁడు మానసింహ సలీములఁ దగులుట,
4)
పుట:
125
126
127
128
129
131
133
134
1:35
137
38
189
141
142
143
:
145
146
15.1
163
155
157
158
159
160
162
163
164
165
166
170
172</p>
<pb n="27" />
<p>విషయ మ
రణరంగము వీడిపోవు ప్రతాపసింహుని యవనసేనాధిపతులు వెన్నంటుట.
సూక్తుఁడు ప్రతాపుని మన్నన వేఁడుట,
చైతకాశ్వము వీరస్వర్గమున కేగుట.
సూక్తుని దండింపవలదని యబూరహిమాను వాడించుట
బదోని డిల్లీకి వెళ్లి పాదుషాకు యుద్ధఫలముఁ దెలుపుట
ఆశ్బరు మానసింహునితో నిష్ఠురోక్తు లాడుట,
చతుర్థాశ్వాసము,
పతాపసింహుఁడు వీఠస్వర్గమునకేగిన సామంతులఁ గూర్చి యాచించుట.
ప్రతాపసింహుఁడు సేనాధిపతులు సత్కరించుట,
సూక్తుఁడు ప్రతాపసింహుని జేరవచ్చుట.
ప్ర్రతాపసింహుఁ డనుచరులతోఁ గర్తవ్యము నాలోచించుట,
రెండవసంవత్సరము యుద్ధము.
కుంభల్ మియర్ యుద్ధము,
ప్ర్రతాపసింహుఁఁడు చేపందాదుర్గమును జేరుకొనుట
చంద్రభట్టారకుఁడు భానుసింహునకుఁ దోడుపడుట.
మానసింహుఁడు "ధర్మేతి-గోకుండా" దుర్గములను జేకొనుట
పరీదుఖాను ప్రతాపసింహునితోఁ జేయు యుద్ధము.
అక్బరు కైలా
లావారా సీమయందలి ఫలవృక్షములు గొట్టించుట.
ప్ర్రతాపసింహుఁ డనుచరులకు 'దోనా' పంచి పెట్టుట
యవన సైన్యములు మేవాడపై నెత్తివచ్చుట.
దేవేర్ యుద్దము.
ప్రతాపసింహుఁడు యుద్ధరంగమువీడి శైలగునా కరుగుట,
పాటేశ్వరి ప్రతాపసింహుని విచారమునకుఁ గారణ మడుగుట.
పాటేశ్వరి ప్రతాపసింహునకు రణోత్సాహము గలిగించుట.
యపనుల నోడించి రాజపుత్రులు ప్రతాపసింహునిఁజేరుట.
భిల్లుఁడు ఢిల్లీపురమున కరుగుట.
అక్బరు ఢిల్లీపురంబు నలంకరింపఁ జేయుట.
ఆక్బరు సభా-భవనము.
అక్బరు కొలువుఁ గూటమునకు వచ్చుట.
అక్బరు పృథ్వీరాజునకు బదులు చెప్పుట.
పృథ్వీరాజు మారసింహుని మాటలను ఖండించుట
పృథ్వీరాజు భిల్లుని దోడ్కోని యింటి కరుగుట.
ఆబ్దూరహిమాను సృధ్వీరాజును దర్శింప వచ్చుట,
భిల్లుఁడు ఢిల్లీపురమునుండి వచ్చుట.
పుట,
176
177
180
181
182
183
185
187
188
191
191
198
194
195
197
199
200
201
204
207
209
211
212
213
214
220
224
225
227
228
232</p>
<pb n="28" />
<p>విషయము.
ప్రతాపసింహునకు ఢిల్లీనుండివచ్చిన లేఖ.
కృష్ణసింహుఁడు డిల్లీ లేఖను గొనియాడుట.
5
పంచమాశ్వాసము.
యవనులు రాపపుత్రుల దుర్గములను గొనుట,
సూర్యమహల్ దుర్గ యుద్ధము .
భీమదర్గమును ముట్టడించుట.
య పనులు
పొటేశ్వరి తన భర్తనుగూర్చి భిల్లు నడుగుట,
ఏకలింగేశ్వరాలయ వర్ణనము.
ప్రతాపుపసింహుఁడు దేశ త్యాగము చేయఁ దలఁచుట.
ప్రతాపసింహు ననుసరింతునని కృష్ణసింహుఁడు చెప్పుకొనుట
పర్షియా - ప్రయాణము భామాసాహి మేవాడకు వచ్చుట,
భామాసాహీ పతాపసింహునకు ధర్మోపదేశము చేయుట.
భామాపాహి ప్రతాపసింహనకు రాజనీతి నుపదేశించుట.
భామాసాహి రాజపుత్ర సైనికులను బురికొల్పుట,
రాజపుత్రులు భీమచాందు నివాసమునకు వచ్చుట,
రాజపుత్రసైన్యములు వచ్చి ప్రతాపసింహునిఁ జేరుట
ప్రతాపసింహుఁడు యుద్ధ సన్నిద్ధుఁ డగుట.
పాడేశ్వరి - ప్ర్రతాపఫుని విజయయాత్రకుఁ బంపుట.
దేవేరీదు ద్వితీయ యుద్ధము,
కుంభల్ మియరు దుర్గమును జేకొనవలెనని ప్రతాపసింహుఁ డాలోచించుట.
ఆక్బరుసార్వభౌముని విషాదము
మానసిఁహుఁ డక్బరునకు మనస్తాపోపశమనము చేయఁబూనుట.
అబ్దూరహిమాను పంతా పసింహుని గుణములఁ గీర్తించుట.
మానసింహుఁడు యవనసభను దృణీకరించి మాటాడుబ.
పృథ్వీరాజు మానసింహు నధి క్షేపించుట,
ఆక్బరు శాంతఐచనములు పలుకుట .
అక్బరు నిర్ణయమును మానసింహుఁడు సమ్మతింపక పోవుట.
అక్బకు మానసింహుని శాంతింపఁ జేయుట,
రాజపుత్రులు మఱలఁ దమదుర్గములను బట్టుకొనుట,
ప్రతాపసింహుఁడు మాల్పురమును గొల్లగొనుట.
స్వాతంత్ర్య దినోత్సవము.
ప్రతాపసింహు ఉంద రనుచరులను సత్కకించుట.
భామాసాహి స్త్రతాపసింహు నాశీర్వదించుట.
ఉపసంహారము.
పుట
233
240
248
244
245
247
250
251
256
26*
264
266
268
-270
271
272
24 3
:276
280
282
285
287
-288
283
290
291
293
29
296</p>
<pb n="29" />
<p>1
i
గ్రంథమునందలి పాత్రము
ప్రతాపసింహుఁడు =మేవాద్దేశప్రభువు. కథానాయకుఁడు.
ఉదయసింహుఁడు = ప్రతాపసింహుని తండ్రి.
సూక్తు ఁడు-సాగరుఁడు-జగమల్లు = ప్రతాపసింహుని యనుజులు.
కృష్ణసింహుఁడు — సలుంబ్రాధీశ్వరుఁడు_ప్రథానమంత్రి సర్వసై న్యాధీశ్వరుఁడు.
హరభట్టారకుఁడు = ప్రతాపసింహుని పురోహితుఁడు_కులగురువు.
చంద్రభట్టారకుఁడు = ప్రతాపసింహు నాస్థానకవి.వీరుఁడు.
తుఁడు.
=
రామచంద్రదేవుఁడు, కుమారుఁడు ఖండేరావు) గ్వాలియకురాజు - ప్రతాపసింహు నాశ్రి
ఖేల్వాపతి — చోండా వద్వంశజుఁడు. సామంతనృపుఁడు.
భానుసింహుఁడు = సో నెగుఱ్ఱమహీపతి. ప్రతాపసింహునకు మామవరుసవాఁడు.
తేజసింహుఁడు-మనస్సింహుఁడు - శ్యామసింహుఁడు-దూడాసింగు-
ము లు.
బేడ్లా.కొ ఓరియానృపులు.షాపురాబు నేరాధీశ్వరులు దుర్జయుఁడు సామంతనృపులు.
in TV
-
హరిదాసు-ముకుందదాసు-
అమరసింహుఁడు = ప్రతాపసింహుని ప్రథమపుత్రుఁడు.
పాటేశ్వరీదేవి — ప్రతాపసింహు నర్ధాంగలక్ష్మి పట్టరుహిషి..
-
భీమచాందు — శబరలోక సార్వభౌముఁడు. ప్రతాపసింహుని మిత్రుఁడు. స్వతంత్రుఁడు.
భిల్లుఁడు = సేవకుఁడు.
అక్బరు — మోగలుచక్రవర్తి. ఢిల్లీశ్వరుఁడు.
సలీము — అక్బరు కుమారుఁడు_యువరాజు.
మీర్జా అబ్దూరహిమాను (ఖార్ఖాన్) - అక్బరు ప్రధానామాత్యుఁడు,
హరివిజయసూరి – జైనుఁడు అక్బరు గురువు.
పథ్వీరాజు — అక్బరు నాస్థానకవి.. సేనాధిపతి.
ధన సేనుఁడు — గాయక సార్వభౌముఁడు.
భగవాళ్ దాసు_కున్వార్ మానసింహఃఁడు - తోడరమల్లు...వీరబలుఁడు -
రాయసింహుఁడు – రాయశీలుఁడు_అబ్దుల్లా_షాబాజుఖ్ా_ఆసఫ్ ఖాన్ -
-
ఖాసింఖా౯ – మహబత్ ఖాక్ ఫరీదుఖాళ్_ఫయాజి.
m
W
--
మోగలు
సేనాధిపతులు
అబుల్ ఫజల్ ఫెరిస్తా-బదోనీ - సూరిదాసుఅబ్దు- స్సమాద్ = కవులు, చరిత్రకారులు, చిత్ర
కారులు.
t</p>
<pb n="30" />
<p>6
29
PRAY
వేడి వే
పూర్వపీఠిక.
నాథాబ్దభవాదు లెవ్వని మృను శ్రీపాదపంకేరుహ
ధ్యానానందరసాబ్ధిఁ దేలి కృతకృత్యత్వంబుఁ బ్రామీచుచు;
దా నీహార నగాత్మజాష్ట్రియుఁడు నిత్యానందుఁ డారోగ్యవి
జ్ఞానశ్రీ లిడి చంద్ర శేఖరుఁడు వి శ్వంబెల్ల రక్షించుతన్.
సీ॥ అబ్జాతనయనుని యత్తవారిల్లైన కలశపాథోరాశి గర్భమందు
వజ్రమౌక్తి కపంక్తి • పరువని పరుపులై తేజరిల్లెడు మణి ద్వీపమంను
రవిరశ్మి
నింత చొ శ్రీ రంగనీని కదంబ తరురాజవనము మ
బ్రాభాతసూర్యప్ర , భాభాసమానమా చింతామణీ భద్ర । సింహపీఠిఁ
గీ॥ ద్రిదిశకోటీ కిరీటసం దీప్త రత్నరాజి నీరాజిత పదాబ్జయై జగంబుఁ
ధ్యంబునుదుఁ
g
776770
TRENERA
ఏదో స
S
g
MUZIEREN»
కామేశ్వర్యైనమః.
ణా ప్రతాప సింహచరిత్ర .
9
1
2
బాలన మొనర్చు మాయమ్మఁ బ్రస్తుతింతు రమ్యగుణధన్య శైలాధి రాజకన్య.
సీ॥ పుంజీభవించి యుప్పొంగి శైలములు శృంగములెత్తి దివిని బ్రా కంగఁజనిన,
రంగదుత్తుంగ త రంగ సంఘములతో నీరధి కలఁగి ఘూరిల్లుచున్న,
హోమకుండముల న శీ హోరాత్రముల నూర్వశిఖల నగ్ని తపంబు సేయుచున్న,
గులశైలములు పెల్ల గిలఁ బ్రభంజనుఁడు జృంభించి భీకరధాటి వీచుచున్న,
గీ॥ శబ్దగుణరూఢి నవ్యయ సరణి సభము విష్ణుపదమై తనర్చిన, వీసమైన
.
నేజనని శక్తిమాహాత్మ్య మెఱుఁగ; వట్టి భవుని కొమ్మను మాయమ్మఁ బ్రస్తుతింతు.
సీ॥ ఏమహామహుఁడు సంస్కృతపాండితిని గొప్పపర్వతంబని నుతుల్ • వడయఁగలిగె!
నేఘనుం డాంధ్రమం + దెల్లపండితులచే దిగ్ధంతియనుచుఁ గీర్తింపఁబడియె!
నేసద్గుణార్ణవుం । డెల్లెడఁ దర్క సింహుఁడటంచుఁ బెనుకీర్తినొందఁగలిగె!
నేక ళావిదుఁడు వై శ్రీ యాకరణుల నిట్టి ఘనుఁడు లేఁడనుచు వి ఖ్యాతిఁగాంచె!</p>
<pb n="31" />
<p>2
పసింహచరిత్ర.
i
గీ॥ నట్టి కందాళ్లవంశ సుధాంబురాశి చంద్రుఁడైన దాసాచార్య • సత్తముండు
గురుఁడు దై వంబు; తత్పాద . సరసిజములు స్వాంతమున నెంచువాఁడ న
మ॥ తననాథుం డొనరించు సత్కృతులకు త్సాహమ్మునక్ దోడు సే
యను గాంక్షించి సహస్రహస్తముల శిష్యశ్రేణిఁ బోషింపనే
ర్చిన మత్సద్గురు మానినీతిలక మా "శ్రీరంగమాంబా మహా
జననీరత్నము:" గొల్తు నెల్లపుడు సాక్షా దింది రా దేవి.
మ॥ తన సౌజన్యము సజ్జనుల్ పొగడ నిత్యంబు సదాచార వ
ర్తన మొప్పార, గురుండు దైవమగుచుకొ బ్రహ్మోపదేశాది పా
వనకృత్యంబులు నాకొనర్చిన ఘనుకోబ్రఖ్యాతచారిత్రు మ
జ్జనకు వెంకటరామయార్యు మదిలో సద్భక్తి భావించెద.
గీ॥ "మాతృదేవోభవ" యటన్న మహితసూక్తి మఱువరానిది; నిరతము మజ్జననిని
దొడ్డము త్తె దువను మనస్తోయజమునఁ గొలిచెదను సుబ్బమాంబ సద్గుణకదంబ. 7
మ॥ నను గారామునఁ జేర్చి యాంధ్రమున 'నో నామాలు' మెట్రిక్యులే
షనుపై నాంగ్లము నేరిపించి తనజా సర్వస్వ మర్పించి పెం
చిన కారుణ్యరసార్ద్ర మానసుఁడు మా చిన్నయ్య 'సంజీవరా
యని' దుర్భాకకులాబ్ధిసోముని మది
ధ్యానింతు నెల్లప్పుడు.
గీ భారతీనాథు నపరావతారములనఁ గావ్యజగము సృష్టించి లోకములు మనుపు
నన్నయాది కమీద్ర మందారతరుల నాంధ్రభాషాగురులు నిత్య మభినుతింతు. 9
గీ॥ ప్రకృతితత్వరహస్య సర్వస్వ మెఱిఁగి నవనవోన్మేషమైన ప్రజయుఁ దనర్పఁ
గృతులు విరచించి లోకోపకృతులు పెంచు నార్య కవికోటి నిత్యవిద్యార్థిగణము.
గీ నూతనోజ్జీవమిచ్చు ప్రాభాత దక్షిణానిలము సోకఁగా మేడ పైన "టాడు"
దొర రచించు రాజస్థాన చరిత మెత్తి యొక్క నాఁడేను జరుపుచు నున్న యపుడు."
#
రాణో
పొరభక్తి. 4
సీ। సంస్కృతాఖండ భాషాకావ్య సాహిత్య సామ్రాజ్య సర్వస్వచక్రవర్తి,
యజలాంధ్రభాషా మ ! హాకావ్యవిరచన వ్యంగ్య వైభవ పట్ట + భద్రకీర్తి,
బహుళ విద్వద్భృంద పరిషదర్చిత పుష్ప మాలా మనోహర మహితమూ
తేజంబు నెఱపు జ్యోతిశ్శాస్త్రవిద్యాంగనా నవ్య రుచిర భావానువర్తి,
గీ॥ శత శతవధాన హర్షితా స్థాన దత్త కనక జయఘంటికా సింహ కంకణ రవ
।
ముఖరితా శాంతసద్యశః పూర్తి సుకవి సింహబిక్కుకుండు వెంకటశేష శాస్త్రి,
5
6
12</p>
<pb n="32" />
<p>పూర్వపీఠిక.
ఈ చనుదెంచి నన్నుఁగని వందనమని వచియించి నిలువఁ । దమ్ముఁడ రార
మ్మని కౌఁగిటఁజేరిచి చెంతను నేఁ గూర్చుండుమన నతఁడు కూర్చుండె.
గీ స్వాంతమునఁ బొంగి పొరలేడు హర్షభరము వికసిత ముఖాబ్జములపైన వెల్లివికీయ
మాటలాడితి మలపును । మలపులేని కుశల సంప్రశ్నములఁ గూర్చి కొంతతడవు. 14
చః చిఱునగ వాస్యసీమ వికసింపఁగ వెంకటశేష శాస్త్రి "సో
దర! మును నన్నయాది కవి తల్లజు లెల్లపు రాణసంతతుల్
సరస పదార్థ భావ గుణ సంభృతమై తగు మంచి శైలిలో
విరచన చేసియుండి రవి విశ్వజగన్నుతమై తనర్చెకుక్.
♦
కథ పిదపఁ బురాణాంతర్గత విదిత వివిధకథలు గొనుచుఁ బెద్దన్నాడుల్
పదు నెనిమిది వర్ణనములు గదియించి రచించి రఖల కావ్యశ్రేణుల్,
ఉ॥ కాలము కొంత యిప్పగిదిఁ గావ్య యుగంబుగ సాఁగె; దానిలోఁ
బూలవనంబు లయ్యమృత పుసెలయేఱులు
♦
నిగ్గుటాణి ము
త్యాలబెడుగు మేల్గొడుగు లచ్చపు వెన్నెల సోగలో యనర్
జాలిన మేటికావ్యము ల సంఖ్యముగా జనియించె వ్రేల్మిడి౯.
4
ఉ॥ ఆవలఁ గొన్ని నాళ్లరుగ నంతట సంతట సారవంతమౌ
త్రోవలు తప్పి కాంతి చెడి దుగ్గమ దుర్గములట్లు భీకరా
శ్రీవిషమున్న వేటికల చెల్వునఁ గానన రాజి మాడ్కిఁ గా
వ్యావళులుక్ వికాసగుణ మంతయుఁ గోల్పడె బీడువోవుచుక్.
కః పెక్కామడ కొక్కఁడుగా నక్కడలిని గల్గు దీవు లట్టులు కైతల్
చక్కఁగ లిఖించు వారల రిక్కాలంబునను నొక్క దిగువురు పెద్దల్.
మ! ప్రతిభాపూజ్యులు వారు వ్రాసిన మహ గ్రంథంబు లగ్యంత పు
ణ్యతమంబుల్ గద! వాని నట్లునిచి యన్యగంథముల్ చూచిన
మితియో మేరయొ యేమన వలయుః స్వామీ! వద్దు చాల్ చాల్ సర
స్వతికి వాతలు పెట్టిన ట్లలరుఁ 'బా పం శాంత' మిప్పట్టునక్.
చ యతులు వనాళిఁ, బ్రాసములు నాయుధశాలల, లక్షణంబు ల
శ్వతతి, రసంబు వైద్యుకడఁ; బాకము వంటలలోన, నయ్యలం
4
కృతులు పడంతులందు, మఱి రీతులు రోఁతల, శయ్య మేడ, ని
ట్రతికిన కావ్యముల్ గనిన నయ్యః యొడల్ దహియించినట్లగు.
3
13
15
16
17
18
19
20
21</p>
<pb n="33" />
<p>i
న తాపసి ం హ చరిత్ర .
శా॥ ఈవిన్నాణము లెన్ని యేని గల వా యీ యంశముల్ కొంత మే
లై వర్తించు ముసళ్లపండువది ముం దైయున్నద మాడ్కిఁజె
ల్వై విశ్వం బగలించుచున్న యది యాహా! గ్రాంధిక గ్రామ్య భా
షావాదంబు క్షణక్షణంబునకు హెచ్చక్ జొచ్చె నీవేళలో.
గీ॥ దేశమంతటఁ బాఱు నదీమతల్లి వంటిదగు వ్యావహారిక భాష; దాని
నచ్చటచ్చట దేశంబు • నలముకొనిన మంచియును జెడ్డయును నాశ్రయించియుండు,
ఉ॥ ఊరక భాష కేమిటికి ను తమ సంస్థితి గల్గు! దాన సం
భా
స్కారబలంబు గల్గి యధి కారము దాల్చిన ప్రాజ్ఞికోటి భా
షారచనంబుఁ బూని కృషి సల్పినఁ గల్గెడి; రిక్తు లూసినకొ
బారము ముట్టునే! గజము పైఁజవుడోలు ఖరంబు మోయునే!
క॥ అంతస్సారములేక యవాంతర భాషలను గల్గు పదజాలముల
దొంతరగఁ గలుప బాసయుఁ గంతులు గలవాని మేను కైవడిఁ బొలుచు .
క॥ క్రమమునకు బాస లోనయి యిముడమి, బుధకోటు లెల్ల 'నెవరికి వారే
యమునాతీరే' యనుగతి భ్రమగొని దెసలకును విఱిగి పారుదు రొకటక్-
ఆ॥ సరసశబ్ద మిట్టి సబ్బండు బాసలోఁ దక్కఁబోవ దింకఁ దమవి కొన్ని
తాళ్లపాకవారి 4 తప్పులు మఱికొన్ని యనఁగఁ దప్పుఁ గుప్పు లై రహించు.
:
(5
22
¡
23
24
ఉ॥ భావకవిత్వ మొక్కఁడట; భావము లేని కవిత్వమింక నాం
ధావనిఁగా దికేయవని నైనను గల్గునె!. కల్గెనేని యా
ప్రోవు కవిత్వమంచు బుధ పుంగవులెంతు రె! యేటిమాటలో
భావ మభావమా కవిత • ప్రాణము లేని శవంబు గాదొకో!
ఉ॥ పేరెది యైననేమి మఱి పేరున యోగ్యత వచ్చునే! రసం
బూరెడు నట్టి కైత మది యుత్తమ; మన్య మయోగ్య; మెల్లెడ :
సౌరభ పూరముల్ దెసలఁ జల్లెడు తామరపూవుఁ జూచి యే
పేరునఁ బిల్చినక్ గుణము వీసము హెచ్చునొ! లేక తగ్గునో!
♦
గీ!! అలరుఁదేనెల మఱపించు పలుకుఁ బొందు, పలుకుఁబొందుకుఁ దగినట్టి భావపుష్టి,
భావపుష్టికిఁ దగు రస వైభవంబు, కూర్చు ధన్యుండె పో కవి కుంజరుండు
చ॥ పరువడిఁ బద్యకావ్యములు వ్రాయుట మోటదనంబటంట, నా
గరకత కెంతొ లోపమఁట, గద్య మొ గేయమొ సదసో త్తర
•
25
26
27
28
29
---- -</p>
<pb n="34" />
<p>5
పూర్వపీఠిక.
*
స్ఫురణను మించునంట, మఱి పొత్తము పెద్దదిగాఁగ నుండి
బరువఁట, చిన్ని పొత్తములు నాడెముఁ గూర్చునటంట, వింటివే.
సీ। భాషామహాదేవి వాహ్యాళి యొనరించు మానితనందనోద్యాన చయము!
సాహిత్యలక్ష్మి వి * శ్రాంతి కేర్పఱచిన హాటక వివిధ సౌ • ధాగ్రతతులు!
బహుళ విద్యాధన ప్రకరంబు నింప దీపించు భాండాగార సంచయములు!
బాగోగు బోధించి 4 ప్రజ నుద్ధరించెడు విజ్ఞాన సర్వస్వ వేళ వితతి!
గీ॥ పద్య కావ్యసమూహ సౌభాగ్యగరిమ మిట్టిదని వివరింపఁగా 4 నెవ్వఁ డోపు!
లోకకల్యాణ విజయ సుశ్రీకదివ్య పారిజాత ప్రసూకైక హారసమితి.
ప్రకృతసారస్వతస్థితి , వఱలునిట్లు; మాటవరుస కంటినిగాక . మనకు నేల
దానిఁజర్చింప" ననుచు మందస్మితంబుఁ గొలుపు నాతని వదన మేఁ గలయఁజూచి,
గీ! "పూర్వకాలఁపుఁ బాండిత్య పుంబ్రశస్తి కావ్యముల యున్న తాదర్శ గౌరవంబు
కొఱతవడ నిష్టపడనట్టి గొప్పసుకవి వగుట నింతగఁ బరితాప మందె దీవు.
దగ్గ తలుపు, తలుపులోపల
♦
చ॥ తల కొక బుద్ధి, బుద్ధికిని
వెలువడు భిన్న భిన్న గతిఁ
బెక్కులు యోజన, లింక నేగతి
బలువురు కైకమత్య మది పట్టు! స్వతంత్రత ముఖ్య వైనమై
నిలిచిన నేఁటికాలమున నీహితబోధ మెవుడు చేకొనుకో!
29
30
32
33
•
చ॥ తెలివిగలట్టి బాలుఁ డొక తీఱు పఠించుచు మాతృభాషలో
పలఁ దగుజ్ఞాన మొదెడు ప్రబంధము లియ్యెడ నాలు గేనియుక్
వెలువడ వెట్టిపాపమొకొ! నేర్పెడు విద్యయుఁ జూడ, నూటికీక్
నలువదికన్నఁదక్కవ గుణంబులు వచ్చిన వాఁడు నెగ్గెడిక్.
గీ" వాలి వాల్మీకి కేమికా వలయు ననుచుఁ! గైక కైకసి చెల్లెలు గాదెయనుచుఁ!
గర్ణుఁ డాకుంభకర్ణుని , కడపటికొడుకగుఁగదా! యని యడుగు విద్యార్థులుండ్రు. 35
ఉక్రూరమృగంబు, వాడియగు కోఱలు, పెద్దది తోక, యాఫ్రికా
తీర వనంబుల౯ దిరుగు, దీనిని మర్త్యులు పట్టలేరటం
మ
.
చాఱవ "ఫారముక్" జదువు శ్రీ నర్భకుఁ డొక్కరుఁ డావిభీషణు
గూరిచి వ్రాసె; నెట్టులు కనుంగొన నేర్చెద విట్టిరోఁతల్!
క॥ ఇది యెంతగఁజెప్పిన నున్నది; ప్రకృతము ననుసరింత; మస్మశ్మనము
దుదయించినట్టి కోరిక నిదె తెలిపెద నాలకింపుమీ! శ్రద్ధ మెయి
♦
31
36
37</p>
<pb n="35" />
<p>రాణా ప్ర తాపసింహచరిత్ర.
సీ॥
గీ॥ సప్తసంతానములఁ బ్రశస్తమయి జలముగాని దొకకృతి యన్న సత్కవులమాట
కలికి పదియాఱువన్నె బంగారుమూట రమ్యతరమైన రతనాల రాచ బాట. 38
జ్ఞానంబునకు మూల సారమా నాత్మ కావ్యకవిత్వమని "వద్దు వర్తు" నుడివె;
సత్యంబునకు సౌఖ్య 4 సంగంబు చేకూర్పఁ జాలిన కళ యంచు "జాన్స" ననియె;
నతుల సంగీతర సాత్మకంబయిన భావాలాపమనుచుఁ "గా గ్లెలు" తెలిపెఁ;
బ్రతిభావిలాసంబు , వాక్యదేహంబుఁ దాల్చిన రూపమనుచు 'షెల్లీ' వచించె;
'హడ్స' నాదిగ నెందఱో యాంగ్లకవులు పద్యకవితకుఁ గల గౌరవప్రశస్తి
గీ
యట్టిదిట్టి దనంగ రా దని సహస్ర ముఖముల నుతింప విన మొకో పూర్వమందు.
గీ। దేశభక్తియుతంబు నీతిప బోధకము ఘనాదర్శమగు పద్య కావ్య మొక ఁడు
సరసజనములుమెచ్చ రసంబు హెచ్చ సృష్టిసేయంగ నిపుడు యో । జించుచుంటి.
ఆ క॥ విరచించునెడలఁ గల్పన పెరయకయును నతిశయోక్తి పెంపొందక యుక్
జరిగినది జరిగినట్టులు మెఱయుటచే దేశచరిత మెప్పు వహించుకో.
§ క॥ అదిగా కార్యావర్తము త్రిదశులకును బావనమగు దేశము; దాన
బొదలెడు నృపులు మహేంద్రుని మదిమెచ్చరు పుణ్యవిభవ మాన్యతలందు.
♦
41
Is it to be imagined that a nation so highly civilized as the Hindus,
amongst whom, the exact sciences, flourished in perfection, by whom, the fine
arts, architecture, scripture, poetry, music, were, not only cultivated but taught
and defined, by the nicest and most elaborate rules, were totally unacquainted,
with the simple art of recording the events of their history, the charactors of their
princes and the acts of their reigns. Where such traces of mind exist, we can
hardly believe that there was a want of competent recorders of events, which
synchronical authorities tell us were worthy of commemoration. The cities of
Hastinapoor and Indraprastha, of Anbulwara and Somanath, the triumphal
columns of Delhi and Chittoor, the shriaes of Aboo and Girnar, the cave temples
of Elephanta and Ellora. are so many attestations of the same fact. Nor can we
imagine that the age in which these works were erected, was, without an
historian. In the heroic history of Prithwi Raj, the last of the Hindu sovereigns
of Delhi, written by his bard Chund, we find notices, which authorise the
inference that works similar to his own, were then extant, relating to the period
between Mahammad and Shahbuddin (A. D. 1000-1193) but these have disappeared
AnJals & Antignities of Rajasthan."
§ The splendour of the Rajput states however. at an early period of the
history of that country, making every allowance for the exaggeration of the bard,
must have been great. Northern India, was rich from the earliest times, that</p>
<pb n="36" />
<p>7
పూర్వ పీ తిక.
♦
॥ మేవాడరాజ్య ల । శ్రీ ష్మీ పదాంభోజాత ములను గొల్చిన దత్త పుత్రకుండు!
బాలగోవింద వి శ్రీ ప్రస్వామి శిష్యుఁడై తవిలి మ్రొక్కిన మేటి ధర్మమూర్తి!
స్వర్ణర బంధ బద్ధుఁడై బూందీమహారాజ్ఞి సేవించు ననుఁగుదమ్ముఁ!
డఖిలప్రజాగణం । బభినుతుల్ గావించు రామసింహుని రాజ రక్షకుండు!
గీ॥ తీవ్రరుజు పెచ్చు పెరిగి భాధించుచున్న ఁ ద్రుటియు మేవాడ విడఁబోని దొడ్డమగఁడు!
భరతఖండాభిమాని సత్ప్రభువతంస మాస్తమణి టాన్డుదొర నిత్యమభినుతింతు.
మ॥ సరసాగ్రేసర చక్రవర్తియును నా 'స్కాట్లండు' సంవాసియుక్
వగ కారుణ్య రసార్ద్ర మానసుఁడు కర్నల్ జేమ్సు టాడ్పడితుం
డిగవై రెండగునేండ్లు హైందవమునందింపార నుద్యోగియై
చరియించె గిరులు బురంబులును రాజస్థాన దేశమ్మునక్.
43
portion of it situated on either side the Indus, formed the richest satraphy of
Darius. It has abounded in the more striking events which constitute the
materials for history. There is not a petty state in Rajasthan that has not bad
But the
its Thermopylae or scarcely a city that has not produced its Leonidos.
mantle of ages, has shrouded from view what the magic pen of the historian
might have consecrated to endless admiration; Semanath might have rivalled
Delphos; the spoils of Hind might have vied with the wealth of the Lybian King;
and compared with the array of the Pandus, the army of Xerxes would have
dwindled into insignificance. But the Hindus either never had or have unfortu-
nately lost their Herodotus and Xenophon. If the moral effect of History depends
on the sympathy it excites, the annals of these states possess commanding interest.
The struggle of a brave people for independence, during a series of ages, sacrificing
whatever was dear to them for the maintainance of the religion of their forefathers
and sturdily defending to death, and in spite of every temptation, their rights and
natural liberty, form a picture which it is difficult to contemplate without emotion.
Could I impart to the reader but a small portion of the enthusiastic delight with
which I have listened to the tales of times that are past amid scenes where these
events occured, I should not dispair of triumphing over the apathy which dooms
to neglect almost every effort to enlighten my native country on the subject of
"Colonel James Tod."
India. .
There is something magical in absence, it throws a deceitful medium
between us and the objects we have quitted, which exaggerates their amiable
I look upon Mewar as the
qualities and curtails the proportions of their vices.
land of my adoption and linked with it, the associations of my early hopes and
their actual realisation, I feel inclined to explain with reference to her and her
unmanageable children. ''Mewar! with all they faults, I love thee still."</p>
<pb n="37" />
<p>'రాణా ప తాప సింహ చరి
§ ఉ॥ వీరరసార్దమా కథలు
జారతి వీరుల గొలుచు
త్రీరమణాళి సత్కథలు
రిత్ర .
వీనులు సోఁక నమస్కరించి పూ
సజ్జనుఁడౌటను రాజపుత్ర ధా
రేయుఁబవల్ గడియించి యాంగ్ల భా
షా రమణీయకావ్యముగ * శ్రద్ధమెయిన్ రచియించె నాతఁడు౯.
ఆ సీ॥ సర్వసన్నుతము రాజస్థానదేశంబు మాతృదేశము మించి
మహితభక్తిఁ
గొలిచి తద్దేశ వా + సుల బుధువులపోల్కిఁ బ్రేమించుటను జేసి పృథ్విజనులు
42
I dipped the middle finger of my right hand and made the tilac on his head.
I then girt him with the sword and congratulated him in the name of my govern
ment, declaring aloud that the British government would never cease to feel a deep
interest in all that concerned the welfare of Boondi and the young prince's family..
The mother of the young prince sent me by the hands of the family priest
the bracelet of adoption as her brother, which made my young ward, henceforth
my bhanji or nephew,
His annals of Rajasthan show the result of his administration as restorer
of Rajnutana. The people were deeply attached to birn as Heber continues to
observe "His name appears to be held in a degree of affection and respect by all the
upper and middling classes of society, highly honourable to him." Speaking of
Bhilwara which Tod had almost recreated, he says "It ought to be called Tedgnnge
but there is no need, for, we shall never forget him." The fact is. that the place
was called Todgunge but the name was withdrawn at the instance of Tod himself.
In the year 1822 after two and twenty years of service, eighteen of them spent
among the Rajaputs of Western India and five as Political agent, Colonel Tod's
shattered health called upon himn imperatively to suspend his toils and quit the
climate of India. But the ruling passion forbade him to proceed direct to the port
of embarkation. In 1819, he had completed the circuit of Marwar. visiting, its
capital, Icdhpur [via] Kumbhalmere thence returning by Mairtra and Ajmir to
Udaipur. Next year, he visited Kotah and Boondi the latter of which he
revisited in 1821 having received the intelligence of the death of his friend the.
'Rao Raja Ram Singh,' who had left Colonel Tod guardian of his infant son, the
prince of Haras. He returned to Udaipur in March 1822 and took final leave of
the valley in June of that year. He procceded across the Aravali to Mount Abog
and inspected the wonders of that sacred place--and embarked for England
Bombay in the early part of 1823.
The religious feelings of the Rajput will not permit him to see the axe
applied to the noble peepul or unbrageous burr (ficus indica) without execrating
he destroyer. Unhappy the constitution of mind which knowingly wounds
teligious prejudices of such ancient date. Yet, is it thus with our countrymen in
he East, who treat all foreign prejudices with contempt, shoot the bird sacred to</p>
<pb n="38" />
<p>పూర్వపీ శిక
పాశ్చాత్యుఁడైన నేప్పటికి దొర రాజ పుత్రుఁడే యనుచు సమ్మోదమంది;
రతఁడును రాజపుతావనికొఱకుఁ బ్రాణము లైన నిచ్చు చం। దమున మెలఁగె;
గీ॥ సమ్మహాత్ముండు వాయు గ్రంథమ్మునందు వీరరసతరంగములతో క్షీరజలధి
.
2
కరణి మాధుర్యములు పెంచు చరితలెన్నొ కలవు కలవారియిండ్ల బంగారమట్లు. 43
శా॥ ఆ కర్ణద్వయపావనంబగు చరిత్రాంశంబు లందెల్లఁ గ
4
న్నా కై దివ్యరసాలవాలమయి సత్య న్యాయ సంపూరితం
బై కన్పట్టెడి నా తాపు చరితం! బద్దానినే గోస్తనీ
పాకంబొప్పఁగ నొక్క దొడ్డకృతిగా వ్రాయ బ్రయత్నించెద."
మ॥ అన "నీమాటలు వేదవాక్యము; లవ , శ్యంబిష్ఠు రాణాప్రతా
పుని గీర్తింపు; మతండు వీరజనతా పూర్వాభిగణ్యుండు; క
మ్మని నీకైతకు నమ్మహాప్రభుని ధర్మ శీరతుల్ హాటకం
బునకుక్ సౌరభపూరముల్ గలుపు సొంపు గాంచి వాసి గనుకో."
44
45
the Indian Mars, slay the calves of the Bal and fell the noble peepul before the
eyes of the native without remorse. He is unphilosophic, and unwise who treats
such prejudices with contumely, prejudices beyond the reach of reason. He is
uncharitable who does not respect them; unpolitic who does not use every means
to prevant such offence by ignorance or levity. It is an abuse of our strength
and our ungenerous advantage, over their weakness. Let us recollect who are
the guardians of these fanes of Bal, his Peepul and sacred bird (peacock) the
children of Surya and Chandra and the descendants of the sages of yore; they,
who fill the ranks of our army and are attentive though silent observers of all our
actions, the most attached, the most faithful and the most obedient of mankind.
Let us maintain them in duty obedience and attachment by respecting their
prejudices and conciliating their pride. On the fulfilment of this, depends the
maintenance of our sovereignty in India. But the last fifteen years have assuredly
not increased theair devotion. Let the question be put to the unprejudiced whether
their welfare has advanced in proportion to the dominion they have conquered
for us, or, if it has not been in the inverse ratio of this prosperity. Have not
their allowances and comforts decreased?.
For the good of the ruler and servant, let these be rectified. With the
utmost solemnity I aver, I have but the welfare of all at heart in these observations.
I loved the service. I loved the native soldier. I have proved what he will do,
where devc.ted, when, in 1817, twenty two fire locks of my guard, attacked defeated
and dispersed a camp of fifteen hundred men slaying thrice their numbers.
Having quitted the scene for ever, I submit my opinion dispassionately for the
welfare of the one and with it, the stability or reverse of the other. 'Tod."</p>
<pb n="39" />
<p>10
ప్ర
కI అని ప్రోత్సహించుమతి' ననియెను వెంకట శేషశాస్త్రి;-
యేనంతఁ బ్రతా
గా మొదలిడితి.
పుని చరిత కావ్యరూపముగను వెలయింపంగ వ్రాయ
క॥ ఉత్తమ మితివృత్తము! సముదా త్తము చిత్తూరు పురి! ప్రతాపుఁడు ధీరో
దాత్తుఁడు! కైతము మెత్తని! దిత్తఱి మెత్తురని తలఁతు నెల్లబుధేందు ల్.
రాణా
తాపసింహచరిత్ర.
-
శా॥ నా ధారాళ కవిత్వమందుఁ గల వి శ్రీ న్నా ణంబు లట్లుండ,
గాధల్ కర్ణయుగంబుఁ బట్టుకొని యా కర్షించు లోకంబు; వి
ద్యాధుర్యుల్ విని చిట్టు బుస్సనక యాహ్లాదింత్రు; విశ్వక కీ
ర్యాధారంబులు రాజపుత్రనృప శౌర్యావార్య హేలాకళల్.
శా॥ ఈపొత్తంబునఁ గొంచెమేనియు గుణం బెందేనిఁ బెంపొంద
ఘాపీఠంబది 'జేమ్సుటాడ్డు దని లో కంబెంచి హర్షించుఁగా!
కేపట్టెన వికాసమూడి రసమెం తేఁ దక్కు- వైయున్న నా
$
IN
CGK)
30y
3
46
47
48
♦
లో పంబంతయు నాదిగాఁ దలఁపఁ గే లు మోడ్చి ప్రార్థించెద.
మ॥ వినమే మున్ను ప్రతాపునంతటి మహావీరుండు లోకంబునక్
గనుపింపుడని పూజ్యులెల్లఁ బలుకం. గా; సట్టి రాణాపతా
పుని గీర్తించెడుపట్ల నెట్లు కవనం బుక్ సాగఁగాఁ జేతువో
నిను సేవింతు విరించిరాణి! సుమపాణీ! వాణి! నన్నోమవే.
సీ రచియించియుంటి వీ రమతీచరితంబుఁ దిరుపతి వెంకటేశ్వరులు మెచ్చఁ!
గృతియొనర్చితిఁ జండ -నృపమౌళికథ దేశచరితముల్ శోధించి సరసు లలరఁ!
దగఁగూర్చియుంటిఁ బ + ద్మావతీ విజయంబు వీరంబు హాస్యంబు వెల్లి విరియ!
వ్రాసియుంటి సమగ్ర 4. రామాయణము నాటకములుగా విబుధలోకములు పొగడ!.
నిన్ని యొక యెత్తు! మఱి ప్రతాపే ద్రుచరిత మొక్క యెత్తు! సుధార సం బొలుకుచుండ
నొక్కచూ. పెక్కుడుగఁ జూచి యుద్ధరింపు శైలరాజేంద్రకన్య!
సౌజన్యధన్య ! 51
కు జననం బందిన దాది యేఁడు నెలల స్మర్దేహసీమ వినూ
తన కల్యాణ దరస్మితప్రభలు నిత్యంబు బ్రసాదించి దే
వుని సాన్నిధ్యముఁ జేరఁగాఁ జనిన మ త్పుత్రుండు కామేశ్వర
కాహ్లాది సద్విగ్రహుక్.
♦
య్యను మత్ప్రణసమాను నేఁదలఁతు లో
* కుదురగు ప్రేమ నొక్కలత కూనను గాచితిఁ జై.త్ర వేళ; న
1. య్యది గొడిగేజ్ హొయల్ గులుకునర్మిలి మొగ్గను; దానిఁ గాంచి నా
49
50
52</p>
<pb n="40" />
<p>-6
7
00
3
)
;
H
పూర్వ పీఠిక,
11
యెద మొలిచె మనోరథము
లెన్నియొ; గాలికి నూడి దేవి శ్రీ
పదముల రాలె మొగ్గ! యది వంద్యమే, తజ్ఞని ధన్యమాటచే
♦
ణ
సీ॥
ఆ॥ పూర్ణ చంద్ర మూర్తి పుత్రుఁ డుద్భవమొంద నమరులైన వలవ దనరు సరియే!
యిచ్చినట్టి దేవుఁ * డెత్తి కొంపోయినఁ బొగుల నేల! వగపు మిగుల నేల!
గీ॥అవగుణంబులు మిగుల మా యంగఁజేసి సుగుణములను వేయంత లెచ్చుగను జేసి
ప్రణయరతులైన నరుల దేవతలఁజేతు వోవియోగమ! నీవృత్త ముత్తమంబు. 55
మ॥ జననీ! నీవు దయాసముద్రమవు! యుష్మద్భక్తు సేవేళలం
దున నేరీతిని గష్ట సౌఖ్యముల యం మీ దేల్పఁగానుండు వా
పనుల నీవయి తీర్పఁగా ననుభవింపనంతగక ! వ
ర్ధన నే నెంతటివాఁడ! నాకెపుడు నీ యాజ్ఞల్ శిరోధార్యముల్.
స్థిరమగు వానిలో 4 స్థిరతమంబగు చోటఁ! జిరపుణ్యరతులు వ
నాశమెప్పుడును గ , సంగఁ బోవని చోట! నానందనిలయమై
వ్యాధు లించుకయును బాధ సేయని చోట! సత్యంబు స్థాయిగా
గైవల్య లక్ష్మికిఁ గాపురంబగు చోటఁ! జిత్తంబునకు శాంతి చెడని చోటఁ!
గీ॥ బేమ యమృతరూపమున న శీర్షించు చోట! నామణిద్వీప రత్న సిం హాసనమున!
శ్రీభవానీపదంబుఁ జే రితివి! గాన నేల నీకయి వగవఁ! గా మేశ్వరయ్య !
గీ జర నమలుచున్న యస్థిపంజరము నాది! యింక సుఖమొందఁ గల యాసలెందు లేవు;
మధుర దరహాస వదన పద్మంబు నీది మఱచిపోవుద మన్నను మఱపు రాదు.
సీ కలశపాథోరాశీ గర్భమందు జనించు నలల బంగారు టు
నలచతుర్దశలోక 4 ములను బావనమాచుఁ దనరు మణిద్వీప
గొడుగులు వంచిన 4 ట్లడరు కదంబ వృక్ష వితాన శీతల చ్ఛాయ లందుఁ!
శ్రీలఁ జెన్నా రెడి , చింతామణీ భద్ర సింహాసనము పార్శ్వ
ఆ॥ బాల కడలి చలువఁ దేలు తెమ్మెరలందు! నీడు లేని పసిఁడి
జరుగు చోటఁ!
♦
57
గీ॥
య్యాల లందు!
తటము లందు!
సీమ లందుఁ!
మేడ లందు!
గౌరి లోకజనని . కామేశ్వరస్వామిఁ ద్రిప్పి కూర్మి నాద రించుఁ గాక !
క॥ ఈమహనీయ గ్రంథముఁ గైమోడ్చుచు నంకితమ్ము గా నిచ్చెద నే
కామేశ్వరికి.
బ్రేమఁ బెనుప నోచని నా కామేశ్వరు నెత్తి పెంచు
డి. రాజశేఖరం.
సించు చోట!
యలరు చోట!
53
56
59
60</p>
<pb n="41" />
<pb n="42" />
<p>SER RE
9893C
BASER BL
60)
AKARAKARAK
发
కామేశ్వర్యైనమః॥
ణాప్రతాప సింహ చరి
AREAERERAR
33622628
es
మత్కందుకమట్లు గుండ్రమయి వా రిక్ రెండు పా త్రొక్క పాల్
భూమిక్ నిండియు నూఱునర్వదియుఁ గోట్లుక్ మర్త్యు లోప్పారఁగా,
బుల్ మీఱ, విశ్వంబు శో
తైశ్వర్యముల్ చాటుచున్
వ్యోమంబంటు నగాధిరాజ నివహం
భామూల్యస్థితి నొప్పు నీశ్వరు ననం
సీ కాంచన శృంగ భాగము కిరీటముగాఁగఁ! గాశ్మీర మాస్య పంకజము గాఁగ!
సింధుగంగానదుల్ చేఁదోయి గాఁగ! నార్యానర్త దేశం బురంబు గాఁగ!
వింధ్యాచలేంద్రంబు బెడఁగు మధ్యము గాఁగ! గౌతమి కనక మేఖలయుఁ గాఁX!
మలయ సహ్యాద్రు ల 4 గ్గులు గాఁగ! సింహళద్వీప మంభోరుహ పీఠి గాఁగ!
గీ॥ లవణ రత్నాకరము సరః ప్రవరమగుచుఁ జెలఁగు భారతదేశ లక్ష్మీ సమగ్ర
భాగ్య సౌభాగ్య విగ్రహ ప్రాభవమ్ము లిట్టివని వివరింపఁగా నెవరి తరము!
శా॥ జానొంద బహుళాంబు పూరము వనా శాశంబళల్ నింప, స
స్యానీకంబు సమృద్ధమై యెదిగి భాగ్యస్ఫూర్తి హెచ్చింప, ల
క్ష్మీ నిత్యోత్సవ మందిరంబయి తనర్చెక్ విశ్వ సర్వోన్నత
స్థానం బంది సమస్త వైఖరుల రాజస్థాన మవ్వేళలో.
·
థ మా శ్వాస ము.
రిత్ర.
సీ॥
ఇట్టి రాజస్థాన , మెపుడు స్వతంత్రులౌ జనపాలమణుల పా లనము నొందు
దేశంబు లిరువది . దీమీప వెలుగొందు; వానిలో నెల్ల మేవాడ దేశ
మగ్రగణ్యము; దాని , యధిపతి యగువాని 'రాణా' యని జనులు ప్రస్తుతింతు;
రతఁడు మతాధిప o త్యమున నెల్లరకు జగద్గురుండగుచు వి । ఖ్యాతిఁ గాంచు;
గీ॥ నగరములలోనఁ గాళికా నగర మట్లు చిరయశము గాంచుఁ జిత్తూరు పురవరంబు;
నచటి రాణాయు నందఱ నగ్రపూజ్యుఁ! డెల్ల సురలందుఁ గాళి వి శ్వేశు మాడ్కి.!</p>
<pb n="43" />
<p>1
1
ప్ర తాపసింహచరిత్ర.
§
సీ హారావళీ పర్వతావళి విరివిగా నింద్ర నీల శిలల నీను చుండ!
సాంబారు లూనీ వి శ్రీ శాల ప్రదేశముల్ సహజమౌ లవణం బొసంగు చుండ!
గను లెల్లెడల మర 4 కతములు రత్నముల్ సౌవీరమును మంచి . స్ఫటికములు
జంద్రకాంతశిలలు , స్వర్ణ రౌప్యంబులు నెడ తెగక యె యెప్పు డిచ్చు చుఁడ!
గీ భాగ్యము లొసంగి యేలిన వారి యిండ్లు బంగరు గొండలట్లు సేరియంగఁ గలిగి
'రత్నగర్భ' యటన్న సార్థక పదంబుఁ బడసి మేవాడ దేశంబు పరిఢవిల్లు.
,
శా॥ ఆవిశ్వోన్నత పుణ్య వైభవ యశో హారాళి హారావళీ
గ్రావోత్తంసము తూర్పునక్ సరసిజా
రామంబునక్ బొల్చు ల
జిస్తూర్పురు బొప్పఁగా
మించు ధరాస్వర్గమై.
2
క్ష్మీవామ౯ బలె రాజధానియగుచు
మేవాడ్ దేశము వీరఖ,డమగుచు
ఆ సీ। సచరాచర ప్రపంచప్రాణమగు సూర్యభగవానుఁ డాదిమ • వంశకర్త!
త్రిజగతీ ధానుష్క దీపకుండయిన రాముని సుతుండు లవుండు మూలపురుషు
•
§ The tin mines of Mewar were once very productive and yielded, it
asserted, no inconsiderable portion of silver, but the caste of miners is extinc
and political reasons, during the Mogul domination led to the concealment of suc
sources of wealth. Copper of a very fine description is like wise abundant ar
supplies the currency. Soorma or oxide of antimony is found on the wester
frontier. The garnet amethystine quartz, rock crystal, the chrysolite and inferi
kinds of emerald family are all to be found within Mewar, and though I have see
no specimens decidedly valuable, the Rins has often told me that according 1
tradition his native hills contained every species of mineral wealth.
Such the pride of these small Kingdoms in days of yore and such thei
resources, till reduced by constant oppression. But their public works speak wha
they could do and what they have done; witness the stupenduous work of marbl
and its adjacent causeway, which dams the lake of Raysumund at Kankarowli ar
which cost upwards of a million. When the spectator views this expanse of wate
this (Royal sea) on the borders of the plain; the pillar of Victory towering ove
the plains of Malva, erected on the summit of Chit or by Rana Mokul, their palace
and temples in this ancient abode, the regal residence erected by these Prince
when ejected, must fill the observer with astonishment at the resources of th
state. They are such as to explain the metaphor of my ancient friead Zalim Singl
who knew botter than we, the value of the country; 'every pinch of the soil
Mewar contains gold.'
"Annals of Mewar."
These are styled 'Ranas' and are the elder branch of Sooryavansi O
'Children of the Sun.' The Hindu tribes yield unanimous suffrage to the princ
of Mewar. as the legitimate heir to the throne of Rima and style him 'Hindu</p>
<pb n="44" />
<p>థ మా శ్వా స ము.
డిష్టుడైవ!
డల యగస్త్యాశ్రమ ఖ్యాత మాబూగిరి సేకలింగేశ్వరుఁ
మతిపావనము లయో ధ్యా వల్ల భీ సీమ లాదికాలము నాఁటి యాటపట్టు!
రాజ పరమేశ రణ విహార ప్రతిష్ఠ
ఖుడఖండాంత నగర వి * ఖ్యాతి హేతు వట్టి మేవాణ్ణృపుల నెన్ననలవి యగునె! 7
మః॥ సమమై యొప్పు విశాల శైల శిఖర స్థానంబునక్ రాజపు
త్రమహీకాంతకు వజ్ర భూషణమటుల్ రాణించుఁ జిత్తూరు సం
ద్రముమధ్యంబునఁ గోటలేడు కొమరొం ద బైకిఁ గన్పట్టు దు
గ్గమ లంకాపుర పూర్వవైభవము జోకల్ జ్ఞప్తికిక్ దెచ్చుచుకో.
గీ॥ ప్రక్క ప్రక్కనఁ బదిబండ్లు వరుస గాఁగ నరుగ ననువైన వైశాల్య మతిశయిల్ల
*
సహిత దుర్భేదమగు గోడలలరు కోట లేడు చుట్లు చిత్తూర్పురి 4 కెసఁగి యుండు. 9
* సీ। విఫణిమార్గములతో! వీధుల తుద నొప్పు శివకేశవాలయ శ్రేణి తోడ!
నారామములతోడ! నవరంజి దాఁపిన సముదార భవనాంగణముల తోడఁ!
జతురంగములతోడ! 4 నతివిశాలంబైన వివిధాయుధాగార • వితతి తోడ!
మణిచితద్దికలతో! । మధుర నానాజాతి ఫలమహీ రుహ కదంబకము తోడ!
గీః సౌధముల తోడ! బహుసర స్సమితి తో రచ్చగమి తోడ! వారి యంత్రముల తోడ!
భరత ఖండైక లక్ష్మీ ని . వాసభూమి నగరమాత్రం బె చిత్తూరు నగర వరము!
•
గీ॥ లాశిలాదిత్య కనకసే నాది
రాజ
9
8
Soorag' or Sun of the Hindus. He is universally allowed to be the first of the
thirty six royal tribes,' nor has a doubt been raised respecting his purity of
descent.</p>
<p>(Succeed)</p>
<p>"Annals of Mewar."
It is well known that the Rajas of Udaipur are exalted over all the princes
of Hind. Other Hindu princes before they can succeed to the throne of their
fathers must receive the Khuska or tilac of regality and investiture from them.
This type of sovereignty is received with humility and veneration.
"Lakshmi Narayana Shufeek Arangabad."
Chittor is within the grasp of no foe, nor can the vassals of its chief know
the sentiments of fear. Its towers of defence are planted on the rock nor can their
nmates even in sleep know alarm. Its kotars are well filled and its reservoirs,
fountains, and wells are overflowing. There are sighty four bazars many schools
for children and colleges for every kind of learning, many scribes of the Beedur
tribe and the eighteen varieties of artisans. Of all, the Ghelote, is the sovereign,
served by numerous troops both horse and foot and by all the thirty six tribes of
Rajputs of which he is the ornament. Of all the royal abodes of India none could</p>
<pb n="45" />
<p>4
&
పసింహచరిత్ర.
న
♦
నడువనే
మ॥ వనితాశీలము నిల్ప శత్రువులఁ ద్రుం పక్ నేడు చిత్తూరు ద
ప్పిన నీలోకము శూన్యమంచుఁ గరముల్ వేయెత్తి ఘోషించెనో
యన సూర్యధ్వజకోటు లెల్లెడ సహ సాంశుల్ పిసాళించి న
ర్తనమాడుక్ మృదులానిలంబు తమవిఁ దక్షాసోఁక హేలాగతిక్.
సీ। నవ్వనేర్వికమున్నె క్రొవ్విన రిపుకోటిఁ బాఱఁగఁ దోలి నవ్వంగ
కూర్చుండుటకుమున్నె క్రోధోగ్ర శత్రు వక్షో దేశ మెక్కి కూర్చుండ నే
నడువకమున్నె చం • డ విపక్ష మకుట సంతతులఁ బాదము లుంచి
పరువులెత్తకమున్నె పరిపంధితతి నొంచి తఱుముచు వెనువెంటఁ
గీ!! రాడుటకుమున్ని ఘోర రణాంగణముల నరిశిరంబులతో బంతులాడ నేరు!
కార! చిత్తూర్పురి జనించి పట్టివారు శైశవము దాఁటుటకు మున్నె శౌర్యమహి మ
శా॥ ఇంద్రప్రస్థము గాదు! ద్వారక యుఁ గా! దే కాశియు గాదు! ని
స్తంద్ర ప్రాభవ కీర్తి శోభిత మయోధ్యా పట్టణం బేని గా!
దింద్రోపేంద్ర సమానులౌ నృపులు తా మేలంగఁ జిత్తూర్ మహ
స్సాంద్ర శ్రీలను గుత్తకు గొనిన యాచందంబు దీపించెడుకొ.
.
13
సీకి హరిత మౌనీంద్రు పాదాబ్దాతయుగళికి శిష్యుఁడై శుశ్రూష చేయఁగలి !
వ్రాఘ్య శై లంబు తాపసు కూర్మిఁగని ద్విధారా ఖడ్గమును బొంది . రాణ మెఱ సేఁ।
బ్రకురుల గెల్చి 'భా · రత సూర్యుఁడనియు 'విశ్వపతి' యనియుఁ గీర్తి పడయఁగలిగె
'ఖాండహా రిస్సహాక్ ' * 'కాఫరి' స్థానాది మ్లేచ్ఛ సీమల గెల్చి మెప్పుగాం చె
గీ। వందలకుఁబైనఁ బుత్రులఁ బడసి సూర్యవంశమును నిల్పి సౌపర్వ పర్వతమునఁ
•
దపము గావించి ముక్తి కాం తను వరించె! 'బప్పరావు' మేవాడ్భూపవంశకర్త. 14
సీ॥ తమ యుపనదుల సంతతులెల్ల మెడి రేకులు వోలె నెల్లెడ నలము కొనఁగ,
జహ్నుకన్యా సింధు , సలిల పూరమ్ములు సారతఁ గూర్ప, బం గారు పండు
రసఖండమై, పచ్చ । రా బయలుల మాడ్కి లలిత సస్యశ్యామలంబు నగుచుఁ,
బిడికెడు చోటైన వెలిఁబోవ నట్టి యార్యావర్త బహుళ భాగ్యాంక కథలఁ,
♦
బఱవన్
జవనేన్రు!
11
Near the temples are
compete with Chittor before she became a widow.
two reservoirs built of large blocks each one hundred and twenty five feet by fifty
teet wide and fifty deep, said to have been excavated on the marriage of the "Ruby
of Mewar" to Achil Keechie of Gogrown and filled with oil and ghee which were
served out to the numerous attendants on that occasion.
''Tods' Rajasthan Vol. II"</p>
<pb n="46" />
<p>5
థ మాశ్వాసము.
4
15
గీ॥ జెవులు చిల్లులుపోఁ బారసీక యవన ఖాండహా రిస్పహాను బాగ్దాడు మొగలు
గఙ్నపతులు మిడుతదండు . క్రమ్మినట్లు దాడి వెడలిరి తండోప తండములుగ.
గీ! ఎనిమిదవ శతాబ్దారంభ మనఁ గలీపు 'వాలిదు' తొలుత ఖాసిముఁ బంపె; నతఁడు
సింధుదేశమ్ము దాఁటి కాశీపురంబువఱకుఁగల సీమలన్నియుఁ
మ॥ ఒక బాగ్దాడు నరేంద్ర చంద్రుఁడు "కలీప్ ఓమార్ అబుల్ హాసు సే
న కధీశు బొనరించి హైందవముపై నక్ బంపఁగా దూరమెం
చకయే యామడ యడ్గుగా నడిచి రా ॥ జస్థానము జేరీ భూ
పకులారణ్యముల దహించె నతఁయు వైశ్వానర ప్రక్రియ.
16
బాడు చేసే.
99
+
17
గీ అతని నజమీరు తారాగృహాధిపతియుఁ దొడరిమడిసె దూలారావు! కొడుకుస ప్త
ముల లాటుఁ డరిఁగూల్చి వానిమెట నరిగె నభిమన్యుపై చేయి మన జగంబు .
సీ॥
॥ లాటసింహుఁడు మహోగ్రాటోపనిధియంచు నజరామరంబైన యశముఁగాం చెఁ;
జోహణు లా బాల । శూరుని విగ్రహంబులు రచింపించి దేవుని విధానఁ
బ్రతివత్సరము భక్తి శ్రీ వఱల జ్యేష్ఠద్వాదశీదినమందుఁ బూజించు చుందు;
రాలాటుఁ డనిచేయు 4 నపు డున్న కాలిగజ్జెల నెల్ల జనులు ద ర్శించిపోదు;
ఆ॥ రాదినంబునుండి 4 యీదినంబునకుఁ జోహణకులంబువారలాత్మజులకుఁ
గాలిగజ్జయలను 4 గట్టరు; లాటునియెడల వారిభ క్తి యెట్టి దొక్కొ!
సీ॥ భాగ్య సౌభాగ్య సంభావ్యముల్ సింధుఘూర్జర దేశములను వర్తకము పెంప
'టైగ్రిస్'నదీ కృపీ టపవిత్రమైన 'యరాబియా' పాలించు రాజలోక
మణి కలీప్ ఉస్మాను, మఱి కలీప్ ఆ, యేజీదు ఖొరాసాను
యబ్దుల మలీకు సైన్యసముద్రములను బొంగించి హైందవమును
గీ॥ రటుపయిని "హరూ ఆల్ రాశ్చిందను కలీప్ అరాబియా మొదల్ కాశి పర్యంతమేలె;
నవ్వల " సె బాక్ట జిను"వచ్చె! నతఁడు ప్రళయభైరవుని మహమ్మకుఁ దెచ్చె వానికొడుకు.
మ॥ తడవిం తేనియు లేక వీరభటసంతానంబు తగ్గొల్చి మె
బడిరా సింధునది దరించుచు మహమ్మద్ గజ్ని గజ్నీ విభుం
డడువుల్ గాల్చుచు భస్మము సలుపు దావాగ్ని క్రియ
దుడిచె భారతదేశ పట్టణము లందు గల్గు సర్వస్వము.
మ॥ కడుసౌభాగ్యము గల్గు రాష్ట్రముల వంక సుంత కన్నెత్తి చూ
డఁడు; బంగారము పండు నేలలను జూ డం డట్టె పేర్వాసిగాం
బొంగుచ్ు
19
క్షితిపమౌళి,
ముంచి తేల్చి;
21</p>
<pb n="47" />
<p>1
1
Fణా
ణాప్ర
పసింహచరిత్ర.
మ! అనయోత్సాహముతో మహమ్మదు చలం
చెడు దేవాలయలింగముల్ పెఱికి గజ్నీ సౌధ సందోహ మె
క్కెడు సోపానచయంబుఁ చేసె విహితుల్ కీర్తింప వేభంగుల.
భారంగ సౌరాష్ట్రమం
దున విచ్చేయుచు సోమనాథపురమందు సోమనాథేశ్వరా
దీనిలింప ప్రకర ప్రపూజ్యమగు జ్యోతిర్లింగ సంఘాతమ్ు
దునియల్ చేయుచు ద్రవ్యరాసులను దొం తుల్ దొంతులు జేకొనెక్,
సీ॥ భువనవీర సమూహమున మేటి యితఁడంచు యశ మొందఁ గనిన మహాభుజ
కొండపల్లెను మార్చి । గొప్పసామ్రాజ్య సంస్థగఁ జేయు రాజతం త్రజ్ఞమౌళి!
।
కన్న కొడుకునైనఁ , గడికండలుగఁ జీల్చి ధర్మంబు నిలుపు ను దారబుద్ధి!
విశ్వకళాశాల । వెలయించి దేశదేశముల విద్యనునించు జ్ఞానమూర్తి!
గీ॥ కవుల పాలిఁటి ముంగిటి కల్పకంబు! విగ్రహారాధనముపైన వెగటువలన
గజినిమహమూదు దండెత్తెఁ! గాక యున్న నంతవాఁడెట్లు జనహింస కనుమతిం
గీ ఇటుల పండ్రెండునూర్లు దండెత్తి వచ్చి ధనకనక వస్తుతతిఁ గొని చను కాని
భరతఖండంబు శాశ్వత వాసముగను జేయఁదలఁపక నిజసీమఁ జేరుకొనియె.
ఉ॥ ఆ కడగండ్లు తీఱి భరతావని కొంతకుఁ గొంత కోల్కొనర్
బోకయమున్నె వేజోకరి పుండు మహమ్మను పేరివాఁడు ఘో
*
రీకులుఁ డాత్మవాహినులు క్రిక్కిరియంగను గోరుచుట్టు పై
రోఁకటిపోటునాఁ బ్రళయ రుద్రునికై నడి వచ్చె యుద్ధతి.
।
శాక ఆకాలమ్మున సార్వభౌముఁడయి. యా ర్యావర్తము బృథ్విరా
జేకచ్ఛత్రముగాఁగ నేలె; నతఁడయ్యింద్రాత్మజుబోలె సు
శ్రీ కల్యాణపరాక్రమోన్నతుఁడు; ఘోరీవంశజు దాఁకి చీ
కాకై పాఱఁగఁజేసెఁ దత్ప్రబల సేనానీకము' బల్మరు.
గీ॥ చేరి హమ్మిర గంభీర సింహనృపులు 'కాకసస్' పర్వతమునుండి కాశిదాఁక
నూటయెనమండ్రు క్షితిపుల మాటమాత్రఁ బిలిచికొనివచ్చి పృథ్వీశుఁ గొలుతు రెపు
• మ అతి తేజోబలధాముఁ డాసమరసిం హక్ష్మాతలేంద్రుండు వం
దిత నానాజనపాలలో కుఁడగు పృథ్వీభర్తకు సోదరీ
SO
Samarasimha proceeded to Delhi. His arrival at Delhi is hailed with songs
joy as a day of deliverance. Prithwi Raj and his court advanced seven miles to me
him and the description of the king of Delhi and his sister and the chiefs on eithe</p>
<pb n="48" />
<p>7
థమాశ్వాసము.
29
పతి, వజ్రాయుధకోటి మ్రింగఁగల మే వాడే దేశ రాహుత్తులుగా
గృతహస్తుల్ దనుఁగొల్వ వచ్చె నని కేకీభూత చేతస్కుఁడై.
గీ॥ భరతఖండంబు నాక మిం పంగఁ దలఁచి యేడుమాఱులు ఘోరి దం డెత్తి వచ్చె;,
మఱఁదియును బావయును దారుమారు చేసి యతని వెనుకకు నంపించి రాఱుమార్లు.
సీ॥ 'త్వార్వంశ సంజాత ధరణీత లేశ్వరుల్ పూర్వ మింద్రప్రస్థ పురిని సార్వ
భౌములై 'యేలి; ర + వ్వారిలోన ననంగపాలుండు కడపటి వాఁ; డతుడు
పుత్రసంతతి లేక , పుత్రికలను నిర్వురను గాంచె; మొదటి దా । నిని గనూజి
బీజపాలునకును , బిదపటి దాని సోమేశున కజమీరు దేశ పతికి
గీ॥
నిచ్చె; వారికి జయచంద్ర పృథ్వివిభులు గలిగి; రయ్య నంగుఁడు కొంత కాలమునకు
వ్యాధి పీడితుఁడగుచు ని , జాత్మజలను మనుమలను బిల్చుకొని చెంత 4 నునిచికొనియె.
గీ॥ ఒక్కనాఁడు పట్టాభిషేకోత్సవంబు జరుప సామంత నృపుల నందఱను జేర్చి
యయ్యనుగుఁడు "ఢిల్లి సింహాసనంబు నెక్కుమ"న నెక్కి కూర్చుండెఁ బృథ్వియపుడు.
సీ॥ 'ఇరువుర మేము జా హితులమైయుందు మప్పసెల్లెండ్రుకునాత్మజులము.
నెన్మిది యేండ్ల ప్ర్రాయమందున్న సక్ వదలి యెనిమిదేండ్ల బాలుఁ బృథ్వి
పదియు
side who recognize ancient friendship is most animated. Samarsi reads his brother-
in-law an indignant lecture on his unprincely inactivity and throughout the book
divides attention with him.
In the planning of the campaign and march towards the Caggar, to meet
the foe. Samarsi is consulted and his opinions are recorded. The bard represents
him as the Ulyses of the host; brave cool and skilful in the fight, prudent wise
and eloquent in council, pious and decorous on all occasions; beloved by his own
chiefs and reverenced by the vassals of the chohan. In the line of march no augur
or bard could better explain the omens, none in the field could better dress the
squadrons for battle, none guide his steed or use his lance with more address. His
tent is the principal resort of the leaders after the march or in the intervals of
battle, who were delighted by his eloquence or instructed by his knowledge. On
the last of three days desperate fighting Samarsi was slain together with his son
Calyan and thirteen thousands of his housebold troops and most renowned
chieftains. His beloved Pritha. on heiring the fatal issue, her husband slain, her
brother captive, the heroes of Delhi and Chittor asleep on the banks of Caggar'
in the wave of the steel, joined her lord through the flame.
"Annals of Mewar."</p>
<pb n="49" />
<p>4
8
ప్రతాప సి
2హ చరిత్ర.
♦
సింహాసనాసీనుఁ జేయు టధర్మ! మీతని యధికార. మే । ననుమతింప!
నాక్షేపణ మొనర్తు" । నని ధిక్కరించి యాజయచంద్రుఁ డేగె నా సభను వి
గీ! యతనితోడ నాబూపర్వ తాధికారి వ్యాఘ్రరాజేంద్రుఁడును బట్ట
డస్రమబలుఁడు భోళాభీముఁ * డాక్షణంబ కదలిపోయి రాస్థాన రంగంబు వదిలి
ణాధినాథ
సీ తుహినాద్రి నుండి సేతువుదాకఁ దనరు నఖండ భారతఖండ
మండలంబు
సకల మేకచ్ఛత్ర . సామ్రాజ్యముగ ధరిత్రీ రాజ్యమేలెఁ బృధ్వీనృపాలుఁ!
డామహావీరుని శ్రీ యసమ సంగామ జయంబు సామంత ధ రాధిపతుల
పౌరుష విక్రమ • ప్రాభవంబులు ధర్మసంస్థాపనాచార్య చతురతలును
గీ జంద్ర భట్టారక సుకవి చక్రవర్తి వ్రాయు శతసహస్రాధిక గ్రంథమందు
రససమృద్ధిని బర్వ పర్వంబునకును జీవకళ లుట్టిపడఁగ రం జిల్లుచుండు!
చÜ అమిత విశాలమై సిరు లనంతముగాఁ దగి కాన్యకుబ్జరా
జ్యము మును దక్షిణాపథము నందును వ్యాపన మొందె; రాజసూ
యము నలధర్మనందనుని యవ్వల సీజయచంద్రుఁ డొక్కఁ డు
క్కుమిగిలి చేయనేర్చెనృప కోటి యొనర్ప సమస్త కార్యముల్..
గీ
అధ్వరము చేసి యతఁడు ని * జాత్మజాత పరిణయ మొనర్పఁగా స్వయంవరము చా
సకల దిద్దేశవర్తి రా 4 జన్యులకును బంపె వైవాహి కాహ్వాన పతములను,
సీ! తన కెకా దింక భూ । స్థలి రాజులకు నెల్లఁ బెద్దయా రారాజు పృథ్వీరాజు
మౌళి కాహ్వాన మం • పమి యట్టులుండ, నావిభు విగ్రహము రచిం పించి, సేవ
కుని దుస్తులిడి, తీసి . కొనిపోయి యాస్థానమున మహాద్వారంబు ముంగల నిడె!
నాస్వయంవరమున । కరుగుదెంచిన సర్వభూమీశ్వరులు ద్వారా సీమ నిలువఁ
గీ! బడిన యాతనిఁ జూచి సంభ్రమముభయమునొంది గుసగుసల్ వోవుచు నొదిగియొడ్
కూరుచుండిరి; మందార హారముఁ గరమందుఁ గొనివచ్చె సంయుక్త యచటి కపుడు.
మ॥ విమతుం డాజయచందుఁడుకో నృపుల వేర్వేఱక్ నిరూపించి వా
రి మహానైభవ ముగ్గడింప విని నీ రేజాస్య కన్నెత్తి చూ
డమి నుద్యోగులఁ జూపెఁ; గాంతయును దాఁటక్ జొచ్చె; నాస్థావరం
గమునం దందఱఁ జూ పెఁ దండ్రి; సతియుగాంక్షింపలే దెవ్వరికో..
మ పెనుకోపమ్మున మండి యాతఁడు సుత బృథ్వీశు బింబంబు
త్రో
వను గేల్వట్టియు నీడ్చుకొంచరిగి "నా బం టీతని జూడు; మి
♦
♦
♦
3.</p>
<pb n="50" />
<p>థమాశ్వాసము.
మ్మన జుక్
జ గూడు" మటంచుఁ ద్రోయఁ జెలియుజ్ మందారహారంబు వే
సి నమస్కారము చేసి నిల్చె నెదుర; సిగ్గంతలోఁ బైకొనె.
మ॥ సుమహారంబు గళంబున బడిన యచ్చో విగ్రహం బట్టె మ
ధ్యమున్ బ్రీలుచుఁ బృథ్వి రాజతిలకంబావిర్భవం బంది య
క్కొమఁ జేత్ గొని యశ్వ మెక్కి "యిడిగో కొంపోవుచున్నాఁడ! ధై
ర్యము మీకుండిన నన్నుఁ దాఁకుఁ"డని చే ర బోయె ఢిల్లీపురి౯.
మ॥ 'సమరోర్వీతల ఫల్గునుం డితఁడవక్ సత్కీర్తి దిద్దేశ భా
గములం దల్లిన యామహాప్రభుని దాఁక
.
+
ధైర్యముల్ లేక యె
తోఁక ద్రో
ల్ల మహీంద్రుల్ తల ల వంచుకొని యిండ్ల జేరి; రా
లక్టై
41
క్కు మహాహిక్ బలె నక్క నూజిపతియుక్గ్రుద్ధాత్ముఁ డయ్యెక్ గడు.
గీ॥ ఎందఱనో యాశ్రయించి యెన్నెన్నొ గతులఁ గుట్రలు కుతంత్రములు పన్ని కోటియత్న
ములను జయచంద్రుఁ డొనరించి ఫలముగానఁ;డరులు బెగడొందఁ బృథ్వీంద్రుఁడవని నేలె
సీ॥ ఇంకొక్క మాఱు దండెత్తిరా జయచంద్రుఁ డర్థించె ఘోరీమహమ్మదు విభు!
నావార్త విని యసం । ఖ్యచమూతతుల్ కొల్వ నరుదెంచె సమరసిం హప్రభుండు!
మూఁడు క్రోసుల దూరమున కేగి పృథ్వీంద్రుఁ డడుగులకును మ్రొక్కి యతనిఁ దెచ్చెఁ!
'గగ్గార్'నదీ తట ట్మెసీమ యవనసైన్యము లుండె! ఢిల్లీపై 4న్యములు చేరె! (పోయి
గీ॥ నాప్తులును దాను జయచంద్రుఁ డాయవనులఁ గడిసె; నుదయ మయ్యదిచూచి కదలి
తండ్రి మృదుపాదములకు వందన మొనర్చి యొప్పుమెయి మహారాజ్ఞి సంయుక్తయపుడు
సీ॥ "భారత స్వాతంత్ర్య భరము మాపఁగ వైరు లరుదెంచి! రదినిల్ప నరుగుదెంచె
నాప్ర్రాణవిభుఁ డఖం । డ ప్రాభవుండు! నేనుండ వేర్వేఱ మీ కుండఁ దగదు!
ధర్మపక్షము మాది! శ్రీ దయచేయవయ్య! పృథ్వీవిభు నర్థాంగిఁ బిలుచుచుంటిఁ!
జెడుగులే దీవు వచ్చిన! సత్కరించు నాభర్త! నిక్ వైరము వదల దేని
గీ! యేగుము కనూజి; కటులు పోవేని భారతావనిని దాస్యమునఁ ద్రోయునపయశంబు
లనుభవింతు వాచంద్ర తారార్క "మనుచు మ్రొక్కి సాగిలపడఁ గడుఁ గ్రుద్ధుఁడగుచు
సీః కమనీయ భారత + ఖండ సామ్రాజ్య సౌభాగ్యలక్ష్మి విధానఁ బరగు మంగ
ళోదారమూర్తి సం యుక్త సాగిలపడియుండ భూదేవ మం త్రోక్తిపూత
కంధిజలాభిషే క పవిత్ర మామెమూర్థము నట్టె వామపా దమునఁ దన్ని
"కదలిపో! నాసము ఖమున నుండకు" మంచుఁ ద్రోసిన లేచి యాదొడ్డతల్లి
39
40</p>
<pb n="51" />
<p>10
తాపసింహచరి త.
గీ॥ "తెలిసినది విన్నవించితి! దీన నీదు హృదయము కఱంగుకున్న నే నేమిసేతు"
į
*
నని కదలివచ్చె! నుభయ సైన్యములకును రణంబు ఘోరంబుగా మూఁడు నాళ్లు జరిగె
వెంబడి
గీ సమరసింహుండు పడియె; సైన్యములు చెడియె; రాజపర మేశ్వరుండు వీర ప్రభుండు
పృథ్విరాజేందుఁడును ఢిల్లీ రిపుల బారిఁ బడిరి; భారతదేశ దౌర్భాగ్యక లన
మః తొలుత సాయము చేసి నట్టి జయచందు దాఁకె ఘోరీయు; దు
ర్బలుఁడై రాజ్యము వాఁడు వీడి చనెఁ; దా
డు వీడిచనెఁ; దా ర్తార్' వీరులు
గలయ దాఁకిరి; దిక్కులే కతఁడు గంగావాహిని దూఁణి య
వ్వలి కేగెజ్; దలఁ ద్రుంచి చంపిరి రిపుల్ వైవస్వత ప్రాయులై
సీ। "తత రమాఖండ భారతఖండ గగనాగ్రరంగ మధ్యాహ్న మార్తాండమూర్తి !
ఒప్పరాయాన్వయా 4 భరణ వట్రింశ నృపాలక కుల భూరి వజ్రమకుట!
యరిగితీ ననుఁ బాసి; చెఱవడె నాపృథ్వీ; మఱఁద లెదరిగెనో యెఱుఁగరాదు;
పదమూఁడు వేల్ దొరల్ కదలఁ గల్యాణుండు పుష్పా స్త్రసముఁడు నా ముద్దుకొడుకు
గీ తన స్వయంవరమునకట్లు చనియె దివికి; నిచటఁ బనియేమి మీరింద । జేగుపిదప!"
•
47
సని వృథాదేవి వగచి నిన్న నుగమింప సమసితే శత్రుగజసింహ! సమరసింహ ' 48
సీ! "ప్రార్థింతు వలవ దీ ! పని" యంచు సంయుక్త కొనకాళ్లఁ బడి వేడు . కొనిన వినక
ఘోరీని బిలిపించి . కొంప కగ్గి ఘటించి నృపచంద్రు సమరసిం హేంద్రుఁ ద్రుంచి
పృథ్వీశు నట్టేట • నిడి కుంకుమూడ్చి సంయుక్త వైధవ్య సం యుక్తఁ జేసి
యుర్వి యున్నంతకు + నుగ్రాపకీర్తిమై రాజ్యంబుఁ బారతంత్ర్యమున నిడి తె!
గీ కటకటా! కోటియుగములు
నతనికన్నులు దీయించె
గీ "చెట్టుపైఁ బక్షి శిరమును
జెండు "మనినఁ బృథ్విరాజు మూఁడుశరంబు లెత్తి పక్షి
కంఠమును, వెంటనే, ఘోరి గళముఁ ద్రుంచి, యాత్మహృదయంబు భేదించి యరి గెదివికి.
గీ। పృథ్వినృపమౌళి కులము, ఘోరీ కులంబు, సమరసింహు కులము, జయచందు కులము
నాల్గుకులములు మొదలంట , నాశమయ్యే దుష్టుఁడగు నొక్క దేశవిద్రోహికతన.
క॥ "కుతుబుద్దీ" సేవక సంతతివాఁడు! సమర్థుఁడౌటఁ దగునని ఘోరీ
పతి భారతసామ్రాజ్యం బతని వశము చేసియుండెనంతకు మునుపే!
ఉ॥ జంభవిరోధి వైభవ విశాలత భూపజ నేలి శాశ్వతో
జ్జృంభితకీర్తి చంద్రికలఁ జిమ్ముచు వాఁడు 'కుటుబ్మినార్' శిలా
·
♦
గడచుఁగాక పృథ్వివిభువంటి రాజరా జెటులఁ గలుగు!
యవననృపతి! చెనఁటి జయచంద్ర! నిబిడదు క్షీర్తి రుద్ర!</p>
<pb n="52" />
<p>ప్ర
థ మాశ్వా స ము.
సంభృతమై పొలుపొంద నిల్పె; వి
సప్తవిచిత్రము లందు నొక్కఁడై.
భాగంబుఁ బెక్కుర్ నృపా
లురు; ఖల్జీకులుఁ డొక్కఁ డాదట జిల్లాలుద్దీను దుస్తంత్రము
మ పరిపాలించిరి వానివెన్క ధరణీ
ష్కరుఁ డపుండెడు ఢిల్లిరాజు శిరముఖ ఖండించి యేతత్పురీ
వరము జేకొని రాజ్యమేలఁ దొడఁగె
స్తంభము నొక్కదాని జయ
శ్వంభరం బొల్చు సయ్యదియు
p
11
బట్టాభిషిక్తుండు వై.
*
♦
క॥ అవల సలాయుద్దీనను యవనుండు పరాక్రమక్రమాటోపుఁడు పా
ర్థివుఁడయ్యె! మోగలులు దండువిడియసాగిరి కడుంగడు యత్నమున్.
మః॥ ఉరుశౌర్యంబునఁ బెక్కు మాఱులు నలా యుద్దీను మోగల్ రిపూ
త్కరము బాఱఁగఁ దోలి హైందవము నే కచ్ఛతమై యుండఁగా
జరప గోరుచు రాజ్యతృష్ణమెయి రాజస్థాన దేశంబు పైఁ
బర తెంచె యమదూతలట్టి సుభట వాతంబు తనొల్వఁగ.
సీ॥ కడుఁ బిన్నవాఁడు ల । కక్ష్మణసింగు రాజౌట భీమసిం గాశని . పిన్నతండ్రి
పాలించుచుండె మే । వాద్దేశ; మతఁడు సేనలతోడ యుద్ధ సన్నద్ధుఁడయ్యె;
యవన సేనలు కోట • కవ్వల రాజపుత్ర చమూచయుబు దుర్గమున నుండె; "'
సంవత్సరంబు నూ 4 సము లాఱు ముట్టడి సాఁగె; నయ్యుభయ పక్షంబు లందు
గీ! వందలు వేలు నై వీర భటులు మగ్గి; రంతకంతకు విజయేచ్ఛ యతిశయించెఁ
బ్రాణములపైని యాస లవ్వలకుఁ ద్రోసి రణము గావించి రాత్మ గౌరవముఁగోరి.
సీ। "వెలఁదిఁ బడ్మినిఁజూప 4 విడుతు ముట్టడి"ననె యవనేంద్రుఁ! "డద్దంబు నందుఁ జూడఁ
దగు"నని రాజపు త్రకులు దెల్ఫిరి; వాఁడు విచ్చేసి సతిఁ జూచి వెన్క కరుగు
నప్పుడు భీమసిం . గరిగె వీడ్కొల్పుచుఁ; గోట దాఁటఁగఁ దురు ష్కులు నతనిని
బట్టి "పద్మిని నియ్య • వద లేద"మని; రేడు వంద లాందోళిక లందు భటులు
§ గీ గొలువఁ బద్మిని చనెఁ; దురుష్కులను దానికి రాజపుత్రులు పోరి రబ్రంబుగాఁగఁ!
బద్మినీ-భీమసింహు ల ,వ్వలికి వచ్చి చేరిరి సురక్షితులయి చిత్తూరు కోట.
53
54
55
§ Bheemsi had espoused the daughter of Hamir Sank [chohan] of Ceylon,
the cause of woes unnumbered to the Sesodias. Her name was Pudmini a title
bestowed only on the superlatively fair, and transmitted with renown to posterity
by tradition and the song of the bard. Her beauty, accomplishments, exaltation
and destruction, with other incidental circumstances, constitute the subject of one
of the most popular traditions of Rajwars. The Hindu bard recognizes the fair,
1
TV</p>
<pb n="53" />
<p>12
3
ప్ర
3
ంహచరిత
మ॥
మ స్థిరమౌ సత్ప్రభుభక్తియుక్తి నిజరా జ్ఞే మానసంత్య్రాణ ధ
ర్మరసావేశము పొంగి పైఁబొరల గో రాసింగు బాదూలుసిం
గు రణాగణంబున వై రివీరుల తలల్ కోటానఁగోట్లు వసుం
ధర రాల౯ విహరించి రయ్యెడఁ గృతాం తపాయులై యిర్వురు.
మ॥ అమితోత్సాహముతోడఁ బో రెసఁగఁగా నానాఁడు మేవాడ రా
జ్య మహా సౌధమునందు స్తంభముల యో !. ౯ బొల్చు లోకైక వి
క్రమధౌ రేయు లొకండయేని మిగులం గాఁబోక సంగ్రామ రం
గమున వీరవిహారముల్ నెరపి స్వ ర్గంబేగి రొక్కుమ్మడిక్.
క॥ బాదూలుసింగు -బాలుఁడు ద్వాదశవర్షములవాఁడు . తనపూర్వుల మ
ర్యాదను జెడనీయక ధీరోదాత్తత రణ మొనర్చి
యొందె యశంబు.
1)
♦
చ పడతులు వేలు తగ్గొలువఁ బద్మిని వహ్నిని జొచ్చె; వైరులు
.గుడులును రాజసౌధములు గోపురముల్ బురుజుల్ గృహంబులు'
బుడమిఁ బడంగ జేయఁ బుర ముక్ సిరి దప్పె గజంబులు జోరం
బడి కలఁప గలంతవడు .. పద్మసరః ప్రవరంబు చార్పునక్.
మ॥ అనహుల్ వారయు బూంది దేవగిరి ధారావంతులు మారువా
ఈను మండూపుర మాజసల్ మియరు గోగోక్ దేశము బెక్కు లొ
య్యన నొక్కొక్కఁడు గాఁ దురుష్క నరపాలాధీశ్వరు గొల్చి యా
తని రారాజుగ సమ్మతించెఁ బరతం తత్వంబు మైఁ గుగుచుక్.
58
20
1
59
60
61
62
in preference to fame and love of conquest as the motive for the attack of Allaudin
who limited his demand to the possession of Pudmini, though this was after a long
and fruitless siege. At length he restricted his desire to a mere sight of the
extraordinary beauty and accepted to the proposal of beholding her through the
medium of mirrors. Relying on the faith of the Rajputs he entered Chittor slightly
guarded and having gratified his wish, returned. The Rajputs, unwilling to be
outdone in confidence, accompanied the King to the foot of the fortress amidst
many complimentary excuses from his guest at the trouble he thus occasioned. It
was for this that Alla risked his own safety; relying on the superior faith of the
Hindu. Here he had an ambush. Bhimsi was made a prisoner, hurried away to
the can p, and his liberty made dependent on the surrender of Pudmini.
Badul was but a strippling of twelve but the Rajput expects wonders
from this early age. He escaped though wounded, and a dialogue ensues between
him and his uncle's wife, who desires him to relate how her lord conducted him.</p>
<pb n="54" />
<p>13
మాశ్వాసము.
సీ॥ ప్రక్కనఁగల భిల్ల
పతులతో సంతత సంగ్రామముల నెట్లో
నెట్లో జరుపుకొనుచు
నుర్విని నజయసిం హుండు కొన్నేండ్లేలి యొకలగంబుండి మొక్కనాయ
తనయులఁ గని "భిల్ల • జనపతి మూంజుని వలని భయము నాకుఁ దొలఁగయ్యె;
నిద్రలో నతఁడె కన్పించు; నాచింతచే సగమైతి; వలసిన సైన్యముఁ గొని
గీ వాని బరిమార్చి నాభీతిఁ బాఱదోలుఁ డనినఁ 'బెండ్లీ పేరంటము లనక య్యా
కరుగుఁడన నెట్లు నోరాడే''ననికి వార లంతఁ; జెంత నాడెడు 'హమీ
మ॥ "ఒక యశ్వం బొక ఖడ్గ మొప్పఁజని నే నుద్దండత మూంజు మ
స్తకముక్ దెచ్చెద" నన్న "నీ పలుకు హ గబిచ్చె నోతు డ్రి! పో
నకుమం" చాడెడు పెద్దతండ్రిఁ గని "దేవా! మూంజు మ సంబుఁబూ
నికఁ దెత్తుంజుమి; లేనిచో నిటకు రానేరా"నటం చాడుచుక్.
కరుగులెంచి,
64
self before she joins him. The strippling replies "He was the reaper of the har-
On the
vest of battle; I followed his steps as the humble gleaner of his sword.
gory bed of honor he spread a carpet of the slain, a barbarous prince his pillow,
he laid him down and sleeps surrounded by the foe." Again she said "Tell me
Badul! how did my love behave!" "O mother! how further
"O mother! how further describe his deeds,
when he left no foe to dread or admire him." She smiled farewell to the boy and
adding "my lord will chide my delay," sprung into the flames.
"Annals of Mewar.
Mewar was now occupied by the garrisons of Delhi and Ajeysi had
besides, to contend with the mountain chiefs amongst whom Moonja Balaicha was
the most formidable, woh had on a recent occasion, invaded the Shero-Nalla and
personally encountered the Rana whom be wounded on the head with the lance.
The Rana's sons Sujansi and Ajimsi though forteen and fifteen, an age at which
a Rajput ought to indicate his future character, proved of little aid in the emergency.
Hamir was summoned and accepted the fued against Moonja, promising to return
successful or not at all. In a few days he was seen entering the pass of Kailwara
with Moonja's head at his saddle bow. Modestly placing the trophy at his uncle's
feet, he exclaimed "Recognize the head of your foe" Ajeysi kissed his beard and
observing that fate had stampt empire on his forehead, impressed it with a teeka
of blood from the head of Balaicha. This decided the fate of the sons of Ajeysi,
one of whom died at Kailwara and the other Sujansi was sent from the country.
He departed for the Dekhan, where his issue was destined to avenge some of the
wrongs the parent country had sustained and eventually overturned the monarchy
of Hindustan, for, Sujansi was the ancestor of Sivaji, the founder of the Satara
throne.
"Annals of Mewar."</p>
<pb n="55" />
<p>14
ప్ర
పసింహ చ క్ర.
గీ అందఱును జూడ నొకఖడ్గ మశ్వముఁగొని గాలికన్న హమీరు శ్రీ
జన దినములు వారములు మాసములు గడచె;నతఁడుచను పేరికిని
సీసీ॥
ఘ్రముగఁబోయె
జ్ఞప్తి యం దెలేష
కొన్నాళ్ల కవ్వలఁ గొండలోయను గద వంటి యాయుధమును బట్టి యొక్క
యాశ్వికుం డరు దేర శ్రీ నజయసింహుఁడు వాని కొలువువారును జూడ్కి గొలిపి; రు
నాహవిరుఁడు బల్లె + మవనిపై నిడి తండ్రి శ్రీపాదముల నమస్కృతి యొనర్చి
*
'గుఱుతింపు నీమూంజు శిరమన్న' జేఁడు పుత్రకుని ముద్దాడి యెత్తుకొని సింహ
గీ! పీఠమెక్కించి తిలకంబు పెట్టి రాజు సలిపి నిజపుత్రయుగము దేశమును వీడి
యరుగుమనిపం పెఁ; నంతఁ గా లాంబు వాహ భూరి గంభీర రుతిని హమీర విభుఁడు,
సీ "తఱుచుగా వేఁటల కరుదెంచునని సాద్రి సీమాటవుల నేను జేరియుంటిఁ ;
బందిఁ దఱుముకొంచుఁ బరివారములు లేక మూంజుఁడొక్కఁడె వనంబునఁ గనఁబడే
నడిగె "నీ వెవ్వఁడ" ! వని నన్ను; "నీవెన్వఁ"డని యంటి; "మూంజుఁడ" • న నెడు వంశ
దల నాదు ఖడ్గధా ! రల నూడి యిలరాలెఁ; గుంతంబుకొనఁ దలఁ గ్రుచ్చి యెత్త
గీ॥ శీఘ్రముగ నీపదంబులు చేరవచ్చి నాఁడ నన నెరపుడు సంతసము నొంది;
రిట్టు లఱువదియును నాలుగేండ్ల దాఁకఁబాలన మొనర్చె నతఁడు మేవాడ సీను,
చ అతని కుమారుఁడుక్, మనుమఁ డౌ లఘుఁ, డవ్వల రాజు లౌచు శా
శ్వత బహుళాభివృద్ధి కొన సౌగఁగ నేలిరి దేశముక్; లఘు
`క్షీతిపతి 'జావురా' ఖనుల సీసము వెండియుఁ దా
దామ్రమాది ధా
తుతతులు శ్రవ్వఁజేసి తటితో ధనరాసులఁ జేర్చె మెండుగ.
మ॥ జనకుం డాడిన యొక్క మాటకయి తత్సామ్రాజ్యము దాని ప
జ్ఞను లావణ్య నిధానమై వెలయు హంసాదేవిని వీడి త
మ్ముని రారాజు నొనర్చి భీష్ముచరిత మ్మున్ దాఁ బ్రదర్శించేఁ జం
డనృపుం డీలఘురాజు పుత్రుఁడు ప్రచండ ప్రాభవోద్దండుఁడు.
క॥ ముకుళుఁడు లఘురాజు కుమారకుఁ; డాతని వెన్క నేలె రాజ్యము; తత్పు
త్రకుఁడగు విదళీత రిపుహ కుంభుఁ కుంభనరపతి శ్రేష్ఠుండు.
68
4
70
7,0
Discussing with Chonda his (Laghu's) warlike pilgrimage to Gya, from
which he might not return, he sounded him by asking what estates should be
settled on Mokal. "The throne of Chittor" was the honest reply; and to set
suspicion at rest, he desired that the ceremony of installation, should be performed
previous to Lakha's departure, Chonda was the first to pay homage and swear</p>
<pb n="56" />
<p>ప్రథమాశ్వా నమః.
మ జనముల్ మెచ్చఁగ నేఁబదేండ్లుగను రాజ్యంబేలె; మేవాడ్
త్రిని నయ్యెన్బది నాల్గు కోటలను ద్వాత్రింశ నృహా సంఖ్య
తనిచే నిర్మిత మయ్యె; నన్నిఁటఁ గడు దాగ్యంబు వైశాల్యముః'
గొని యవ్వీరవతంసు పేర నిలుచుకొ గుంభలిమియర్ వుము..
సీ। మాళవపతి మహ । మ్మద్ ఖల్జి వారి తరంగముల్ వలెఁ జతు కున ---
గొలువ ఘూర్జరరాజుఁ
రాజుఁ గూడి దండెత్తిరా నొకలక్ష యుత్తకుగా కింద
పదునాల్గు వేలు కా 4 ల్బలముతో నరుదెంచి యెదిరించి వారి జయించి మార్చి
ధరణీశుఁ దనరథ స్తంభంబునకుఁ గట్టుకొనుచుఁ జిత్తూర్పుకం
07కు: 2
the
మ॥ తన సంపూర్ణ జయంబుఁ దెల్పఁగ జయస్తంభంబులర్ భక్తి
పును సూచింపఁగఁ గోవెలల్ నిలిపి నా బూశృంగ శృంగాటకం
ణ
: 1
గీ॥ కాపుగా సైన్యముల నిచ్చి కాన్క లిచ్చి తగిన గౌరవ మిచ్చి స్వాతంత్ర్యం వచ్చి
యెడఁదఁ గరుణకుఁ జోటిచ్చి విడిచి పుచ్చెం గుంభరాణా సమారు
obedience and fidelity to his future sovereign reserving as the recompense of his
renunciation, the first place in the councils and stipulating that in all prants to the
vassals of the crown, his symbal (the lance) should be superadded to the autoureph
of the prince. In all grants the lance of Saloombra still preceeds the monogram
of the Rana.
"Annals ci Me.war"
The only thing in India to compare with this is the Kutub Minar at Delhi,
but though much higher, it is of a very inferior charactor. This column is one
hundred and twenty two feet in height, the breadth of each face at the base is
thirty five feet and at the summit, immediately under the cupola, seventeen feat
and a balf. It stands on an ample terrace, forty two feet square. It has rine
distinct stories, with openings at every face of each storey... ... ... While the Sun
continues to warm the earth so long may the fame of Khoombo endure. Sven
years had elapsed beyond fifteen hundred when Rana Khoombo placed this ringlet
on the forehead of chittor. Sparkling like the rays of the rising San is the torun,
What does it resemble
rising like the bridegroom of the land....
which makes chittor look down.on Meru with derision. Again what does Chuttergot
resemble from whose summit the fountains are overflowing; the circular diadem
on whose crest is beauteous to the eye; abounding in temples to the Almighty
planted with odoriferous trees to which myriads of bees resort and where soft
zephyrs love to play. This impregnable fortress was formed by Maha Indra's
"Anna's of Rajasthan."
own hands.
.....</p>
<pb n="57" />
<p>2
1 6
ప్రతా
సింహ చరిత్ర.
·
బున; వ్యాఖ్యాన మొకండు వ్రాసి యనయం బుక్ గీత గోవిందము
జను లాబాలము నేర్వఁజేసెఁ గవితా సందైక సుధాతయై.
ఢీ కలము చేఁ గృత్తిచే రెండు గతులఁ గీర్తికాంతఁ గొలిచిన మేటి భూకాంతు లందు
నింత దొడ్డవాఁ డున్న వాఁ + డే యటంచు జోణిజనులెన్న మనియె నా కుంభవృః
సీ। సాధ్వి మీరాబాయిసౌజన్యధన్య కుంభవసుంధరాధీశు పట్టమహిషి;
జగజేక పావిత్ర్య సంపద కీలేమ పర్యాయపదము; గోపాలకృష్ణు
నడుగుఁలు తలఁచి భ క్త్యావేశమునఁ బొంగి యమృతగీతములు పెక్కాలపించెఁ;
దన్మాధురికి సొక్కి తలలూచి యాతల్లి స్మరియింపనట్టి య న్నరులు లేరు;
గీః ద్వారకాపురి మొదలుగా వారణాసి వఱకు దేవాలయముల గోపాలదేవుఁ
గూర్చి కీర్తించి యాయమ్మ కూరుచున్న చోటులను నేటికిని గూడఁ జూపుచ్చు
మ చరితార్థుండగు కులభు పౌత్రుఁ డవల సంగ్రామసింహుండు భూ
వరుఁడయ్యెక్; రణమన్నఁ బండుగువలె భావించు శౌర్యాఢ్యుఁడీ
పురుష శ్రేష్ఠుని కాలకం దరిచయం బుల్ వచ్చె జాక్సారిటీస్
సరసక్ వెల్గెడు క్రూర ముష్కర తురు ష్కస్థాన మందుండియున్.
శా॥ చెంగిస్ ఖాను కుమార్తె సంతతి జనిం చెక్ ముందు టైమూకు; స
ర్వాంగీణ స్ఫుటశక్తితో సమరఖండాధీశుఁడై, దానఁ దృ
ప్తింగాంచంగనుబోక భారతమహా దేశంబునుక్ గెల్చె; స
మ!
•
త్సంగుం డీతని రాజ్య మింతని వచిం • చక్జాల రెవ్వారులు.
శాః శా "సైమూన్లేము" ప్రపౌత్రుపౌత్రుఁ డతిశిష్టస్తుత్య సౌజన్య లీ
లామందారము ద్వాదశాబ్దముల కా లంబందె "బేబక్" నృపుం
డై మోగల్తి నేలఁబూని రిపుగో త్రాధీశుల దాఁకి యు
ద్దామపౌఢివి వారిఁ బోఁదజేమి సం స్థాపించెంఁ దద్రాజ్యముక్.
BJ "జాక్సారిటీసు శ్రే ష్ఠతమంబె కాని జాహ్నవియొ! లోకైక పూజ్యతకు రావు!
టర్కీ ప్రశ స్తమం + డల మౌను గాని యార్యావర్త మమృత రసాత్మకంబు!
సమరఖుడ మతియో 4 గ్యమ కాని ఢిల్లీ పురము స్వర్గమునకు స్వర్గమకు తావు
తురకలు స్వజనులౌ ।దురు కాని భారతప్రజలు లోకోత్తర ప్రాభవాంకం!
గీ!1 లింటనుండిన విశ్రాంతి యెసఁగుఁ గాని రామమాంధాత తేలిన భూమి గెలువ
.
ఘనతరైశ్వర్యములు గల్గి • గణన గల్గు" ననుచు బేబరు దండెత్తి యరుగుదెంచె.
♦</p>
<pb n="58" />
<p>E
9
i
Cel
థ మా శ్వాస ము..
శా॥ ఆకాలమ్మున ఢిల్లి పట్టణనృపుం డౌ యిబ్రహీంలోడి తా
నాకర్ణించుచు వీనిరాక దశ
లసికినుల్ మ్మోస్థలం
బాకంపింపఁగఁ జేరవచ్చి యని సే యజ్ జొచ్చె; బేబక్ర్ విభుం
డాకాలాంతకునట్లు శాత్రవులఁ జెండాడె మహోదగ్రుఁడై.
మ గడియల్ మూఁడగు నంతలో రణము తగ్గ సాగె; నా యిబ్రహీు
పడియెజ్; సేనలు భిన్న భాండగతుల బ్రాపించె; బేబర్ మహీం
ద్రుఁడు ఢిల్లీపురి నాక్రమించుకొనె; హిందూదేశ సర్వస్వ మ
ప్పుడు దాసోహమటంచుఁ దత్పదయుగంబు గొల్బె నిర్వీర్యమై.
మ॥ అరుల్ గెల్చుచు సార్వభౌముఁడయి రాజ్యంబేలి సంగ్రామభూ
వరు సంగ్రామతలంబున గెలిచి మేవార్దేశము జెందఁగా
నురు మ తద్విపరాజ వీర్యులగు నా యోధుల్ తనుక్ గొల్వఁగా
నరిగె బేబరు; సూర్యవంశమణి యుద్ధాయత్తుఁడయ్యెక్ వడిగా.
సీ॥ డోంగరీశుఁడు బలోత్తుంగుం డుదయసింగు, రత్న సింహుఁడు సలుం బ్రా విభుండు
రణమల్లనృపుడు మా ! ర్వారు నాయకమాళి, మేత్రావిభుఁడగు . క్షేత్రసింగు
ఝాలానృపాలుఁ డు । జ్జయసింగు సో నెగుఱ్ఱమహీంద్రుఁడైన యా రామదాసుఁ
డల పమరుండు గోకులదాసు చంద్రభానుండు మాణిక్యచంద్రుఁడు. శిలాదుఁ
గీII డును హుసే నిబ్రహీంషాహి+తనయుఁ డొకఁడు స్వామి సంగ్రామసింహు వెంబడినిబోరి
"చచ్చుటో గెల్చుటో వేఱు జాడ లేదటంచు సేనలతో వచ్చి రవి యొనర్ప 83
సీ॥ రెండువాహినులు కా ర్తిక శుద్ధ పంచమి నాబయానాప్రాంత . మందుఁ గలిసె;
రాజపుత్రులు మృగ + రాజులట్టులు దాఁక యవనసేనలు వెన్క
`బేబ రాగ్నేయాస్త్ర వితతిఁ బ్రయోగించె; హైందవాశ్విక కోటి
బులులమాడ్కిని రాజ పుత్రవీరులు ముందు దూఁకి డీల్పఱచిరి
గీ! తనబలముఁ దూఁచుఁ; గెలుపుకై కనులు వాచు; నా పతతి నేచు; దిగ్గన నట్టె లేచు;
విసివి తలరాచుఁ; జేతులు వెలికిఁ జాఁచు; నకట! బేబ రెవ్వఁడు గాచు ననుచుఁ జూచు!
గీ॥ స్వామి పదసీమఁ దెగి నిజ ప్రాణమైన ధారపోయు పవిత్ర హైందవులయందు
౪
నకటకట! శిలాముఁడు గాక యన్నము దిను నాతఁడెవఁడు స్వామిద్రోహ మాచరించు!
గీ॥ కడపటి దినంబు నిరు మొనల్ గలిసి నపుడు బలముతో శిలాదుండు జే బరును గలిసె;
'సని తుము'లమయ్యెఁ; బెక్టు గా రియములు తగిలి యవల సంగ్రాముఁ డరెగె;పై నృములు విఱిగె.
♦
కరుగఁజొచ్చె;
యడ్డె దాని ;
తురక దండు;
17
1
80
8:
82</p>
<pb n="59" />
<p>18
b
ణా ప్ర తాపసింహ చరిత్ర.
మః కడుఁదీక్లుంపుఁ బిరంగి గుండొకఁడు మో కాలర్ బ్రవేశించె; మం
డెడు నుగ్రంపుఁ దుపాకి సోఁకి కను లూ టిక్ జెందె; నెమ్మేనిపైఁ
।
బొడమే గాయము లెన; దిట్లు రుధిరమ్ముక్ జిమ్మి పుష్పించి యుం
డెడు బుధూక మహీజము దెగడె ణీనేత సంగ్రాముఁడు.
మః చనఁ జిత్తూరికి గెల్పు లేకయని బుస్సాప్రాంత మందుండే; న
ప్పెనుగాయంబులఁజేసి శక్తిచెడి నిర్వీర్యంబునై దేహ మ
జననాథేశ్వరుఁ డొక్కవత్సరమున
నుఁతఁడైన కైవడిఁ బ్రజల్
స్వర్గస్థుఁడ య్యెక్ విక
దైన్యంబున
క॥ అరిరాజాంతకుఁడై బేబరు సంగర జయము నొంది
శ్వరులకును రాజరాజయి పరిపాలింపందొడంగె
గ్రK¢X.
భారత ధరణీ
వసుధా తలముక్.
చ॥ ఒక సమయంబునందు హుమ । మూనును వ్యాధియు సోఁకి యంతకం
తకుఁ జెలరేగె; బేబరును "నల్గొని నాసుతుఁ గా
'నల్గొని నాసుతుఁ గావు దేవ" యం
చకుటిలబుద్ధి వేఁడుకొనె; నట్టులె వ్యాధియు వాని సోఁకి పు
త్రకుఁడును వ్యాధిఁబాసె; నొక రాతిరి ప్రాణము వాసె బేబకుక్.
క॥ ఘనశౌర్యుఁడు సంగ్రాముని వెనుక నతని సుతులు రత్న విక్రమసింహుల్
మనుజేంద్రులై మహీతలమును బరిపాలించి రధిక మోదముతోడ .
S
§ On the 16th March the attack commenced by a furious onset on
centre and right wing of the Tartars and for several hours the conflict Wi
tremendous. Devotion was never more manifest on the side of the Rajpu
attested by the long list of noble names amongst the slain as well as the bulleti
of their foe, whose artillery made dreadful havoc in the close ranks of the Rajp
cavalry, which could not force the entrenchments, nor reach the infantry whic
defended them. While the battle was still doubtful, the Tuar traitor, who led th
van went over to Baber and Sanga was obliged to retreat from the field which i
the onset promised a glorious victory; himself severely wounded and the choice
of his chieftains slain. Sanga Rana was of the middle stature but of great muscula
strength. He was celebrated for energetic enterprise, of which his capture d
Muzaffar, King of Malwa, in bis own capital is a celebrated instance; and hi
succesful storm of the almost impregnable Rinthum-bhor, though ably defende
by the imperial general Ali, gained him great renown. Had he been succeded b
a prince of his foresight and judgment, Baber's descendants might not hav
maintained the sovereignty of India. A cenotaph long marked the spot where th
fire consumed the remains of this celebrated prince.
"Annals of Mewar.</p>
<pb n="60" />
<p>ప్రథమాశ్వాసము.
మ॥ అనలాస్త్రంబులు వాడినక్ జయము తథ్యంబంచు నావికముం
డును గొన్నింటిని దెచ్చె; వీరభటులెంతో మూర్ఖులై "వీనిఁ జే
కొన మశ్వంబుల నుండియు దిగము నీ కుక్ గూర్చు నెవ్వారినై
న నియోగింపుము వీనిఁబూన్ప" నని మందపజ్ఞులై యాడుచుకో,
చ॥ పెడమొగమైన నన్యులను విక్రముఁడుకో నియమించె; సేనలుక్
జెడె నిరుపాయలై యొకరి నిక్ మఱియొక్కరు మెచ్చకుండ; నీ
దుడుకుఁదనం బెఱింగి 'బహదూర'ను ఘూర్జర దేశ భర్తయు
వెడలె మహాచమూతతులు + వెంటఁ జనంగను జిత్తురి౯ గొనక్.
మ॥ తమ శత్రుండొకఁ డిఫ్టు చిత్తురిపయిక్ దండెత్తున మాట శ్రో
త్రముల సోఁకిన రాజపుత్రనృపులు చౌదవ్వు లందుండి సై
న్యముల దోడ్కొని వచ్చి రొండొరువు లంతర్భేదముల్ లేక; డె
దముల జిత్తు రనంగ నెంత యభిమానం బున్నదో వారికి౯!
19
1
92
93
94
సీ॥ రౌద్రకేసరి కేసరముల నుయ్యెలలూఁగు నతిబలాఢ్యులు దేవ రాధిపతులు
కులపర్వతముల డీ 4 కొని పిండిగాఁజేసి యంబుధిఁ గలుపు ఝూ లావనీంద్రు
లుంకించి తాఁకిన సుర్వీతలంబు పై కెగిరించు సోనెగుజ్జేశ్వరులును
ఫాలాక్షుతో మెడ ౪ పట్టులు పట్టి గెల్వంగఁ జాలిన హర వంశ్యమణులు
గీ జగము సర్వసంహారము శ్రీ సలుపఁ గలుగు నసమ శౌర్యులు చోండావ ధన్వయులును
నడచు సంద్రంబు లనఁగ సైన్యములఁ గొనుచు వచ్చి చేరిరి చిత్తూరు పట్టణమ్ము.
గీ॥ పదము వెన్క మఱల్పని పటు పరాక్ర మైకధన్యులు గొలువ సు కేశమల్లు
సుతుఁడు ఛార్జీ తరలివచ్చె; నితఁడు బాడ బానలముఁ బాఱమ్రింగు మహాభుజుండు.
గీ॥ అఖిల జగములలోని శౌర్యంబు ముద్ద చేసి దుర్గంబునిండ నుం చినను గాని
క్రూరులగు పరంగుల పిరంగులకు ముందుఁ దూఁచుకొన రాయి నిలుచుట దుర్ల భంబు.
లాబ్రిఖాక్ బిరుద మ లంకరించెడు ప్రోడ గోతులు తవ్వించి కూరి మందు
వహ్ని రవుల్ కొల్పి పగిలించె; నీతుడు బహదూరు శాహి సేవలను దనుపు
-పోర్చుగీసు పరంగి; మునుపు వాస్కోడిగామా మెట నరుదెంచె; మును గుడు
(
పరగించి యగ్నిపర్వతము పొంగినయట్లు పొంగించి బహునుర్ర ములను గూల్చె;
•
సీ॥</p>
<pb n="61" />
<p>1
రాణా ప్రతాపసింహచరి
గీః వైరిదుర్భేదమైన చిత్తూరుకోట దక్షిణపు గోడ పగిలి రంధ్రంబు పడియె;
§ నూర్జిత జగన్నుత పరాక్రమార్జునుం డరాతులను దాఁకి యర్జున రావు మడిస్తే,
గీ॥ ఐదు వందలు హరమశ్యు లతని తోడఁ బడిరి; మధ్యాహ్న మార్తాండు
యరులఁ దాఁకి దుగ్గారాయఁ + డ స్తమించె సఖిల చోండావదశ్వయు
గీ అవల దేవరభటులు ఝాలాన్వయులును జీవము లొసంగి; రంత భాగ్జీయు వచ్చి
ప్రళయకాలాంతకునిఁబోలు భటులఁ గూడి కదన మొనరించి పండె నా • గండిదుడ
సీ॥ తరువాత రాజమాతయు జవాహిరిభాయి రాఠోడుసుత తను త్రాణ ఖడ్గ
ములనూని యాస్థలం । బునఁ బోరి మడిస్తే; నవ్వెలఁది కీర్తిని జరి త్రల సువర్ణ
పరమాక్షరముల వా + సిరి పూజ్యు లాదినం; బంతలో దర్గ మా వంత యవల
విఱిగె; లోపలి వీర ) వరుల సంఖ్యయుఁ దగ్గ; నుదయాసింహకుమారుఁ డొకఁడు తప్ప
గీ!! రాజమశ మంతయు రణాగ్రమున మ; నతిని సురధాని రాయల కప్పగించి
•
အ
వెలికి దాటించి మిగిలిన వీరు లొక్క స్థలము చేరిరి కార్య నిశ్చయము కొఱకు,
సీ। గందపు మంచి చెక్కల నొక్క ప్రోవుగాఁ గూర్చి తైలము పోసి కుప్పలుగను
గర్పూరరజము పై ఁ గప్పి యగ్ని రగిల్చి వెలఁదులు పదమూఁడు . వేలమంది
జలకంబు లాడి దు శీ వ్వలువలు సొమ్ములు దాలిచి పూచిన తంగెడు లటు
వెడలి పెండ్లికిఁ బోవు విధమున గుంపులై చిఱునవ్వు మోముల • సిరుల నింప
గీ బంగరు సలాక లట్టు పావకునిఁ జొచ్చి; రీవెలఁదులఁ గర్ణావతీ దేవి నడిపె;
నామె యుదయసింహకుమారు . ననుఁగుఁ దల్లి కజ్జయార్జున రాయని
4 తోడఁబుట్టు,
20
మః తమ కాంతామణులెల్ల వహ్నిఁ బడి మ్రం దళ్ దేవరస్వామి దు
ర్గమునందుండిన యోధులఁ గొనుచు సూర్యద్వారము దీసి సిం
హముమాడ్కిక్ వెలిదూఁకి శాత్రవులు చీ కాకొంద వర్తించి సై
న్యములు దానును నిర్విశేషముగ నంతంబొందె నవ్వేళలో.
పగిది మండి
లను సరింపు
103
Rao Arjun was this prince, who was blown up at the Chitore boorj. The
Boondi bard makes a striking picture of this catastrophe in which the indomitable
courage of this prince is finely imagined "Seated on a fragment of the rock disparted
by the explosion of the mine, Arjun drew his sword and the world beheld hi
departure with amazement.
"Annals of Rajasthan"</p>
<pb n="62" />
<p>21
ప్ర థ మాశ్వాసము,
చ॥ దురము భయంకరంబగుచు దుగ్గము నిల్వదటంచుఁ దోచు ముం
దర, నవరత్న సంతతులు దాపిన తోరము, రాజ్ఞ, ఢిల్లి భూ
వరు కడ కంపెఁ; గష్టములు వచ్చిన యప్పుడు రాజపత్ను లీ
కరణి నొనర్చి సాయమును గాంచుట వాడుకయై తనర్చెడుకో.
శా॥ వీరుల్ ముప్పది రెండు వేలు సమరో ర్విక్ వ్రాలి ప్రాపించి ర
వ్వీరస్వర్గము; దుర్గము యవనభూభృన్మౌళియు జొచ్చి శౌ
ర్యారూఢి నివసించె; నంతటను "సైన్యంబు మఱల్పించి చి
త్తూరు వీడు" మటంచు వచ్చెను హుమా ! యూక్ పాదుషా యాజ్ఞ యుక్.
సీ1 పరిసరగ్రామ సంవాసినులగు వెలందులు వేయిమంది యా తోరము నొక
కనకప్పు బల్లెరంబున నుంచి పూవు లక్షతలుచు బెట్టి పూజల నొనర్చి
నడచుచు వెళ్లి యం దఱు ఢిల్లిఁ జేరిరి; హుమయూను వంగదేశమున నుండె;
నట కేగి దర్శించి; . రతఁడు హర్షించి హ స్తమున రక్షా బంధనము నొనర్చి
గీ॥ "సారస దళాములార! యీ తోర మంది నపుడె కర్ణావతీదేవి కన్న నైతి;
నామె నాచెల్లె; లుదయసింగల్లుఁ డయ్యె; వారి సేమమె నా సేమమై రహించు.106
గీ॥ భువన వంద్యుండు సంగారామ భూపమణికి ముందు మాతండ్రి కూర్చిన కుందు దీఱ
నతని దేవేరిని గుమారు నాదరించి నా మొగల్ వంశమును బావ । నం బొనరు. 107
...
104
105
The Rajpoot dame bestows with the Rakshi the title of adopted brother
and while its acceptance secures to her all the protection of a Cavaliar Servante,
scandal itself never suggests another tie to his devotion. He may hazard his life
in her cause, and yet never receive a smile in reward, for he cannot even see the
fair object, who, as brother of her adoption, has coustituted him her defender...
The acceptance of the pledge and its return is by the katchli or corset of
simple silk or satin or gold brocade and pearls. In shape or application there is
nothing similar in Europe and as defending the most delicate part of the structure
of the fair it is peculiarly appropriate as an emblem of devotion. A whole province
has often accompanied the katchli and the monarch of India was so pleased with
this courteous delivery in the customs of Rajasthan on receiving the bracelet of
Karnavati which invested him with the title of her brother and uncle and protector
to her infant Udai Singh, that he pledged himself to her service "even if the
demand were the castle of Rinthumbhor." Humayun proved himself a true knight
and even abandoned his conquests in Bengal.
'Annals of Mewar."</p>
<pb n="63" />
<p>22
రాణా
ప్రతాప సింహచరిత్ర.
గీ అభిల నృపులకుఁ బాదుషా
•
యనుటకన్న రాజపుత్ర మహాదేశ రాజమ
కన్న యనుటయెకడు గౌర వాస్పదంబు; పయనమై వత్తు; బహదూరు
మః స్ఫురదిందీవర నేత్రలార! యిఁక నా పుణ్యంబు వర్ణింపఁగాఁ
దరమే! నేఁటి విపత్తు దీర్చుటకు నింద్రప్రస్థమేయైన భా
గ్య రమాక్రాంతము నాదు రాజ్యమయిన
ప్పరమోత్కృష్టగుణాఢ్య పాదముకడ
మః అని శీఘ్రముగ వచ్చి చూచి "యిటఁ గా ర్యం బంతయు మించిపో
యెను; దుర్గం బరిచేతఁ జిక్కెను; బలం బెల్ల నశించె; గృపా
ఖని నన్గోరిన దొడ్డతల్లియగు నా కర్ణావతీదేవి యే
మని చింతించెనొ; మందభాగ్యునకునేలా దక్కుఁ దత్సేననల్,
గాదేని నా ప్రాణ మ
భక్తి సగుర్పించేదూ."
మః అకటా! సూర్యుఁడు వంశకర్తయఁట; క్షీరాబ్ధిక్ వలె బూజ్యమై
యకలంకంబగు గొప్పవంశమట; ధన్యాత్ముడు సంగ్రామసిం
హు కుటుంబంబఁట; సుంత సాయపడఁగా నొక్కింత తావున్నఁ బా
యక మత్కీర్తి వెలింగియుండుఁగద బ్రహ్మాండైక సుస్థాయిగ
సీ॥ "ఆతల్లిమాఱు త దాత్మజుఁ గొలిచి దేహము ధన్య మొనరింతు" నని త
'చిత్తూరుపురి విసర్జించి ఘూర్జర మేగు' మని బహదూరుపా కాన తిచె
సొమూర్ఖుఁడు తదాజ్ఞ , నౌదలఁదాల్పక సమర సన్నాహముల్ జరుపఁ &
బాదుషా తుది లేని బలములతో దుర్గమును నాల్గు వైపుల • ముట్టడించె;
•
గీ నామహా సేనఁ జూచి భయంబు లేచి నీరు సోఁకు నుప్పటులఁ గన్పింప
బలముతో బహదూరు; మాళ్వమును ఘూర్జరము హుమాయూక్ జయిం
[మ
1
గీ॥ వెదకి విక్రమసింహుని విభుని జేసి యాహుమాయూను ఢిల్లీకి నరిగె; విశ్రా
మావనీశుని పిదపఁ బ్ర 1 జళు లెల్లఁ బృథ్వి విభుని జేసిరి వన వీరసింహు
సీ జననంబు క్రూర ముష్కర తురుష్క కులంబు! భావమో రాజ్య సం • పా
ప్రాయమో సకలప.. పంచంబు తనదని పోరాడ వలసిన పూర్ణ వయస
నరిది రాజాస్థాన మాకర్షకము! కాని రాణి
కము! కాని రాణి యర్థింప సౌభ్రాత్ర మూ
వంగభూమిని దన శీ పనిమాని యొక వేయి మైళ్లేగుదెంచి ధ + ర్మము వరించి
♦</p>
<pb n="64" />
<p>;
Cel
ధ మాశ్వాసము,
...
23
గీ॥ స్వకులు బహదూరు శిక్షించి పంచి దేశమందు భయమును డించి సౌ ।
♦
నించి
ఖ్యంబు
వట్టిచేతుల వెనుకకు వచ్చె! నెట్టి సరళ హృదయుండో! హుమయూను చక్రవర్తి!
సీ॥ వనవీరనృపుఁడు పా లన మశాత్రవముసేయ నుదయసింహుఁ గూల్పను దలంచెఁ;
బున్నా యనెడి దాది ముందెట్లొ సడిపట్టి యొక పూలబుట్టలో నుదయసింహు
నుంచి భటుల చేత . నూరీవెల్పల కంపెఁ; దనపుత్రు నుంచెఁ ద జ్ఞానమును;
వనవీరుఁ "డుదయసింహుని జూపు"మని వచ్చె; సతి నిజాత్మజుఁ జూపె; నతఁడు పొడి చెఁ;
గీ॥ బుత్రశోకము దిగమ్రింగి పున్న వెడలి స్వామి నొకినుంచి దేశదే శములు తిరిగి
వర్తకుం 'డసాసా' కడ. వానిఁ జేర్చి సకలలోకైక విఖ్యాతి సంతరించె.
క॥ తను నెంత కాచి కుడిపినఁ దనసుతుఁ బరుసుతుని కొఱకుదారుణ ఖడ్గం
బునఁ జీల్పఁ గనిన వెలఁదులఁ వినియుంటిమె! పున్నఁ దప్ప
మ వసవీరుండు ప్రజావిరుద్ధముగ భూ భాగంబుఁ బాలింపఁ దీ
రని కష్టాంబుధిలో మునుఁగుచు జన
హునిపుత్రుం డతిదూరగుం డుదయసిం
బున రాణా నొనరించెఁ బూర్వవిభనం
§ మ సమరోత్సాహము లేదు; విక్రమకళా
115
వేఱకదానికి
వ్రాతంబు సంగ్రామసిం
హుక్ దెచ్చి చిత్తూర్పురం
బుక్ నిల్పఁ గాంక్షించుచుక్.
సంపత్తియు లేదు; దు
ర్దమధైర్యోన్నతి లేదు; చిత్తురుమహా రాజ్యంబుఁ బాలింపఁ బూ
§ Rana Udai Singh ascended the throne in A. D. 1541-1542.
116
117
"Woe to the land where a minor rules or a woman bears sway" explains the last
of the great bards of Rajasthan; but where both were united as in Mewar, the
measure of her griefs was full. Udai Singh had not one quality of a sovereign;
and wanting martial virtue, he was destitute of all. Yet he might have slumbered
life away in inglorious repose during the reign of Humayun or the contentions of
the Pathan usurpation; but unhappily for Rajathan, a prince was then rearing.
who forged fetters for the Hindu race, which enthralled them for ages; and though
the corroding hand of time left but their fragments, yet even now though emanci-
pated, they bear the indelible marks of the manacle; not like the galley slaves,
physical and exterior; but deep mental scars, never to be effaced. Can a nation
which has run ite long career of glory be regenerated? Can the soul of the Greek
or the Rajpoot be reanimated with the spark divine, which defended the Kangras
of Chitore or the pass of Thermopylae? Let history answer the question.
"Annals of Mewar"</p>
<pb n="65" />
<p>11
రాణా ప్రతాపసింహ చరిత్ర.
జ్యమయా సద్గుణ మొక్కఁడేనియు రహీం, చక్బోదు; వైయాఘ్రగ
ర్భమున విధంబున బొడమె సంగ్రామేంద్రు గర్భమ్మున.
ఆ మ ఉదయాస్తాచల మధ్య గంబగు జగం బుట్టూఁతలూఁగించె బె
ట్టిదుఁడౌ పుత్రుఁడు; ఘోర సంగర కిరీటిప్రాయుఁడై కీర్త సం
పద నార్జించెను దండ్రి; యెట్లితఁడు మేవాడ్రాజ్య మందారశా
pఁ దినంజొచ్చిన పుష్పియట్లు వొడమెక్ గీర్తిక్ గళంకించుచుకో.
చ వరుసగ ముప్పదేం డ్లితఁడు పాలనము బొనరించె; నందులో
నిరువదియైదు శాంతముగ నెట్టులో సాఁగె; ననంతరమ్మునక్
దరతరముల్ తపింపఁదగు దారుణ ఘోర విపత్తు దేశము
బొరిగొని గౌరవంబు నుడి పోవఁగఁజేసె నరుుతుదమ్మగ౯.
మ॥ అనఘుక్ విక్రమసింహు భూరమణుఁ జేయకాగల్లి ఢిల్లీపురం
బున కేగె౯ హుమయూను; వంగమున రాశి ణ్ముఖ్యుండు సామంతుఁడై
చను షేర్ఘాను స్వతంత్ర రాజ్యమును సం స్థాపింప యత్నించినాఁ
డను వార్తల్ విని పొదుషా వెడలె పై న్యాయత్తుఁడై వానిపై.
ఉ॥ అంతము లేని సైన్యముల నంబుధి చాడ్పున నిల్పియున్న సా
మంతుని దాఁకి పోరుట ప్రమాదకరంబని సంధి గోరి వృ
24
118
:
119
120
121
But the magnitude of the peril confirmed the fortitude of Pratap, who
vowed in the words of the bard to make his mother's milk resplendent: and he
amply redeemed bis pledge. Single handed, for a quarter of a century did he
withstand the combined efforts of the empire; at one time carrying destruction
into the plains, at another flying from rock to rock feeding his family from the fruits
of his native hills, and rearing the nursling hero Umra amidst savage beasts and
scarcely less savage men, a fit heir to the prowess and revenge. The bare idea
that the son of Bappa Rawal should bow the head to the mortal man was insu-
pportable; and he spurned every overt re; which had submission for its basis or
the degradation of uniting his family by marriage with the Tartar, though lord of
countless multitudes...The brilliant acts be achieved during that period live in every
valley, they are enshrined in the heart of every true Rajput, and many are recor.
ded in the annals of the conquerors. To recount them all, or relate: tbe hardships
be sustained, would be to pen what they would pronounce a romance, who had
not traversed the country where tradition is yet eloquent with his exploits, or
conversed with the descendents of his chiefs who cherish a recollection of the deeds
of their forefathers and melt as they recite them, into many tears.
"Annais of Mewar".</p>
<pb n="66" />
<p>ప్ర థ మాశ్వాసము.
త్తాంతము నంపె; "షేర్కులుఁడు . తానును సమ్మతి చూపెఁ; గ్రుంకెఁ బ్రొ
దంతట; రెండుసైన్యములు నచ్చట నిల్చెను నిద్ర నొందఁగళ్
చ॥ కొసరి కసాయి మేకలను గొంతులు గోయు విధాన, మారియుక్
నాలుక సాంచిన భంగి, ఢిల్లీపై
మాడఁగఁ జొచ్చిరి నిద్రవోవుచుఁ
టుల్ తమనాథుని యాజ్ఞ పెంపునక్.
మసఁగిన యట్లు, మృత్యువది
న్యసమితిపైన వ్రాలి తును
డు సమయమందె వంగసుభ
25
122
123
మ॥ హుమయూ నంతటఁ బాతె ఢిల్లీ దెస; కత్యుగ్రుండు షెర్టాక్ ససై
న్యముగా వెంటను దాఁకె; నేమియును జేయ లేక యందంను మా
గ్గమునక్ జిక్కిన వారిఁ జేర్చుకొని పా ఆక్ జొచ్చెఁ; బాంచాలదే
శము డాయంగనె రెండు సైన్యములకు సంగ్రామ మయ్యెక్ వడిక్.
సీ॥ రణమంచు వినిన మ శ్రీరణమంచు బెదరి దిఙ్మార్గంబులకుఁ గొంత మంది నడువ!
సమద శాత్రవ పరా + గము దృష్టిగతమైన మది కలంగియుఁ గొంత మంది పాఱ!
విమతసైన్యము దర్శనము దండధరదర్శనంబని యడలి కొందఱు తొలంగ!
మొదటి పిరంగి చప్పుడయినంతనె గుండె లవిసి నీరయి కొందఱవలి కుఱుక!
గీ॥ నాహుమాయూను త్రోవలో నడ్డమైన జనులఁ జేరిచి చేసిన సైన్యమెల్లఁ
జేయి జారిన కడవయై ఛిన్నమయ్యె! పేరుఖాక్ ఢిల్లీఁ బట్టాభిషిక్తుడయ్యె! 125
మః చమువుల్ లేక మహామహీవలయ రాజ్యం బూడిపోవంగ నా
హుమయూనుక్ వెను వెంటనే తగిలి లా హోర్ దాకఁ బోనీక సై
న్యముల జేకొని, పేరుఖాను తఱిమె; వాడంతట దేశదే
శముల గ్రుమ్మరె నెచ్చెలేనిఁ దలదా . చకోవచ్చు నంచాసతో.
మ॥ స్తిమితత్వంబు వహింపకేగి యొకచో , 'షేకల్లి 'య బారసీ
క మహాయోగిని గాంచి యాతఁ డడుగం గాఁ దెల్పె నాత్మీయవృ
త్తముఁ; దత్సన్ని ధినున్న వానిసుత "యుద్వాహమ్ము గావించుకొం
దు మహాభాగుని వీని నేనన, నతండు వాని కిచెన్ సుత.
సీ॥ ఏలుటకు మహామహీతలంబది లేదు! కొలువు సేయఁగ భట కోటి లేదు!
కాంచనాదిక ధన . గ్రామంబులును లేవు! సముదార దివ్య భోగములు లేవు!
వసియింపఁగా మేటి శ్రీ భవనంబులును లేవు! తాల్ప ననర్హవస్త్రములు లేవు!
వాహ్యాళి యొనరింప + వాహనంబులు లేవు! శ్రమదీఱ గంట విశ్రాంతి లేదు!
124
128
127
;</p>
<pb n="67" />
<p>26
పసింహ చరిత్ర.
గీ॥ కేవలము హుమాయూన్ పడు క్లేశమెంచి మనసు గరగించు సౌజన్య మహిమఁ గాంచి
కోరి యర్ధాంగమును బంచు కొనియె! నెట్టి పావనాత్మిక యో 'హమాడా' వధూటి.
మ॥ వనిత౯ యోధులఁ గొంచు యోధపుర భూపాలు సమీపింప, వ
ద్దనె నాతండు; జసల్ మియర్ ప్రభుఁడు పొమ్మంచాజె; మర్వాక
నృపుం
డును బంధింపఁగఁ జూచెఁ; గొన్ని నెలలిట్లుక్ జెల్ల రారాజు చే
రెను దూరమ్మున సింధు దేశపుటెడా రిక్షా దైవము దూఱుచుక్.
సీ
g
3
U
3)
వైశ్వానర జ్వల । జ్వాలా సమూహంబు చిమ్మి సూర్యుఁడు ప్రకాశించుచుండ!
నుర్వీతలం బెల్ల 4 నుట్టూఁతలూఁగ జృంభించి వాయువు పెల్లు వీచుచుండఁ!
4
సుడికట్టి మండుటి సుక లేచి మిన్నంది వ్రాలి పాంథుల ముంచి వైచుచుండఁ!
బెక్కు యోజనములు ♦ వెడలిన నాల్క;పై ఁ జేర్పఁ జుక్కయు నీరు చిక్కకుండ!
గీ॥ నరులు దఱుమంగ! ననుచరులంత మొంద! స్వర్ణ సౌధంబుల వసించి పరమ సుఖము
132
మీఱఁదగు నిండుచూలా లె డారి యందు నాహకడాలతాంగి యె ట్లరుగనేర్చె!
గీ॥ రాచఱికమది బరువయ్యె రాజమౌళి; కనుచరత్వంబు బరువయ్యె ననుచరులకు;
నున్న వారెల్ల బరువైరి యొటియలకు; నొక హమీడ మాత్రము చలింపకయె నిలిచె
మl॥ హుమయూ నెక్కిన యొటెయు మడిసేన అత్యుగ్రాతపవ్యాప్తి; గూ
రిమి భృత్యుండని యొంటె నిమ్మనుచు టా బేగు నర్థించె;
+ ల్డీ గూ
రమతి వాఁడు తిరస్కరించిచనె; నింద్రప్రస్థరాజ్యంబుఁ
ర్ణముగా నేలినమేటి నీరమున కన్న బల్బనయ్యెక్ గటా!
గీ॥ తురక జేనికిఁ గష్టముల్ పెఱిఁగెఁ గాని పెక్కు విశ్వయత్నములు సల్పినను గాని
కానరాదయ్యె వట్టివెక్కసము తక్క! నిండుదప్పి నార్చఁగ నొక్క నీటిచుక్క. 133
గీః చూలుపండిన యాహామీ । డాలతాంగిఁ జిచ్చుటెండ కెడారిలో co దెచ్చు టెల్లఁ
బూఁప్రపిందెల క్రొమ్మాని మొక్క నకట! తీవ్ర దాహగ్నిలో నీడ్చి తెచ్చుటయ్యె,
సీ। తడిలేక యెండి కొ ఱడు గట్టి నాల్క నాభినిఁ జేర దిగగుంజుకొనుచుఁబోవ!
నెంతేని జలియించి హృదయకోశంబట్టె కుత్తుక కెకతొట్టు కొనుచురాగః
మెదడు నీరసమయి: * ప్రీదిలి పైత్యోద్రేకమునను బ్రలాపసం ధిని వెలార్ప!
క్షితితలం చెల్ల మ్రింగినఁగాని తీరఁబో దనిపించు మరణవేదన కలుప!
*
గీ! నున్న కష్టంబు లట్టులే యుుడ యవనభటులు దాహంబునకు నీరు వడయ లేక
పిచ్చియె త్త్రియుఁ గేకలు వేసికొనుచుఁ బాటి రెల్లెడ నిసుకయేడారీ నడుము. 135
129
1</p>
<pb n="68" />
<p>ప్రథమాశ్వాసము.
ఆ చ॥ శనిరొక బావి వేఁకువనె కన్నుల పండువు గాఁగ; దాన మో
టనిడి జలంబు దోలేడు. నెడ వడి నెద్దులఁ దోలుకొంచుఁబో
డ
వునతని కొక్కచోఁ 'బయికి బొక్కెన వచ్చె'నటంచు మాటలు
వినఁబడఁబోమిఁ బెద్ద రణభేరిని గొట్టు టవశ్యమై తగి౯.
సీ॥ అతిదాహమున నోరు లడైతెఱచియున్న జనులు బొక్కెన నూయి
నిలువకమున్నె దా! నిపయిబడి జలంబుఁ ద్రావఁబోవఁగ దాని
బావిలో బొక్కెన * పడే; దానివెంటఁ గొందఱు నూతఁ బడిరి; కొందఱు మహోగ్ర
136
కొనను నిలిచి
త్రాడు తెగుచు
.
తాపమోర్వక సైక 4 తస్థలిఁబడి మ్రగ్గి; రిఁకఁగొంద తానూయి నెక్కి దూఁకి;
గీరంతఁ గొందఱు చేది తోయంబుఁద్రావి గుండె బరువెక్కి కూలిరి; కొంద టెల్లొ
'యమరకోట'కు నాఁటి సాయంతనంబు నడచి కల్గొని రచటి రాణాప్రహారు 187
న్మానించె సౌఖ్యంబెల
మ॥ మనుజాధీశుఁడు వారినందఱను స । నా
ర్పను; నైదు బదివందలు నలువ దా పై నిక రెండైన యే
డాభాను బీగఁబు' పు
దుర్వార తేజోనిధి౯.
టను నాకార్తిక జీవవారము 'హమీ
త్రుని నీళ్లడె నుదా తలక్షణయుతు
27.
శా॥ పెద్దల్ గోత్రజు లక్కుమారకునకు
బ్రీతిక్ "మహమ్మస్టైల
లుద్దీ నక్బరు" నామ ముంచిరి; హుమాయూన్ పాదుషా చూచి యా
· 138
1
On the fourth day of their retreat they fell in with another well, which
was so deep that the only. bucket, they, bad, took a great deal of time in being
wound up and therefore a drum was beat to give notice to the cassilas when the
bucket appeared that they might repair by turns to drink. The people were so
impatient for the water that as soon as the first bucket appeared, ten or twelve of
them threw themselves upon it before it quite reached the brim of the well by
which means the rope broke and the bucket was lost and several feel head long
after it. When this fatal accident happened the screams and lamentations of all
became loud and dreadful. Some lolling out their tongues rolled themselves in
agory on the hot sand while others precipitating into the well met with immediate
death.
'Annals of Mewar'..
J 07
On this Humayun ordered the musk bag to be brought and having broken
it on.a China plate he called bis nobles and divided it among them as the royal
present in honor of his son's birth. This event, adds Jowher, diffused its fragrance.
over the whole habitable world.
*Colonel G. B. Malleson C.' S. I.''</p>
<pb n="69" />
<p>ణాప్రతా
చరిత్ర.
ముద్దుంగుఱ్ఱని కీర్తివల్లి దెసల బుష్పింపఁ గాంక్షించుచు
ముద్దల్ ముద్దలు పంచె నాప్తులకు సమ్మోదమ్ముమైఁ గస్తురిక్.
చ॥ తనుఁ గడుఁ జేరఁదీసి తల దాఁచుకొన నెలవిచ్చి పేర్మి నె
క
క్కొనఁగ మెలంగు నయ్యమర కోటనృపాలునియొద్ద నాత్మమో
హనసతియా హమీడను నిజాత్మజు నక్బరు నుంచి వెంట న
య్యనుచరు లేగు దేరఁగఁ బ్రయాణ మొనర్చె నతండు వెండియుః
మః త్వరమై నాతఁడు పారసీకమును గాంధారంబు కాబూల్ వసు
ధరలఁ జేకొనెఁ గాని రాజ్యము స్థిరత్వం బూనకే సాఁగె; నీ
కరణి బాఁ బదునాలుగేడులు మహా కష్టంబుల బొంది వం
దురె; నీలోపలఁ గొన్ని మార్పు లచట దోతెంచె ఢిల్లీపురిక్షా.
మ॥
మ అల షేర్ఘాక్ బలశౌర్యశోభితుఁడు రాజ్యం బెల్లఁ గౌశల్యముల్
వెలయక్" బాలన చేసే; వానిపిదప బృథ్వీశ్వరుల్ చాలదు
ర్బలులు గ్రూరులు నౌట రాజ్యమది స్థైర్యంబూడెఁ; గొన్నేండ్ల
వ్వల రాజయ్యె 'సికంద'; రీతఁడు సురా పాసక్రియాలోలుఁడౌ.
మః స్థితి యిట్లుండు పెఱింగి దండుగొని డా । సెజ్ దా హుమాయూరు; శూ
రతముం డుగపరాక్రమక్రముఁడు బైరాంఖాను వచ్చెక్ జమూ
పతి; పండ్రెండవయేటనున్న సుతుఁడక్బర్గూడ నేతెంచె; ను
షా
ద్ధతిమై యుద్ధము సాఁగె ఢిల్లీని సికందరా చమూపాళితో. ,
మః కడు లేఁ బ్రాయపుఁ జిన్ని కుఁడగు నక్బర్ ముందు నిల్చుండి యె
క్కుడు శౌర్యం బుసికొల్పి పూన్న సుభటుల్ ఘోరంబుగాఁ దాడి ర
య్యెడ ఢిల్లీ పతి యోడి పాటె; విజయంబింపారఁ జట్టాభిషి
క్తుఁడునయ్యె హుమయూజ్ నిజాప్తులును సంతోషించి యుప్పొంగఁగ.
సీ! 'పేర్మండలం'బను + స్నిగ్ధసౌధంబున హుమయూను గూర్చుండి యొక్క నాఁడు
పొత్తముల్ చదువున 4 ప్పుడు ప్రార్థనముచేయు కాలంబుఁ డెలుపుచు గంట మ్రో
.
వడివడి దిగిరాఁగ దొడఁగె నాతఁడు; నునుపైయున్న మెట్లపై నడుగు జాజెఁ;
*
బైనుండి క్రిందికిఁ * బడుట గాజువిధానఁ దలయెల్ల వేయి ప్ర క్కలుగఁ బగి లె;
గీ॥ నవలఁ బంజాబునందున్న యక్బ రటకు వచ్చె; బదునై దువందలేఁబదియు నాఱ
నగు శరత్తున నతనిఁ గ + ల్యాణపురిని ఢిల్లి పతిఁజేసి రుద్యోగు లెల్లఁ గలిసి. 1
3
3
♦
1
●
28
Ya
các
క
2</p>
<pb n="70" />
<p>29
ప్రథమాశ్వాసము.
ప్రవిశేషోగ్ర సమగ్రవిక్రముఁడు "బైరాంఖాను" త్రైకధ
ర్మవిదుం! డాహుమయూనుకోడలు సలీమాదేవిఁ బెండ్లాడి బాం
ధవుఁడై యక్బరు బాల్యమూడి తరుణ త్వం బొందునందాఁక రా
జ్యవిధానంబును నిర్వహింపఁదొడఁగె సంరక్షకుండై తగ.
II కాశ్మీరమందు సి . కందరుశాహి సైన్యము ప్రోవుచేసిరణంబుఁ గోర,
న చటఁ గాబూలులో నక్బరు ప్రతినిధి తరుణంబు వీక్షించి తిరుగఁబడఁగ,
మాళ్వదేశాధీశ । మణి ఢిల్లీపై ఁబడు చెప్పు డెప్పుడటంచు నెగురుచుండఁ,
బులివంటిప్రోడ హే శీ ముఁడు క్షణక్షణమును దండెత్తిరాఁ గాలు ద్రవ్వుచుండ,
నల్ల కాబూలుకొఱ కేగ ఢిల్లీ పోవు; ఢిల్లీకై చూడఁ గాబూలు చెల్లిపోవు;
వెనుక నూయి ముందర గోయి యనుటయయ్యె శౌర్యధనుఁడు బైరాంఖాను సైన్యపతికి
# తొలుత సికందరుశాహిని గలియుచు బై రాముఖాను కల్యాణూర
♦
స్థలమున నోడింపఁగ నతఁ డలఘుగతి శివాలకద్రు లందున డాగె౯.
॥ లక్ష పదాతి ద ళంబు కరుల్ వేయి తన వెంట నేతేర దండు వెడలి
హేముఁ డాగ్రాపురి శ్రీ కేగి చేకొనే దాని; నవల ఢిల్లీపురం బాక్రమించె;
బై రాముఖానుఁ డ + క్బరు ససైన్యముగ సిద్ధంబైరి పానివట్టంబు నొద్ద;
నుభయసైన్యములకు యుద్ధం బెసఁగెఁ; దురుష్కులు శత్రు సేన వయ్యలుగఁజేసి
Iహేము బంధించుకొనుచు బై శ్రీ రాముఁజేర్చి; రతఁడు కారుణ్యమును మానిశీయక్బరుఁ గని
"శత్రు శేష ముపద్రవ సమితిఁ దెచ్చు! శీఘ్రముగ వినిమ సంబుఁ జెండు" మనియె.
శా॥ "నామే లూర్చి వచించు నీనుడిఁ దల దాల్పంగ నౌఁ గాని, యీ
హేముం డోడినవాఁడు; పట్టువడినాఁ; డీనాఁ డవధ్యుండు; నా
కై మన్నింపు" మటంచు నక్బ రన్; ఖ డ్గంబెత్తి ఖండించే బై
రాముం డ'త్తఱి హేముమస్త మిలపై రాల భటుల్ భీతిలక్.
148
150
పీ త్రప్రధాన ని శాతవర్తనుఁడౌట నావేశ మది కొంత యలరుఁ గాని!
బైరాముఖానుఁ డ + క్బరుఁ బెక్కు గురువులు వేర్వేటి నియమించి వివిధవిద్య
లభ్యసింపఁగఁజేసె; నాతని వేయికన్ను లఁజూచి వేయిచేతులను గాచి
ధరణిరాజ్యం బూర్జి 4 తము చేసెఁ; గాబూలు చేకొనె; గాంధార సీమ గెలిచె; [చె;
గీః జాపురం బజమీర్ ప్రదేశములు గొనియె;గ్వాలియరు పట్టుకొనియె;
మార్వారునోం
క్షణము విశ్రాంతిఁగొనక రాజ్యములు గెలిచె నక్బరున్నతి పరమ లక్ష్యముగనుంచి.
జ</p>
<pb n="71" />
<p>క
రాణా ప తాపసింహ చరిత.
మః ఆరుదెంచె బదు నెన్మిదేఁడులగు ప్రాయం: బప్పు డక్బర్ వసుం
ధరఁ దానేలఁ దలంచె; సేవకతతి ద్రవ్యంబు నర్పించి సం
మక్కాకుఁ బంపించెఁ ద
ఒక మొప్పారఁగ నాత్మరక్షకుని నా
*ఆ "సబూరహిమాను" దత్సుతుని వేడ్క జేర్చి పోషించుచు.
సీ ఆజాను దీర్ఘ బాహార్గళయుగళుఁ! ముద్యత్పద్మపత్ర నేత్రములవాఁడు!
ఘన సార్వభౌమ ల + క్షుణలక్షితుండు! ప్రసన్న మనోహరా స్యంబువాఁడు;
బలశోభితారోగ్య వచ్చరీరుండు నీరదతుల్య గంభీర రవమువాఁడు!
శాంతిప్రధాన వ । ర్చళ్ళోభితుండు! దయాపూర్ణ మృదహృదయంబువాఁడు!
గీ కష్టము సహింపఁగలధైర్య శ్రీ గరిమవాఁడు! వితరణ వికాసములవాఁడు
•
20
వేయునే
భరతఖండ మేలిన సార్వ భౌములందు నింతవాఁ డింక లేఁడను నంతవాఁడు. ।
సీ। అంచెల మార్చుచు • నశ్వంబులను, స్వారి యిరువదై దామడల్ పఱచియుండె
ఘూర్జరమ్మునఁ ద్రోవ । గొప్ప బెబ్బులి రాఁగ నద్దానిఁ జేతఁ జొప్పడఁచియుండి
విడక "ఖుడీరా" వ ! నెడి మత్తకరి నెక్కి మైదామడల దూర మరిగియుండి!
నాఁడుసిఁగము పిల్ల । లైదు మండుటెడారియందుఁ బై ఁబడఁ బీచమణఁచియుగ
2. నిరువురను దన సందిట నిఱికికొనుచుఁ గోటగోడలపై నెక్కి దాఁటియుండె!
న ప్రతీపప్రతాప ధై * ర్యములు దేహబల మితని సొమ్మనుచు మెచ్చ, మెలఁగియు
మః భగవాళదాసునిపుత్రి యొక్కరిత నక్బర్ కోరి పెండ్లాడె; నా
క
భగవాళ్దాసుని సోదరాత్మజుఁడు "కు న్వార్" మానసింహుండు వీ
*గిరిపుండయి ఢిల్లీఁజేరి పరరాష్ట్రశ్రేణుల గెల్చి కీ
క్తిగుసుత్వంబు వహించి యక్బకుకడూ దీపించె సేనానియై.
సీ: ముప్పాలుప్రజ హైందవులుగాన వారిసేమము తన కెఫ్టు సే నీ మమని తలఁచె;
గిస్ 2యించియుఁ బట్టు . కొనినవారిని బానిసలఁ జేయు చట్టంబు నిలిపివై చె;
యాత్రల
కేగు భ . శ్రావళితోఁ బన్నుఁ గొనరాదనుచు దానిఁ గొట్టినై చెఁ;
♦
కకాలముగను వే 4 సెడు జుట్టపన్ను న్యాయవిరుద్ధమని దాని , నవలఁద్రోసె;
1 హై బుస యవనరా + జ్యంబు నిలుప నెన్ని యత్నముల్ వలయుఁ దా నన్ని చేసే
ము: మిములనుండి కన్యాకుమారి దాఁక వసుధ నెల్లఁ బాలింప న కరు దలంచె.
కొక మేతా దుర్గము; చేకొనే గోగో కోట; యింక గోవిందవనం
ఒక దేశము గెండెను; కోటకు నాగా పురమున దృ + ఢమ్మగఁ గట్టెక్
•
15
157</p>
<pb n="72" />
<p>31
ప్ర థ మా శ్వా స ము.
। శరణని మాళవపతి దరి కరుదేరఁగఁ గూర్మిఁగని సహస్రహయాధీ
శ్వర సేనాధీశుగ నాదరమున నాస్థానమున న తనిఁ జేర్చుకొనె.
॥ తపతీనదిపై ఁగల బ్రహ్మపురంబును విజయగృహము నతిరయమార
నృపకులదీపకుఁ డక్బరు కృపకును లోనగుదుమనుచుఁ గేళ్లురి కె వడి.
॥ రావలపిండి సమీపములో విలయాంతకునకైన లొంగని గక్కా
రావీరుల కావర ముడివోవఁగఁ బంజాబుదేశ మును గెల్చుకొనెక్.
I తూరుపుసీమల దృష్టిని సారింప నడేల్క్కులుండు చానాక్ దుర్గ
ద్వారములు దీసి యక్బరు భూరమణుని పాదకమలములు పూజించె.
॥ నరసింగపూరు చౌరాఘరు మఱి హోసంగబాదు క్రమ మొప్పఁగ న
.
•
♦
క్బరుబాదుశాహి చరణాంబురుహంబులు శరణమనుచుఁ బొగడుచు నిలిచెక్. 162
!! 'రండో 'పురుషో త్తమ!" యని ఖాండీషునృపుండు కాళ్లు గడిగి తనూజ
మండలరాజ్యంబు నృపా ఖండలునకు నప్పగించెఁ గడుభక్తి మెయిజ్.
చతురనంతబలంబులు సందడింప సింధు గంగా నదుల మధ్య సీమలందుఁ
జైత్రయాతా పరంపరల్ సలిపి దిగ్విజయము సాగించె నక్బరు చక్రవర్తి. 164
॥ "భరతఖండై కభాగ్యమై పరగు రాజ పుత్రరాజ్యమేలని వాని పొడవు వృథయె"
యని నడి పె సేన;తద్భారమా లేక యురగనాయకు ఫణము లు ట్టూఁతలూఁ గె.
॥ మహిత ధైర్యుండు తోడర శ్రీ మల్లు మేరు శిఖరమట్టి ఖాసింఖాను సింహమట్టి
బిరుదు'ఖ్ాఖానను పిడుగుల్ వేళ్ల నలుపు భయదశౌర్యులు నిలిచి రక్బరును గొలిచి
కు అలఘుప్రాభవకీర్తివిక్రమయుతుం డౌ మానసింహుండు కొం
♦
5
బు
డలఁ బిండి బడఁగొట్టు మేటి భగవాన్
ధులకు వృద్ధపితామహుం; శిరువురు
... డ్కులు దర్పించిన నడ్డుపాటు గలదే
క ॥ ఈమెయి నక్కరు నడుపు చమూమానం బింతయనఁగ బుద్ధి చొరదు;
బుద్ధిచొరదు;
స్సా మొదలుగఁ బాండోలీ సీమవఱకుఁ బదియుమైళ్లు • సేనలు నిండెజ్.
జలధులంతటి సరస్సులు పెక్కులుండెఁ; గ్రిందట వనాశానది నడచుచుండెఁ;
దరఁగని బహువిధ + ధనధాన్యతతులుండెఁ; బైరు క్రొత్తఁగ నెక్కి వచ్చుచుండెఁ;
గోట లేడును జుట్టు , కొని దృఢమ్ముగనుండె; సప్తమహాద్వార సమితియుండె;
గురుతరాయుధపరం పర చెంతనుండె; యోధతతి చిత్తములందు ధైర్యముండె;
సీ
దా సిందునందున్న యో
దో తెంచి రీతండ్రికొ
జోణీతలంబందునథ్!
158
159
160
161
163
.
167
168</p>
<pb n="73" />
<p>32
గీ॥ నక్బరున కెకా దవ్వాని
సాధనము లుండె; లేమి
Oహచరిత్ర.
ణా ప్రతాప
యబ్బకైనఁ దగ్గక రణంబు సాగింపఁ దగ్గ యన్ని
యెచ్చటను గలుగ దుదయసింహరాణా లేమి యొకఁడు
ఉ॥ అంగడినున్న వన్ని శని యల్లునినోర నటన్నమాట వా
సిం గనఁజేసి యాయుదయ సింహుఁడు యుద్ధమటన్న భీతిచేఁ
గ్రుంగుచు రాజపిప్పలిని గోహిలు వంశ్యులయొద్ద డాఁగె; నై
నం గనరాదు లోపము రణం బొనరించెడు యోధకోటికి౯.
ఆ సీ। అల సలుంబ్రాధీశుఁ డగు సాహిదాసు, శౌర్యాన్వితుండగు దేవ రాధిపతి
ఖేల్వాప్రభుఁడు శుద్ధ · కీర్తి. 'పుత్త' నృపుండు, బేడ్లా కొటేరియా పృథ్వివర
నింక మడేరియా । నృపతి దూడాసింగు, పావనాత్ముండు ఝాలావిభుండు
ఝాలూరినేత యీ శ్రీ శ్వరదాసు, సో నెగుట్టేంద్రుఁడైన కరుణా సాంద్రరాజ
గీ। గ్వాలియరు దేశపతి లోను గా మహిపులు పగి లెడు పిరంగిగుండుకు వక్షమి
ధైర్య హేమాద్రులు వి శేష దళము లలరఁ బోయినిల్చిరి గెలుపొ చావో యట
కః అల్ల యమభటులఁగేరెడు బల్లిదులగు భటులు గొలువ పైరుల మనముల్
తల్లడిలఁగ వచ్చెను జయమల్లుఁడు రణరంగపార్థ మహితీయశుండై.
+
It (Chitor) lacked not however brave defenders. Sahidass at the heat
a numerous band of the descendants of Chonda was at his post (the gate of the
there he fell resisting the entrance of the foe, and there his alter stands on
brow of the rock which was moistened with his blood, Rawut Dooda of Machi
led the sons of Sanga. The feudatory chiefs of Baidla and Rotario, descended f*
the Prithwi Raj of Delhi, the Pramar of Bijoli the Jhala of Sadri inspired th
contingents with their brave example; these were all home chieftains. Another
of Deola again combatted for Chitore with the Sonegurra Row of Jhalore. Est
radass Rahatore, Karamchand Katchwaha with Dooda Sadani and the Tuar pri
of Gualior were distinguished among the foreign axiliaries on this occasion......
But the names which shine brightest in this gloomy page of the annals of Mew
which are still held sacred by the bard and the true Rajaput and immortalized
Akbar's own pen; are Jainial] of Bednore and Putta of Kailwa, both of the sixte
superior vassals of Mewar. The first was a Rahtore of the Mairtea house, t
bravest of the brave clans of Marwar, the other was head of Jugawats anoth
grand shoot from Chonda. The names of Jaimall and Putta ase as house h
words inseperable in Mewar and will be honored while the Rajput retains a shi
of his inheritance or a spark of his ancient recollections.
* }
"Annals of Mewar"</p>
<pb n="74" />
<p>ఛ మాశ్వాసము.
♦
సీ। ఇతఁడు మార్వార్మహీ పతి మాళదేవుని సుతుఁడు; బాల్యమునందె తూరలోక
చూడామణియన వి . శుద్ధకీర్తి గడించెఁ; దండి కీతనికి భే దంబు వచ్చి
చిననాఁడు తనదేశ శ్రీ మును వీడి వెడలె; నీతని భుజాటోప దుర్దాంతత విని
చిత్తూరిరాణాయుఁ జేయిచ్చి మన్నించి బదనూరు సంస్థానపతి నొనర్చె;
గీః మహితధైర్యంబు వజ్రవ ర్మంబుగాఁగఁ దనదు రాథోణ్మహావీర తతులఁ బూన్చి
తగిలి బ్రహ్మాండమైనఁ బిండిగనొనర్చు శాస్త్రి తర ధాటిఁ గాలాగ్ని రుద్రుఁడితఁడు.
కథ కృప నాదరించు చిత్తూర్ నృపచంద్రుని పనులు మేని నెత్తురు కండల్
విపులముగ ధారపోసి జరుపు స్వామి స్నేహబంధు రుల్ వీరెల్లర్.
సీ॥ సమర మనేకమాసము లయ్యె; నక్బరు పెక్కురుపనివాండ్రఁ బిలువనం పై;
దుర్గంబుక్రింద గో తులను ద్రవ్వించి చొప్పించి యగ్నిరజంబు ప్రేలిపించెఁ;
జిత్తూరిసేన కాచిననూనియలు శిలల్ గుప్పుచు వైరులఁ గూల్చుచుండె;
యవనులు తలలపై శవకోటిఁగప్పి దుర్గము క్రిందఁద్రోయంగఁ గడగుచుండి;
గీ॥ రెప్పుడునుగాని యాగోడ లెచటఁ గాని పగులుటయుఁగాని సేన లోఁ బడుటగాని
కానరాదయ్యె! నక్బరు గడియ గడియ కెటులెటులటంచు విసుగు నొందుటయకాని.
సీ॥ ఉన్న మందంతయు నొకమాటె పెక్కుతావులఁ బోసి కూరి ని ప్పును ఘటింప
నొకగని ప్రేలె; ముం దుండిన మోగలుల్ గూలిరి; గోడయుఁ గొంత యురలె;
దానితోఁ గొంద ఱంతమునొంది; రీవ లావలివారు ముందుకుఁ గలయదూఁణి;
రంత బ్రహ్మాండంబు నగలించు నొక పెద్ద ధ్వనితోడ నొండొక్క గనియుఁ బ్రేలె
గీ॥ దాన యవన హైందవులగా త్రములు గాలిఁగలిసె శతశ స్సహస్రశః శీ ఖండములయి,
విఱి గె నొకగోడ;యచటఁ బెక్కు రుయవనులు హైందవులు చేరి,రయ్యె ఘోరాహములు.
శ॥ రణరంగమృగేంద్రులు చోహణవీరులతో. గొబేరి . యా-బేడ్లారా
.
ణ్మణు లాసమ్మర్దం ణాంగణమునఁ దెగి స్వర్గసీమఁ గట్టిరి గృహముల్,
క॥ హరవంశ్యుల నడుపుచు నీశ్వరదాసును దేవరాధి పతియును ఝాలే
శ్వరుఁడును బెండ్లికి నడిచిన కరణిని ననికేగి మడిసి ౪ కనిరి యశంబు.
క॥ దురమున దూడాసింగును గరుణాసాంద్రుండు వైరి గణమస్తముల
దఱుగుచు రాసులు పోసిరి పరలోక ద్వారసీమ వఱకవ్వేళక్.
క॥ భండన శతఘ్ను లనఁదగు చోండా వద్భటులతో వి + శుద్ధ యశస్సాం
ద్రుండైన సాహిదాసుఁడు ఖండితుఁడై యొరగె భటులు కళవళ మంద
33
174
177
178
179</p>
<pb n="75" />
<p>ప్ర
తాపసింహచరిత్ర.
దవలెఁ; గాన
ఉమ్మపి
వచ్చి సేన
పెండ్లికొడుకు
• క చండ నృపాఖండలు కులమండనుఁ డరిదండధరుఁ డ । మాత్యుఁ డితండుజ్
బండినయెడ నీనాఁటి కఖండ స్తంభం బొకండుగననై యుండుక్.
సీ। సాహిదా సేగ నా ! స్థానంబు మఱలఁ జోండావత్కులుండె చెం
భారమ్ము పుత్తపై , వాలెఁ; బాయము పదునా తేండ్లు; తండ్రి లేఁ;
నిందుకు మూన్నాళ్ల * ముందె పెండిలియయ్యెఁ; బసపు గుడ్డలతోడ
కధిపతియాచు సూ । ర్యద్వారమున విజృంభించుచు నాకొత్త
గీః గొఱియలమందఁ జొచ్చి గగ్గోలుపఱచు బెబ్బులివిధానఁ దురకల పిండు
నామహాబాహు బాహు శౌర్యంబుఁ గాంచి యుభయసైన్యంబులును దలశీలూఁచిని
తొ గీ॥ నవ్వు చవ్వీరు జనని చోండావదన్వయము యశము పెంచు తెరాత్రవీ, రావ
కోడలిని వెంబడిని బిల్చు కొనుచు వచ్చి వైరిశిరములు రాసులు వడఁగ Fiel
సీ॥ ముద్దుమోమున నాణి ముత్తెంపు బాసికం! బద్దంపుఁ జెక్కిళ్ల యందు మెఱుఁగు
గాటుక చుక్కయుఁ! శ్రీ గాళ్లఁ బారాణియుఁ! బసపువన్నియ పెండ్లి వస్త్రములున
సకల కల్యాణ భూ । షణరాజితోఁ! దనుతాణంబుఁ దొడిగి హస్తమున ఖః
మరలఁ బ్రాణేశ్వరు * నండ నిల్చుచు సత్య వరకు సేవల నట్లు నఱికె (పుల;
84
The Rajput premier is the military minister, with the political Gove
ment of the fiefs; the civil minister is never of this caste. At Udaipur he is ca
Bhanjgurh. His influence, necessarily gives him unbounded authority over
military classes with unlimited power over the inferior officers of the state.....
When "Raun" of Udaipur leaves the capital, the Salumbra. -Chief is invested w
the government of the city and charge of the palace during his absence. By
hands the sovereign is girt with the sword and from him he receives the mark
inauguration on his accession to the thrcne. He leads by right the van in bat
and in case of the siege of the capital his post is the Suryapol (the gate of the
and the fortress which crowns it in which this family had a handsome palace wh
16 LOW going fast to decay.
"Annals of Mewar'
"
When Salumbra fell at the gate of the Sun, the command devolved
Putta of Kailwa. He was only sixteen, his father had fallen in the last shock i
his mother had survived but to rear this the sole heir of their house. Like
Spartan mother of old, she commanded him to put on the 'Saffron robe' and to
for Chitore. but surpassing the Grecian dame, she illustrated her precept
example; and lest any soft compunctious visitings for one dearer than herself n
dim the lustre of Kailwa she armed the young bride with a lance, with her desc
ded the rock and the defenders of Chitore saw her fall fighting by the side of
Arazonian mother,
"Tod's Rajasthan."</p>
<pb n="76" />
<p>;
35
ప థ మాశ్వా సము.
గీ॥ "వెన్న ముద్ద పిరంగియై వెడలివచ్చె! హరిణ శాబము బెబ్బులి । యగుచు దూఁకె!
నబినీలత బ్రహ్మాస్త్ర మగుచుఁ దాఁకెసన రణ మొనర్చె నాపుత్త యనఁగుఁ బడఁతి.
।
గీ॥ పుత్తయు-నవోఢ .తల్లి యు ద్వృత్తిఁ బోరి దస్యుగశరక్తముల వసం తమ్ము లాడి
తల్లి చిత్తూరులక్ష్మీపాదముల నొఱిగి సమసి రుభయసైన్యములు బాష్పములు విడువ.
సీ॥ ధన ధాన్య వసన వాహనము లియ్యఁగవచ్చుఁ; గోరిన తిండి చే కూర్పవచ్చు;
గందంబు మెయినిండు గా రాయఁ గావచ్చుఁ బెక్కు భూషణములు పెట్టవచ్చు;
ద-దిలేని విద్యలు శ్రీ చదివింపఁగా వచ్చు; విభవంబు లెన్నేనిఁ బెంపవచ్చు;
క్రింద మన్నని శిరమందుఁ జేర్పఁగవచ్చు; సమరాద్రి తెచ్చి యియ్యం గవచ్చు;
గీ॥ గాని రణదుర్గ కర్పింపఁ గన్న కొడుకుఁ గోడలిని బంపి దీవించి తోడు వచ్చి
శత్రుశవకోటిపై వీర శయన మందెఁ; బుత్త! నీతల్లి యెంతటి పుణ్యవతియ! 186
సీ। క్షాత్రధర్మైకని । శ్చలుఁడు రాథోడ్వంశజుల కెల్ల మనయశో ఢీ జ్యోతియైన
జయమల్లుఁ డవ్వలి • క్షణమె సూర్యద్వారసీమకు నడచుచుఁ జిచ్చువోలెఁ
బర సేనఁ దాఁకి కొ , బ్బెరకాయలవిధానఁ దలలు కుప్పలు గాఁగు నిలను రాల్చి
దక్షాధ్వరధ్వంస దారుణకృతిఁ బెంచు వీరభద్రుఁడువోలె వెలుఁగఁజొచ్చె;
।
గీః "నకట! నాభాగ్యమున సూర్యుఁడ స్తమించి యాగె రణ; మీతనికి గంట వ్యవధియున్న
సేన సర్వసంహారంబు చేసియుండు" ననుచు నక్బరు వెఱగొంనతని కృతికి.
మ॥ ప్రళయారంభమునాఁడు లోకముల గూల౯ వచ్చు నారుద్రుని
దలఁపజేయుచు దుర్ని వారబలవ ద్ధాటీసనూరంభ మై
యలమూద్యజ్జయచుల్ల మందర మమితానీకినీవారిధి
గలఁపజొచ్చెను! బ్రొద్దు క్రుంకి రణ మంతం బందె నానాఁటికి౯.
చ పలుచని పాలవెన్నెలలు పైనొలయక్ జయమల్లుఁ డాత్మయో
ధులఁగొనుచుక్ బరాహమున దుర్గము గూలినచోట రాలు సం
దులనిడి బాగు సేయుటను దూరమున గని యక్బ రంతలోఁ
గొలిపెను గుండు 'సంగ్ర'మను గొప్పతుపాకిని బట్టి పేల్చుచు.
§
188
189
By the light of the torches Akber recognised the Rajput general and
believing him to be within distance, he fired and killed him on the spot. The
Rajputs rallied indeed subsequently but it was too late and though they exerted to
the utmost they could not regain the lost advantage. When the day dawned
Chitore was in the possession of Akber.
"G. B. Malleson"</p>
<pb n="77" />
<p>1
ప్ర
మః విదితాగ్ని ప్రభలొప్ప మండుచుఁ గడు వేగంబ హృత్కోశమం
దది దూఱ జయమల్లసూర్యుఁ డకటా! యస్తంగతుండై భయా
స్పదదుఃఖాంధతమంబున విడిచె మేవాళ్భూప్రపంచంబు; నె
ల్లదళంబుల్ స్పృహతప్పి బెండువడి నేలల్ వట్టె దైన్యంబునక్.
మః అకటా! సింధుకు బ్రహ్మపుత్రకును మధ్య గల్గు నీసర్వధా
(!
త్రికి రారాజవు! యుద్ధ మాఁపుతఱి! రా త్రికా! కార్యనిర్మగ్ను జౌ
ర్యకృతి జంపితి వెచ్చరింపకయె నీ రవ్రాతశార్దూలు; 'న
టికి నీ గొప్పతనంబు ధర్మమును బాటింపంగ లేకున్నచో.
1 36
Y
24
8
త్ర.
చ॥ విలయకృతాంతమూర్తు లిటు
నిలువక యోధు లందఱును
వలెఁ; దరుణీజనుల్ పడిరి వహ్నిని; నెన్మిది వేలు రాజపు
త్రు లపుడు తమ్ములమ్ముఁ గొని తోడ వసంతములాడి ముందటళ్,
కః సూర్యద్వారము ధైర్యాహార్యములై యపుడు తెఱచి యవనుల విజయా
వార్యుల నఱకుచుఁ దామును శౌర్యము రాజిలఁగఁ బోరి సమసిరి వరుస౯.
ఉ॥ కూలిరి వేల కంగనలు కూలిరి నూర్లకు రాజబంధువుల్!
కూలిరి వీరపుంగవులు గొబ్బున ముప్పదివేలమంది ! య
వ్వేళను బెక్కువంశముల
పెక్కురు నాథులు గూల ధైర్యముల్
నిల్చిరి జీవము లేని బొందులుకో
పెద్దలు గూలిరి! త్వారు వంశుఁడౌ
గ్వాలియరీశుఁ డొక్కరుఁడే ప్రాణముతో మనియుండె! నేమనజ్ ।
సీ॥ సంవత్సరంబు కష్టము చేసి గెలిచిన చిత్తూరిలోఁ బ్రవే శించి యచటి
సౌధరాజములు పా శ్రీ సాదంబులును గుళ్ళు గొప్పకట్టడములు కూలదోసి
పెద పెద్దవగు రణ భేరులు డంకాలు గొని భవానీదేవి కోవెలఁ గల
స్వర్ణ దీప స్తంభ సమితియుఁ జిత్తూరునగరమ్ము ద్వారబంధములు గొనుచుఁ
గీ గుంభవిశ్వంభరాధీశ జంభవైరి దగు జయ స్తంభ మాదిగా నచట నున్న
196
191
192.
193
194
1
B
పూర్వరాజ విక్రమచిహ్న శ్రీ ముల నఖిలము వీడ కక్బరు బగ్గము పాడు చేసే 195
§ గీ తనకు లొంగక తవిలి మార్కొనిన రిపుల కన్నివిధముల సాయమైరనుచు దుగ్గ
వాసులుదఱ నఱకి ముప్పదియు వేలు పండువంటి సంసారముల్ పాడు చేసి.
1
§ Akber entered Chitore, when thrity thousand of its inhabitants became>
victims to the ambitious thirst of conquest of this "Guardian of mankind." All the</p>
<pb n="78" />
<p>te
ప్రథమాశ్వా సము.
మ॥ తనచుట్టు౯గల రాతిగోడ హిమవం తంబట్లు దుర్భేదమౌ
నని శత్రుభ భయమొంది పాఱ నొకవే
యబ్దంబులు గీర్తిమో
సిన విశ్వోన్నత పట్టణప్రవర మా చిత్తూర్ కటా! కాంతులె
ల్లను గోల్పోవుచుఁ గాడుగా నిలిచెఁ! గా శ్రీ లు బిక నెబ్బంగిదో!
సీ। చిగురైనఁ జినుమ నొచ్చెడు చోట ముప్పది వేల పౌరులఁ గూల్పఁ జాలి కెట్లు!
కఱవె భేకులు! నీకుఁ! * గడుపు నిండెనె! ప్రాతతోల్ముక్కలే! కాని దొరకఁగలదె!
దివ్వెకంబముఁ గొంటె! తీజెనే నీదరిద్రత! కటా భూరి సామాజ్యపతి వె!
కోట గెల్చితిగాక! కుంభు జయ స్తుభ మేల కూల్చితి! లాభ
మేల కూల్చితి! లాభ । మేమి నీకు !
•
గీ గుడుల దివ్వెలార్చెడు పచ్చి కూళలైనఁ జేకొనరె! యెట్లు చేయాడెఁ జిత్తుకుపురి
ద్వారబుధముల్ గొనఁ! జల్ల పడెనె కనులు! సరస గుణధామ! యక్బరు సార్వభౌమ!
సీ॥ చిత్తూరు నగర లక్ష్మీభాగ్య సౌభాగ్య మానాఁటితోడ నె యంతమొందె;
నవల మేవాడ రా 4 జ్యమున కయ్యది రాజధానియై విభవము దంగ లేదు;
కోటల నెవరు బా గుపడఁ జేయఁగ లేదు; భేరీధ్వనులు విని మీపలేదు;
పుడమిలే, డైప్పుడం దడ: గిడినదియు లే; దొకయింట దీపంబు + నుండలేదు;
గీ యవనపతి చేసి చనిన మహాపకారి మనుదినము చాటు చిప్పటికట్లే భయద
మృగములకుఁ గంటకావృత వృక్షములకు వాసమైయున్న! దెంతటి పాతకంబొ!
గీ॥ మహిత చిత్తూరునగర సామ్రాజ్యభవ్య నాటకాభ్యంతరమున నీ నాఁటి కకట!
కట్టకడ తెర వ్రాల మం గళముపాడె ననఁగ ధ్వనిలేపుచుండు వి హంగతతులు!
1
87
1
197
heads of clans both house and foreign, fell and seventeen hundred of the
immediate kin of the Prince sealed their duty to their country with their lives.
The Tuar chief of Gualior appears to have been the only one of note who was
reserved for another day of glory. Nine Queens and flve Princesses with two
infant sons and the families of all the chieftains not at their estates, perished in
the flames or in the assualt of this ever memorable day. Their divinity had
indeed deserted them, for it was on Auditwar (the day of Sun) he shed for the last
time a ray of glory on Chitore. The rock of their strength was despoiled; the
temples, the palaces dilapidated; and to complete her humiliation and his triumph,
Akber bereft her of all the symbols of regality; the nakaras whose reverberations.
proclaimed for miles around, the entrance and exit of their Princes, the candelebras
from the shrine of the Great Mother and in mockery of her misery, her portals,
to adorn his projected capital Akberabad. The abode of regality which for a thou-
sand years reared her head above all the cities of Hindusthan is become the refuge
of wild beasts which seek cover in her temples.
"Annals of Mewar."
A</p>
<pb n="79" />
<p>:
88
రాణా తాపసింహచరిత్ర.
క॥ 'పదునైదువందలును సర్వదియెనిమిది' యనిన సకల
స్పదమని మేవాడ్ ప్రజ లాపదమును నేఁటికిని వినఁగఁ
సీ ఆరణంబున నక్బ రజరామరఖ్యాతిఁ గను శౌర్యధను లిద్దఱనుచు మెచ్చి,
జయమల్లు పుత్త ల . సత్కీర్తికై వారి విగ్రహంబులు రచిం పించి, ఢిల్లీ
లో మహాద్వారంబు + సీమ నిర్వంకల వాని రెండేన్గుల పైన నుంచి
హితులును బంధులు నేతేరఁ జూపి వారల శౌర్యకథనముల్ దెలుపుచుండుఁ!
ఆ గీ గొండలట్లుండు నమేటి కుంజరములు వానిపై నున్న యవ్వీరవరులు నేఁటి
గీ
కటకరిగి చూచువారల స్వాంత సమితి నెంత వెఱపుగూరు రొ! దేవుఁ జేయెగ
--*) ఉదయసింహుఁ డుదయపురముఁ గట్టి కాపురముండుట. (*
పరిభవముల కా
బాల్పడ రకటా!
చ కదనము నిల్చిపోయెననఁ గ్రమ్మరి వచ్చి తటాకముక్. ముదా
స్పదముగఁ గట్టి పే 'రుదయ సాగర' మం చిడి చెంతనే వసిం
చెదనని కట్టె ని ల్లుదయ సింహుఁడు; పెక్కురు కట్టిచేరి రం;
దుదయపురాభిధానమున నొప్పెఁ బురంబది వాని పేరునక్.
క॥ చిత్తూరి రాజ్యమంతయు ముత్తునియలు గాఁగ నుదయ పురరాజమె స
ర్వోత్తమము చాలునంచని యిత్తఱి నయ్యుదయసింహుఁ డేలఁదొడం గెజ్ ;
!
201
201
201
[ wh
I find nothing remarkable at the entry but two great elephants of ston
which are in the two sides of one of the gates. Upon one of them is the statue d
Jaimall, that famous raja of Chitore and upon the other Putta his brother.
These
are two gallant men that together with their mother who was yet braver that
they, cut out so much work for Akber; and who in the seiges of towns which
they maintained against him gave such extraordinary proofs of their generosity,
that at length they would rather be killed in the outfalls with their mother than
submit and for this gallantry it is, that even their enemies thought them worthy
to have these statues erected to them. These two great elephants together with
the two resolute men sitting on them, do at the first entry into this fortress make
an impression of, I know not what greatness and awful terror.
Letter written at Delhi 1663.
Such the impression made on a Persian, a century after the event, but fur
more powerful the charm to the author of these annals, as he pondered on the
spot where Jaimal received the fatal shot from Singram, or placed flowers on tha:
cenetaph that marks the fall of the son of Chonda and the mansion of Putta
whence issued the Sesodia matron and her daughter. Every foot of ground is
hollowed by ancient recollections.
"Annals of Mewar"</p>
<pb n="80" />
<p>99
ప్రథమాశ్వాస ము.
క॥ సుతు లిరువదియైనగురై సతతము బహుపుత్రకులకు జనకుడని సం
స్తుతి కెక్కె; గాని రాజ్యోన్నతి కేమియుఁ చేయఁ డితఁ డనామకుఁడగుచుకో". 205
సీ ఉదయసింహుఁడు పూర్వ మొకనాఁడు కొలువుండ నొకక తి లోహకారకుఁడు డెచ్చె;
నది పదనైనదో । యనిచూడ నొకపుల్లఁ గొంచెము చివ్వి యు ముంచెఁ గత్తి
యచటనుండిన సూక్తుఁడై దేండ్ల బాలుండు 'కత్తు లొరుల నఱుకఁగ నె కాని
పుడకలుచివ్వ 'నే + ర్పడ' వంచుఁ దనదు హస్తము చీల్చె; దాన గొట్టమునఁ జిమ్మి
గీ॥ నట్లు వేడినెత్తురు గాఱి • యచటి రత్న కంబళంబంత రక్తసిక్తముగ నయ్యె;
నందతాశ్చర్యమగ్ను లై ; రక్కు- మారుఁ డచలుఁడై చూపు తండ్రియాస్యముననిలిపె
మ॥ తను నెప్లైనను జంపు నీతఁడని భీతస్వాంతుఁడై జేఁడు "ఏ
డై
నిని గొంపోయి వధింపుఁ డంచు భటులక్ నేమించె; వారు మహా
వనముక్" జేర్చిరి; త్రోవవచ్చెడు సలుంబ్రాకృష్ణుఁ డీక్షించి యా
తనిఁ దోడెచ్చుచు నింటఁ జేర్చుకొని పుత్రప్రేమఁ బెంచె వడి.
207
*) ఉదయసింహుఁడు జగమల్లుని రాజు చేయఁ గోరుట. (*
సీ॥ చిత్తూరుదుగ్గంబు । చెడిన నాగ్గేండ్లకు వసుధేశునకు గొప్ప వ్యాధి గలిగె;
మఱఁదులు సచివసా మంతభాంధవజనుల్ గనుఁగొనవచ్చి; రొ క్కదినమందు
నుదయసింహుఁడు వారి నొద్దకుఁ బిలిచి "నే మనఁబోను; నానోట మాటయున్న
యపుడె నా వెన్క మీ రాచరింపఁగఁదగ్గ పనులు దెల్పినను మేలనుచుఁ దోఁచెఁ!
గీ గొడుకు లిర్వదై దుగురు నాకుం గలిగిరి; సూక్తుఁడు ద్వితీయుఁ; డై దేండ్లు చొచ్చినపుడె
♦
బార్థివుగాఁ జే
మును లేకుండ.
గ్రూరుఁ డతఁడు. 209
చేరఁగొనిపోయి యీకృష్ణ సింగు పెంచుఁ బరమ వాత్సల్యమున సుం బ్రాపురమున.
గీ॥ చందురునినిండ జ్యోత్స్న యిం పొందినట్లు నగవు మొగమునఁగులుక సుంతయుఁగలఁగక
తనగళంబున వేఁడిర క్తంబునైన నేఱు పాటింపఁగల కడుఁ
క॥ అదయుం డతఁ డీలు వెడలుట పదికోట్లని యుంటి; వానిఁ
యఁదగునె? దేశము సర్వంబు దహించు నొకింత యనల
ఉ॥ మూఁడవనాడు సాగరుఁడు; మూర్ఖులలోఁ బ్రథముండు! నిర్వజా
నేఁడులు వచ్చె; నుండఁ డెపు డేనియు నాక; నాల్కవేఁడి; యే
నాఁడును ద్రవ్య మిచ్చియయి నక్ రణము గొని తెచ్చి పెట్టు; మే
వాడధరిత్రి నాకొఱవి పాలన చేసిన మీకు నచ్చునే!
210
211</p>
<pb n="81" />
<p>తాపసింహచరిత్ర.
నాల్గవవాఁడగు; మింటఁ బెట్టినక్
గోల్కొనఁబోవదు పైరు; పిల్చిన
40
చ॥ నరహరి! వీడు నాసుతుల
గురియదు వాన; నేలనిడఁ
దరియఁడు; చెంతకేగిన క్షణంబునఁ బర్విడు; వట్టి యగ్గియా;
♦
నరహరిగాదు ప్రాణహరి నా కతఁ డియ్యిల నేల నర్హుఁడే!
సీ॥ సకలమేవాణ్మహీ చక్రభారము దాల్చి పాలింపవలసిన ప్రథమపుత్రుఁ
డాప్రతాపుం డెప్పు * డతిసాహసికుఁడు! యుద్ధంబన్న విందని తలఁచుచుండు!
నొరులతోఁ బలుకఁడు! పరులను బిలువఁడు! నవ్వఁడు నొవ్వఁ డే నాఁడుగాని!
యనుకొన్న పనిని జే । సినదాఁక విడువఁడు! నామాటయనిన సుం'తయును జెల్ల
గీ దిల్లనక వాకిలనక రే యెల్లఁ దిరుగు! మనరిపులు బిల్ల పతులతో మైత్రి సేయు!
నిది పెదవిదాటు పల్లని * యెపుడొ విడిచి! తేమి చేయును! నా భాగ్య మిట్టు లుండె!
చ॥ ఇరువదియైదు పుత్రకుల నిర్వదినల్వురు మంది యిట్టులుం
డిరి! జగమల్లుఁడొక్కఁ డిది నీదని నాదని కొంత కాపురం
బెఱిఁగిన బుద్ధిశాలి; యెపు
జరుపుచునుండు; నందఱను
♦
Ces
డింట వెయుండి సమస్తకార్యముల్
జక్కఁగఁ బిల్చియు మాటలాడెడుక్.
చ అదియును నాఁడువారని య । నాదర మూనక యమ్మ యప్పయం
చెద గరఁగళ్ జరించు; నేపు డేనియు శౌర్యము గిర్భమంచును
వదరఁడు; బైటఁబోఁడు; భయ భక్తులు గల్గిన ప్రోడ; సద్గుణా
'స్పదుఁడని మీ రెఱుంగుదురు వాని నొకించుక సేపు చూచినకొ.
చ' కొడుకుల శ్రేయము దలఁచి గొప్పగఁ దండ్రులు చెప్పఁగూడ, దా
తఁడె సకలావనీభరముఁ దాల్పఁగ యోగ్యుఁడు; నాదు మాటల
బెడ చెవిఁ బెట్ట కాదరము • పెంచుచు నామ ననంతరమ్ము మీ
రుడుగక సింహాపీఠమున నుంచుచు వానిని రాజుఁ జేయుఁడీ!
మ॥ మఱియొక్కం! డధికారమంతయు సలుం బానాథుఁడు నాయనం
తరముదు౯ వహియించి యేర్పఱచురాణానొక్కనిక్ గాన; ని
త్తఱి నాతో జయమల్లు రాజుగను సంస్థాపింతునం చాతఁడిం
దఱలోఁ జెప్పుచుఁ జేతఁ జేయిడినచో నా యాత్మ శాంతి గను."
॥ అనుచుకో బల్కినఁ గృష్ణసిం గుదయసిం హాధీశ్వరు "నీయను
జ్ఞను
ను బాలించిన మేటి భాగ్యమగు; రాజస్థానసింహాసనం
.
211
214
215
216
217</p>
<pb n="82" />
<p>tel
ధ మా శ్వా స ము.
.
బునఁ జూతు జగమల్లు; నేకొఱ మనం బుక్ జేరఁగా నీకు; దే
వుని ధ్యానించుచు శాంతి నొందు "మని సంబోధించె నయ్యందఱకో.
చ॥ త్వరపడి కృష్ణసింగు వసుధాపతిమాటల కొప్పెనంచు నం
దణును నతృప్తిగాంచి వగ దార్కొని కుందిరి; కాని, కత్తివా
దరకరణి బ్రతాపగుణ తన్మయుఁ డప్పులి రాజుమ్రోల నె
వ్వ రిదియుఁ గాదు కూడదని పల్కఁగ నేర్తురు ధైర్యమూనుచుకో!
మ॥ శిరముల్ వంచుచుఁ బ్రక్క ప్రక్కలకు విచ్చేసెక్ మహామండలే
శ్వర సంఘంబు; పతాపుమామయగునా ఝాలూరిరా వల్లుఁడ
ద్దిర! రాజౌనను నాస లూఁడెనని చింతించె; మహారాజ్ఞి యుక్
గరము శోషి లె; బంధు లందఱును బొక్క జొచ్చి రవ్వా ర్తకు.
న
మః "అవురా! పుత్రులలోన జ్యేష్ఠుఁడు ప్రతాపాలంకృతుం డాప్రతా
పు వృథాచేసెనె రాజ్యహీనునిగ నీ భూమి శుఁ! డాకృష్ణసిం
గవలీల దలబెట్టులూఁపె! నెటుచేయవచ్చు! నెద్దీనె న
న్న వెస గొట్టమునందుఁ గట్టుఁడను చందంబయ్యె! నేఁడెంతయున్.
మ। కమలాప్తాన్వయమా! భవత్కృతమసశా ఘంబే మొ! రాముండు పూ
ర్వము కొన్నేఁడులు మానియుండవల సెక్
డమహీనాథుఁడు లేకయే చనియె; నీ నాఁ డీప్రతాపుడు స
ర్వముఁగోల్పోయెను; దుర్బలుల్ జనకు లౌ ॥ రా! యెంతకు గర్తలో."
బట్టాభిషేకంబు; చం
తా
*) ఉదయసింహుఁడు దివంగతుఁడగుట.
చ అని వగనొంది బంధుజనులంద అరుంతుదమౌ విషాద వే
దనలను బొంది కుందిరి; పదంపడి యజ్జననాథు జబ్బు హె
చ్చెను; మఱునాఁటిరే యుదయ సింహుఁడు తాఁ బరలోకయాత్రకే
గెను, సుతులు సతీజనము కేవల దుఃఖపయోధి ముగ్గఁగః.
•
41
218
219
220
it
221
222
223
శ॥ అవనిపతులు మరణించిన శవముఁ బురోహితుని యింటఁ జక్క విడువనం
త్యవిధుల నతండు' దీర్చుట యవుఁ బూర్వాచార మచటి యధిపుల యిండ్లక్. 224
క॥ వరసౌధము 'నాచోకీ' నగరులోఁ బట్టాభిషేక కార్యక్రమముల్
జరుగఁగఁ దొడఁగె; ముహూర్తము త్వర పడి జగమల్లుఁడలరఁ దరియఁగవచ్చెర్. 225</p>
<pb n="83" />
<p>తాపసింహచరిత్ర.
—*) పట్టాభిషేక ప్రయత్నము. *
సీ! పన్నీరు పునుఁగు జవాది యత్తరు దెచ్చి యెల్ల వీధులయందుఁ జల్లినారు!
ప్రతిగృహాంగణము కంబముల రంభా స్తంభనివహంబులను దెచ్చి నిలిపినారు!
సౌరభంబొలుకు మం + దారమంజులమాలికలు తోరణంబులు
'భువనగురుండొందుఁ । బూర్ల వైభవ' మంచు స్వాగతాక్షరములు
గీ1 దివ్యమగు రంగవల్లులు దీర్చినారు! పెక్కెడలఁ జల్వపందిరుల్
బీదలకు నన్న మేర్పాటు పెట్టినారు! సిరులఁ జిమ్మంగఁ బురమెల్లఁ జేసినారు
.
గట్టినారు!
వ్రాసినారు !
వేసినారు!
6
జ
*
Cei
*
సీ సౌభాగ్యలక్ష్మి కా స్థాన మొక్కో! యనఁ బలువిధాలంకార శీ ములను గూర్చి
నిత్యజయోత్సవ శీ నిలయమై యలరార నాస్థానమండపం బలవరించి
సమచతుష్కోణ విశాలవితర్దిపై నవరత్న దివ్యసం తతులు గలిగి
కనకమయంబు ను త్కట కాంతి మంతమౌ నొక్క సింహాసనం బొనరనునిచి
గీ దానికవ్వల శోభాప్రధానమైన పీఠ పంక్తులు వరుసగాఁ బెక్కునిలుప
{
♦
నింద్రుని సుధర్మయోయన నెసఁగె! సుప భాస్థలుబగు రాణాస భాస్థలుబు. 22,
గీ। సమచతుబ్ష్కాణ వేదికాంతమునఁ దూర్పు కొనను సింహాసనమునకు వెనుక నొక్క
వేయియపరంజికిరణముల్ । వెలుఁగ నలరె నతితరానందదంబు సూర్యధ్వజంబు 22:
C
! గ్వాలియర్ పతి మొదల్ గాఁగలిగిన రాజపర మేశ్వరులు కుడి ప్రక్కఁ దనరఁ!
జిత్తూరిరాణాల 4 సేవించు సామంతజనపతుల్ వామపార్శ్వమున వెలయ!
నున్నతోద్యోగసంపన్నులై శూరులౌ రాజబంధులు వెన్క ప్రక్క వెలుఁగఁ!
గవులు జైవజ్ఞులు గాయకుల్ చారణుల్ సింహాసనముముందుఁ జెలఁగుచుండ!
గీ॥ బహుళ సంఖ్యాకులగుచు భూ ప్రజలు వికసి తాస్యములతోడ వచ్చి యం దందనిలువ!
నిత్యకల్యాణముదిగ । నియతి నొప్పి యాసభామందిరం ఒప్పు డందగించె.! 229
•
}
జగమల్లు సింహాసనము నెక్కరాఁగా సలుంబ్రా కృష్ణసింహవిభుఁ
డనుమతింప కపోవుట.
26
మః అరుచెంచె జగమల్లు నూత్న తరవ్యాలంకృతుల్ మేనన
'చ్చెరువు గొల్పఁగఁ దాల్చి; తత్ప్రణమె యా సింహాసనం బెక్కి భా
స్వరశోభాకరరాజదండమును హస్తంబందుఁ గీలించి "యం
దఱు నల్గొల్వుఁడు మీకు నెల్లరకు రాణానైతి నేనితఱి.
23</p>
<pb n="84" />
<p>ప్రథమాశ్వాసము .
మ॥ అని యెతో యధికారయుక్తు వలె నందాసీనుఁడౌవాని బో
రనఁ జేరళొజని బుజ్జగించుచు సలుం । బ్రా కృష్ణసింహుండు
తా
ననువౌ మాటల "సింహపీఠమిది దేవా! నీదిగా దాప్రతా
పుని; దవ్వీరుఁడు వచ్చు; లేచి యిటు నీ వక్ రమ్ము దూరమ్ముగ.
క॥ అదియు నృపుఁడు కాఁదగువాఁ డుదయం బభిషేకమై ముహూర్తము దరియ
గదియఁదగు సింహపీఠం; బిది తగునే! ముందెవచ్చి యిఁటఁ గూర్చుండ౯." 232
మ' అని పల్కక్' జగమల్లుఁ "డేమనెద వా హా! నాఁడు మాతండ్రి చె
వేళకొ నను లేచిపొ
వంతైనఁ బాటింప! వె
ప్పినయా చొప్పున సమ్మతించియును నీ
మ్మని యెట్లాడెదు! ధర్మసూక్ష్మముల నా +
వ్వని రాజుక్ బొనరించెఁ దండ్రి యతఁడే పాలింప నర్హుండగుక్,
ఉ॥ ముప్పదియేఁడు లేలి చనె భూమిని! దండ్రియనుజ్ఞ గాక నీ
విప్పుడు చెప్పిన వినెదనే! యివి యేటికి వెళ్లిమాట!
నొప్పను! నన్ను వీడి చను మూఱక! వద్దని గద్దరింప
కెప్పుడు గల్గె బాధ్యత! యి . సీ! జగమల్లుఁడు నీకలంతియే!"
మ అని కోపమ్మునఁ బల్కు నాతని సలుంబ్రాధీశుఁడు చూచి "నీ
జనకుం డక్కట! ధర్మము విడిచి రాజ్యంబందు నిన్నుంచుమీ!
యన నాఁడో మఱునాఁడొ చచ్చు; నపు డే లా యామహీనాథు నా
జ్ఞ
జ్ఞ నిరోధింప నటంచు మంచిదని శీ ♦ ర్షంబూఁచి దాఁటించితి.
మ॥ అటుగాకుండిన నాప్రతాపుఁ డఖిలమ్మోధీశ్వరుల్ గొల్వఁగాఁ
బటుదర్పంబున సౌర్వభౌముఁడగుచుకోబాలించునక్ మాట నీ
కెటుల స్త్రీని ని లేదు! బంధువులు భూమీశుల్ హితుల్ భూజనం
బెటుమాన్పగల! రమ్మహాత్ముని బలం బేమంచు భావించితో!
•
మః అతిపూజ్యంబని తండ్రియానతికి శీర్షంబొగ్గి కూర్చెండెఁగా!
కతఁడే రేఁగిన దేవదైత్యులకు శక్యంబౌనె వారింప! ని
చ్చతురంభోనిధి సంవృతాఖిలమహీ చక్రంబును భస్మసా
త్కృతము జేయఁడె! కుయ్యొ మొజొయనిన దిక్కుడ దామీఁదట.
సీ॥ జననమాదిగ వేయి కనులతో నాతని వీరవర్తనముఁ గన్పెట్టియుందు!
రవికులోద్భవ రాజ 4. రాజశిరోమణి క్యాదగ్గ గుణకోటి 4.కల దతనికి!
4:
231
238
234
235
236
237</p>
<pb n="85" />
<p>పసింహచరిత్ర.
మేవాడఖనిని జ ౪ న్మించిన మణులలో నింతతేజముగలదేది లేదు!
చిత్తూరురాజ్యల , క్ష్మీ భాగ్యవశమున నేకలింగేశుఁడే యిట్లు వొడమె!
గీ! నుర్వి రవిచంద్రతారక . లుండుదాఁక నవతరింపఁబోఁ డట్టి మ + హామహుండు!
కోటి బ్రహ్మాండములనైనఁ గోట మీటి పట్టభద్రుని జేతు! నా ప్రాణమాన..
మ అనిశోత్సాహపరాక్రమస్ఫురణ రాజ్యంబేలె! సంగ్రామసిం
హునివెన్క్ బలహీనుఁ డయ్యుదయసిం హుం డెక్కి రాకుండఁ దీ
ప్రనితాంతా ప్రతిమపతాపుఁడు పతాపస్వామి సింహాసనం
బునఁ గూర్చుండియెయున్నఁ జిత్తురు పురికాబోఁగొట్టి యిట్లేస్తుమే!
ఉ!! ఏమని రాజ్యభారము వ హించెనో, నాఁటనుగోలె ముప్పు లే
సీమకుఁ దెచ్చె; యుద్ధమనఁ జేటెడు గుండెలుగాఁగఁ బాజె నూ
తామడ; కాలమెట్లొచనె; నాతఁడు మేలనిపింతువీవు; నీ
ఱో మహిరాజ్య మాకొఱవి తోఁ దలగోఁకిన యట్టులుండదే!
ఉ ఇప్పటి దేశకాలముల నెంచిన నప్రతిమానశౌర్యుఁడా
యొప్పులకుప్ప సర్వసుగుణోన్నతుఁ డింకఁ బ్రతాపుఁడొక్కఁడే
తప్పక రాజుగా నిలువ 4 దార్ధ్యము గల్గిన బుద్ధిశాలి! ని
న్నిప్పుడు నిల్పిన జెఱతువేమియుఁ జేతికిఁ జిక్కకుండఁగ.
ఉ॥ కాన మదీయబోధనముఁ గైకొని ప్రక్కకురమ్ము; మాగ్యము
మంచియుఁ జెడ్డ యెఱుంగనట్టి య
సాఁగవు; పొమ్మిక నన్ను వీడి; యే
ప్ర
MfTV
మాను"మటన్న లోకమున
జ్ఞాని యతుడు "నీనుడులు
మైనను సింహపీఠి విడి యవ్వలి కేగ నొకింతయేనియు.
మ॥
మ జనకుం డాజ్ఞయొసంగె; నక్క తన రాజస్థానసింహాసనం
బునఁ గూర్చుండఁగ నేనె యగ్ధుఁడ నను
బోనాడుచుకో బ్రక్కకం
పిన సామంతులు భూజనుల్ కినిసి యిడ్డే నిన్ను శిక్షింతు; గొ
క్కనివీ విందఱ నేమిచే సెదవొ! చక్కర్ జూతుగా కియ్యెడ .
శా! ఏమయ్యా! యిటు చూచుచుండెద రిదే మీ చోద్య! మాడుగులెం
తో మేలే! యొకయక్రమంబు తముకన్నుల్ చూడఁగా సాగనీ;
రేమో యీతఁడు వ్రేల భీతిఁగొనఁగా నేలా! యదల్పుండు; మీఠా
కేమేఁ బ్రాణభయంబు గల్గినను నే నిందుండి కాపాడెదళ్.
24
24
24
.
24</p>
<pb n="86" />
<p>ప్రథమాశ్వాసము.
ఉ॥ ఈనిన సింహమట్లు పయి కీతఁడు దూఁకెడి నమ్మచెల్ల! వృ
దైన
న యొకండు తానె బలమంతగఁ జూపిన మీరు పల్వు రెం
తేనియుఁ బట్టుపట్టినను 4 నెంతలు పుట్టునొ! వ్రేలు వాఁచి రో
లైనను రోలు వాఁచినఁ గటా! మితియుక్" మఱి మేర యుండు నే."
—*) సలుంబ్రా కృష్ణసింహవిభుఁడు కోపోద్దీపితుఁడగుట. (*
"
మ॥ అని పీఠమ్మున వెన్క నానుకొని సౌ ఖ్యాసీ నుఁడొ నాతని
గని కృష్ణుండును "మేలు, తాతకును ద గ్గ్ నేర్పు ధీశాలివౌ
మనుమం డై తివి; వీరలందఱు నిను బట్టాభిషిక్తు బో'న
ర్చి ననుక్ దాఁకెడువారె! నీకుఁబలె వారి వెఱియుక్ సోఁకెనే!
శా॥ రాణాల బొనరించు బాధ్యత సలుంబ్రావారిదక్ మాట యీ
క్షణిక్ గల్గిన వారెఱుంగఁగల; రచ్చో నేఁ బ్రతాపు మహా
రాణాగా నొనరింతుఁ; గూడదను ధీరగ్రామణుల్ గల్గినక్
బాణి బై కెగ నెత్తుఁ; డిప్పుడే యెదు ర వత్తు నత్యుద్ధతి..
మ॥ ఇది నాయింటికి నాదు వాకిలికినై యేఁజేయు కార్యం బె! యి
య్యదన యోగ్యు సమర్థు భూధవుని జే యక్ నిత్యకల్యాణముల్
*
పొదలక్ రాజ్యము సౌఖ్యముక్ గనెడి; నట్లుక్ గాని చోఁ జెందు నా
పద; యప్పాపము పెద్ద పేర్లలరు వ్యాపించు మాబోంట్లకు.
మ॥ పనియే మొక్కరితోడ నాకిఁక! సలుంబ్రాకృష్ణుఁ డన్యాయముల్
తనమ్రోల జరుగంగ నోర్వఁడని పెద్దల్ చేయు నాశీస్సుకే
వినయం బూ నెద; నిన్నుఁగాని మఱియుక్ వేజెవ్వరిక్ గాని మ
న్ననలజేయఁ; బ్రతాపుని బతిగ సంస్థాపింతు మేవాడకుక్.
ఉ॥ మెత్తని మంచిమాట లివి; మేలని వైళమ
రమ్ము; లే
దిత్తఱి లేవనన్న నిను నెత్తుచు దూరము చేర్తు" నన్న న
య్యుత్తముఁ డితయు గదల కుండినఁ గృష్ణవిభుండు చేతితో
నెత్తి మృగేంద్రపీఠి విడి యేగఁగఁజేసెను బట్టి త్రోయుచుకో.
ఉ॥ త్రోసిన నేమి చేయుటకుఁ దోఁపక యాజగమల్లుఁ డీసును
రోసము తగ్గిలంప వడి రోజుచుఁ గేసరిరాజు చేతిలో
45
245
246
247
248
249
250</p>
<pb n="87" />
<p>రాణా ప్రతాపసింహచరిత్ర.
కాకికి బాని:దప్పుకొను కైవడిఁ గానని గొఱ్ఱమాడ్కి
లో సభవీడి యశ్రుతత .లోచనుఁడై చనె బీదమోముతో,
మ. "ఆవకాః యెంతటి పూజ్యచిత్తుఁడు సలుంబ్రాధీశుఁ! డీ వేళలో
కాశంబు లభించుమాత్రమున న న్యాయంబు వారించి ని
కువ మేపారఁగ 'సింహపీఠముపయికి గూర్చుండ యోగ్యుండు భూ
ధమన్యుడు ప్రతాపుఁడే' యనియె నిర్దాక్షిణ్యచిత్తంబున.
చ అమ్మతంబుక్ మలయాద్రిమందపవనం బద్దంబులు స్వచ్ఛభా
వము: గోల్పోయినఁ బోవవచ్చును! సలుంబ్రాకృష్ణు మాలిన్యలే
శమును సోఁకదటం చెఱింగియు నజ స్రస్వచ్ఛ మాధీకు చి
__మును దప్ప దలంచియుంటి మహారాధంటయ్యె! నెం తేనియుక్.
చః వనితలఁజేరి వంటయిలు వాయని యాజగమల్లు వీడి మా
హరించినట్టి యభిమానధురంధరు విక్రమైకవ
రు రవి వంశ వర్ధనుఁ బ్రతాపు ధరాధిపుఁ జేయనుండెడి!
మరియెకుఁగాత మీతఁ డతి మానుషకీర్తి సహస్రవర్ష ముల్"
46
నా
-{ నలుు బ్రాకృష్ణసింహవిభుఁడు సింహాసన మధిష్ఠింపుమని
ప్రతాపసింహుని బ్రార్థించుట.
}
* ఆరంభంబుననుండి నీపయిన నా యాశాభరంబెల్ల దై
వాక్ు; నాగు విన్న పంబుఁగొని రాజ్యశ్రీని దోస్తంభ కే
*
951
25%
25%
254.
♦
మ. అని నామంత్రులు భూప్రజాళులు సలుంబ్రాధీశు వేనోళ్లఁ గీ
క్తశముల్ సేయ ""శుభాభిషేకము నొనర్పక్ బోదము" చందఱక్
వెంబర్ గొని కృష్ణసింహుఁడును నా స్థానంబునందుండి భూ
పనివాసంబునుజేరి యచ్చటఁ బ్రతా పస్వామికిక్ మ్రొక్కుచుక్,
కష్టకాఖ్యము :క్క గతిఁజూతు! యుద్ధ ముగాది పండుగయట్లు గాంచుచుందు!
వాహశికాగ్రత స్పభుఁడవు! పరుల బాధలు చూచి యోర్వ నీ
వీరపూజ్యము నీయు శ్రీ దారత దేవ! నీ తండ్రి మార్బ్యముగాఁగ
జ్యేష్ఠపుత్రుఁడబౌటఁ * జెండఁగావలయు మేవాదేశ సామ్రాజ్య భరముఁ బాపి
-రుద్రును నెత్తికెత్తుకుమారుఁడనుచు నల్ల జగమల్లున కొసంగుమనియె! నప్పు
కుఱుక వాదేల యని తల • యూఁచియుంటి! సమయమైనపు చూచుకొందమనితలఁచి
.
తరముగాదు!
దప్పఁదలఁచి
255</p>
<pb n="88" />
<p>ప్ర థ మాశ్వా స ము.
శ్రీరంగంబున నిల్పి ధర్మమునఁ బాలింప బ్రయత్నింపు పు
ప్పారామంబటు సౌఖ్యసౌరభములు వ్యాపింప దేశమ్మునథ్."
మ॥ అని వాక్రుచ్చిన నాప్రతాపుఁడు సలుంబ్రాధీశు వీక్షించి "మ
జ్జనకాభీష్టముఁ దీర్పకుండినను నా చంద్రార్క ముగ్రాపకీ
ర్తిని నేనొంద నె! ధర్మదూరగుఁడనై దేవేంద్రభోగంబుల
గనుకంటేజ్ నిరుపేదనై మనుట యోగ్యంబంచు భావించెదక్.
ఉ॥ ధారిణిరాజ్యము స్థిరమె! శ్రీ ధర్మము దేవునియట్లు సుస్థిరం
2
బై రహియించు; ధర్మమును నాదట మీఱఁగనోపఁ! దండ్రికి
మారటతండ్రి! వందఱకు మాన్యుఁడ వీవొనరించు నాజ్ఞ
దూరము సేయనోప! నెటు తోఁపక చిత్తము త తరించెడు .
చ॥ మృమహృదయుండు మాజనకుఁ డెప్పుడు నీమమహాభుజంబె యా
స్పదముగ రాజ్యమేలెను! భ వత్కృప సుంత తొలంగియున్న ని
య్యుదయపురంబును నిలిచి యుండదు! మేమును నిల్చియుండ! మో
సదయ! భవన్మహోపకృతి, సర్వజగన్నుతిపాత్రమై తగు"
చ అని యెటుచేయఁదోఁప కిటు లాడు ప్రతాపుని జూచి "దేవుఁడే
నిను సృజియించె సర్వధరణీస్థలికి బతిగాఁ జ్యేష్ఠనం
దనునిగ; నీవు రాజగుటె ధర్మము; భూప్రజ యే యుదా త్తవ
ర్తను వరియించునో యతఁడె రాజుగ నిల్చుట యెదుఁ క్రొత్తయే!"
మ॥ అని కృష్ణుండు వచించిచూడఁగనె య పందున్న సామంతులు
+
జను లొక్కుమ్మడి నైకకంఠ్యముగ "రాజస్థానసింహాసనం
బునఁ గూర్చుండి ప్రతాపుఁడే నృపతియై పూర్ణప్రజామోదము
.
గని పాలించెడుఁగాక నిర్మలయశః కల్యాణముల్ చేకుర.
శా॥ మేమై కోరు ప్రతాపుని విడుచుచు మేలంచు నీవల్ల సు
శ్రాముక్ దెచ్చిన శౌరిఁ దెచ్చిన సమాధానంబు మాకుండ దే
మో! మమ్మందఱ నుద్ధరించుననుచు నీ ముందెంత కాలంబుగా
నో మాకున్నవి కోర్కె! లి స్థితని నో హో! వీడఁగా నేర్తుమే
లి
ఉ॥ ఎప్పు డితండు రాజగునొ! యెప్పుడు కన్నులవిందుగాఁగ మా
యప్పను జూతుమో! యనెడియాసలు కొండలువోలె నుండు! నీ
51
ల
UE
OM
47.
257
258
259
290
261
262
263</p>
<pb n="89" />
<p>రాణా ప్రతాపసింహచరిత్ర.
యొప్పమి నేమియు బలుక నోడితి: మింతకు నీప్రతాపుఁడే
తప్పక రాజుగావలయుఁ! । దప్పదు! తప్ప"దటంచుఁ బల్కినక్;
చ॥ "కనుఁగొనినాఁడవే ప్రజల కౌతుక! మిందఱకోర్కె త్రోసివే
యనగునె! సన్ముహూర్తము ర యంబున డాసే! శుభాభిషేకము
బొనరుతు! మాజ్ఞ సేయుఁ"డని మ్రొక్కి వచించెడు కృష్ణసింహు ప్రా
ర్థనమును ద్రోయఁజాలక ప్రతాపుడు సమ్మతిఁజూపె నయ్యెడర్.
: 48
264
PAW
265
—*) ప్రతాపసింహుని పట్టాభిషేక మహోత్సవము. (*—
క॥ కొంగులముడి యలరఁగ బంగరుపీటల విభుండు పాటేశ్వరియుక్
జెంగటను నమరసింహుఁ డనంగ నిభుఁడు గూరుచుండి రతిహర్షమునక్..
మ॥ హరభట్టారకముఖ్యభూసురులు మంత్రానీకముల్ పల్కి బం
గరు కుంభంబులనుండు వార్థి జలము గంగాపవిత్రాంబు ల
బ్బురముక్ గొల్పఁ బ్రతాపసింహునకునైమూర్దాభిషేకంబు చే
సిరి సంపూర్ణ విశుద్ధచి త్తముల నా శీర్వాదముల్ చేయుచుకో.
సీ॥ సౌరభ సురభిళ వారిపూరమ్ముల జలకంబుఁ దీఱిచి, జలుఁగుఁబట్టు
ణ
వలువలు ధరియించి, తలను ముత్తెపుసరుల్ కలకలలాడు పాగా ధరించి,
విలువవజ్రాల సొ । మ్ములు మేననిడి, సుగంధద్రవ్యములను గాత్రమున నలఁది,
మందారకుసుమదా ! మము వక్షమునఁ దాల్చి, సూర్యదేవుని మ్రొక్కి, స్తుతులొనర్చి,
గీ॥ యేకలింగేశ్వరుపదంబు లెదఁ దలంచి, భక్తి మెయి భవానీదేవిఁ బ్రస్తుతించి,
గురుల హరిచంద్రభట్టారకులను గొలిచి, యాప్రతాపుఁ, డాస్థానము నందుఁ జేరె.
ఈ పరిఫుల్ల రుచిర సరసిజ పరంపరలు నెఱపి నటు సభాభవనం బ
ప్పురజనముల నెమ్మోములఁ బరమామోదమున నపుడు భాసిలుచుండెక్. 269
సీ॥ దైవజ్ఞమణులు త । దేవలగ్నంబంచు సమయంబు చూచి హె । చ్చరిక చేయ
వేదభూసురులు దేవీంవాచమరు ముత్ర ముచ్చైస్స్వనమున వాకుచ్చు చుండఁ
జారణుల్ పూర్వమ హీరమణాభిషేక ప్రసంగములు వేడ్కను బఠివ!
వందులు జయజయ ధ్వాన పూర్వముగఁ బంతా పశబ్దమ్ము సందడిగఁబొగడఁ:
గీ జంద్రభట్టారకుండు రసంబుగురియు పెక్కు కల్యాణ వృత్తముల్ ప్రీతిఁజదువ!
నెంతసంతోషభర మొకో! యెవరెఱుఁగుదు! రందఱును మేను మఱచుచు నవశులైరి
266
267
1
:
:</p>
<pb n="90" />
<p>ప్రథమాశ్వా స ము,
•
కలనాదం బలరఁగ, మంగళ తూర్యములెల్ల మ్రోఁగ, గాయకులును బా
టలు పాడ, నాప్రతాపుఁడు కొలువున సింహాసనమునఁ గూర్చుండె నొగిక్.
♦
ఆమహోన్నతశుభసమయమున హర్ష సరభసములై న బహుళ హస్తములనుండి
యాసభాస్థలి నపుడె పె లాక్రమించి కురిసె మెఱుఁగారు బంగారు విరులవాన. 272
బంగురు, బళ్ళెరమున జవాది పునుఁగు పచ్చికస్తురి మెదిపియుఁ దెచ్చి యియ్య.
నాపతాపుని వికసితాస్యంబునందుఁ దిలకమును సలుంబ్రాభర్త దిద్దె నపుడు.
అమితోత్సాహముతో ఫణీశ్వరుని చాయక్ వెల్గు దుద్దాంతఖ
డ్గము మధ్యంబునఁ గట్టి రత్ననివహా క్రాంతంబునౌ రాజదం
డము హ స్తంబున కిచ్చి హాటక కిరీటంబు దెసల్ నిండు తే
జముతోడ మిఱుమిట్లుగొల్పఁగను సం స్థాపించె మూర్ధమ్మునక్.
"భరియింప౯ గలఁ డీత్రాపుఁడిఁక మేవాడ్ దేశసామ్రాజ్య; మి
త్తఱి రాణానొనరించితి; బజలు శ్రద్ధాభక్తు లేపార
పురుష శ్రేష్ఠుని గొల్వుఁడీ" యని కరంబుల్ మోడ్చి ముమ్మాటులు
ధర పై ఁజాగి నమస్కృతుల్ సలిపె నా నందాబ్ధి నిర్న గ్నుఁడై.
'గొడుగు పట్టినట్టులు చల్వ గూర్ప నేర్చు! రామరాజ్య మీతని "దని ప్రచురపఱుపఁ
బట్టిరి సితాతపత్ప్ర; మ । ప్పట్లఁ గదలెఁ జామరగాహిణుల హేమ చామరములు.
సూధ రేంద్రపుత్రికఁబోలు పుణ్యసతులు దొడ్డముత్తైదువలు హస్త తోయజముల
వరుస బంగారు దీపాల పళ్లెరములతో నివాళించి రపుడు భూజూని నచట. 277
రత్నముల నొక్క కనకపాత్రమునఁబోసి హారతుల నెత్తి యంగన లవనిఁ బోసి;
రవి వెలిఁగె నాకసమునిండ నలముకొనిన వివిధ తారకా కోరకవితతి మాడ్కి.
అంతట నొక్క రొక్కరుగ నానృపశేఖరు పాద పంకజ
ప్రాంతముఁ జేరఁబోయి వినయమ్మలరార నమస్కరించి సా
మంతులు భూజనంబులు క్రమమ్మున వస్త్రములు
కొంతరలాడఁ గాన్కలిడి తోరపు హర్షము లొంది రయ్యెడం.
విభూషలు
హరభట్టారకుఁ జంద్రభట్టకవి వస్త్రాలంకృతుల్ పెట్టుచుకో
రితోషింపఁగఁజేసి యల్లన సలుంబ్రా స్వామికి మ్రొక్కి
చండక్షమానాథు శ్రీ
వర
రణాబ్దంబులు నాకు సేవ్యములు మా
వరణంబుల్ వలె" నంచుఁ బీఠమున హర్షం బొప్పనాసీనుఁడై,
a
49
271
274
275
279</p>
<pb n="91" />
<p>Oహచరిత్ర
మ। "పువులు బూచి సమస్తభూతలము నవ్వుక్ గొల్పెనక్ : మాడ్కి నూ
త్నవికాసస్ఫరణంబు వెంటఁగొని చైత్రంబు బ్రవేశించె; రా
#వహంబుల్ ప్రజ లేగుదేరఁగ భవా నీమాతకు బ్రీతిగాఁ
!
గ వరాహంబుల వేఁటలాడ నరుగం గా నెంచితిక్ గానకు."
50
ణా ప్ర
లౌ
13
a2
"
మ॥ అని తేఁడాడినఁ గృష్ణసింహుఁడును "దేవా! చైత్రమాసోదయం
బున నూత్నంబుగఁ బట్టభదు లయిన ఫ్లూ వేఁటకై కానకు
జను టాచారము తొలనుండియు; భవ చాపంబున నేఁడు గూ
లిన సత్వంబులఁ బట్టి భావిఫలములెక్కింత్రు క్షోణీజనుల్.
.
26
—*) పట్టభద్రుఁడయిన ప్రతాపసింహుని సాగరసింహుఁ డాక్షేపించుట. (*
చ। ఇది శుభసూచనం బిపుడె యేగుద" మంచన నెల్లవారు నొ
ప్పెదమనునంత గోడపయిఁ బిల్లి విధంబున దూఁకి సాగరుం
డెదురయివచ్చి "యేటిపని! యెచ్చటి కేగెదు! రాజ్యలాభముల్
గుది రేనటంచు సంతసము గొప్పగఁ గల్గెనె! నీకు నియ్యెడ౯.
మ॥ అర రే! యాజగమల్లుఁ బోఁదరిమి య న్యాయబుమై ధారణీ
భరముక్ గొంటివి; మంచి చెడ్డ లవి దోఁప లేదె! యేచట్టఁపుం
బరిపాటిక్ వహియించి చేసితివొ! వహ్వా! నేఁటి నీ సేఁత యె
వ్వరికిక్ శక్తి యెసంగు వారె నృపుల౯ భంగిక్ నిరూపిం చెడీజ్ .
చ ఇది కొఱమాలినట్టి పని యింతటి దుర్ణయము గనంగ నా
హృదయము నిల్వలేను; నిను నిందలనుండియు సుంత యవ్వలకొ
గదలఁగనీను; నన్నుఁ గడ గాఁ దొలఁగించి యభీష్టకార్య మిం
పొదవఁగ దీర్పు; మేను మని యుండిన సాఁగవు నీపయత్న ముల్."
చు అని యాతండు సరోష దృష్టిని సలుం బాధీశ్వరు జూచి "యే
మనఁగావచ్చును నిన్ను! నేఁడిచట నన్యాయంబు నీవల్ల నే
జనియిచెక్ జుమి; యిప్పు డేమనుచు మెచ్చజేతో! లోకం బిపీ
యనదే నిన్గని; స్వామిభక్తి యనఁ గట్టా! యిట్టిదై యుండునే!
గీ! పాసపూర్వాక్షరమునందు వలె సమస్త గుణగణంబులు నీయందుఁ గొఱఁత లేక
యలరవలెఁగాక! యుఱక నిన్న నుసరించు నతని నననేటి కోఫలుంబ్రాధినాథ!"
28
28</p>
<pb n="92" />
<p>ప్రథమాశ్వాసము.
*) సలుంబ్రాకృష్ణసింహవిభుఁడు సాగరసింహునకు హితము నుపదేశించుట. (*
చః అనుచుఁ తాపుఁజేరఁజను నాతనిఁ గగ్గోని కృష్ణసింగు "నీ
కా
వనుజుఁడ వమ్మహాపభున; కాయన నిందఱలోన నిప్పు డి
ట్లనుచు నిరోధము సలుప న్యాయమె! శత్రువులెవ్వ రిప
దని యెదిరింప నియ్యదియు నార్యులు మెచ్చెడి మేటికార్యమే!
చ॥ కలకలలాడుచున్న సభ్య గల్గిన లోకుల మోములెల్ల ము
గలములమాడ్కి నైన వివెకల్గెను దారుణమైన నీకు మా
టలు వినినంత; కోపము విడజను నిత్తఱి; శాంత మూనఁగాఁ
గలిగిన మేలు సుమ్మిపుడు; గడ్డము పట్టి వచింతు సాగరా!
మ॥ మనమందు గల కౌర్యముక్ విడువు; నా మాటక్ మది న్నిల్పు; పా
వన గంగాఝర వారిపూరముల వి ప్రశ్రేణి మూర్థాభిషే
చనము జేసిన యిమ్మహాత్ముని పదాబ్దంబుల్ తలక్ సోఁక నొ
క్క నమస్కారము చేయు; మీతఁడు నమస్కారార్హఁ డెవ్వారికి.
క॥ సరళమతి యోజింపుము; పొరవడకుము; వినవె! 'పితృసమో జ్యేష్ఠ' యనక్;
గురుఁ డుదయసింహుతో నిప్పురుష వరుఁడు సముఁడు నీకుఁ బూర్వజుఁ డగుటక్. 291
చ॥ కలుగఁగఁజేయఁబోకుసుమి గందరగోళము; విన్ము నీను మా
ట లితని సద్గుణంబుఁ బొగడదగు; నిందకుఁ బన్కి రావు; చే
తు లితనిపాదముల్ నిలుపఁ దోరఁపుఁ బాదుకలైనఁ జెల్లుఁ; గ
త్తులుగొని తాఁక దోషమగుఁ; దోఁచిన యంతయు నీకుఁ జెప్పితి౯."
చ అని వినయమ్మునుక్ నయము
చ
నాదర మొప్పఁగఁ గృష్ణసింగు ప
ల్కిన విని సాగరుండును జ లింపక "ధర్మ మొకండె నేను గో
రిన; దది వీడి వీను లల రించెడు నీతు లివేల! తెల్పు మే
మనెదొ ప్ర్రతాప! నీ విపుడు న్యాయము నిల్పెదొ! ప్రక్క కేగెదో!
చ॥ స్థిర గుణమాన్యుఁ డయ్యుదయ సింహమహీరమణాగ్రగణ్యుఁ డం
దఱను సమంబుగాఁ గనిన తండ్రి; కుమారుల యోగ్యతాపరం
పరల నెఱింగి రాజు జగ మల్లును జేయఁగ నాన తిచ్చె; న
ప్పరమపవిత్రమానేసుని పల్కు ను నిల్పుట పుత్రధర్మమా.
1
EN.
288
289
290
292
293
294</p>
<pb n="93" />
<p>ణాప్రతాపసింహ చరిత్ర.
గీH
ఇరువదై దుగురైన భ్రాతృవరులందు జ్యేష్ఠుఁడవు! ప్రపంచముత్రోవ లెఱుఁగువాఁడ!
వనుచితంబని తోఁపక + యనుజు సొమ్ము నపహరించితి! వింత య త్యాళ తగునె
సీ॥ కనుమూసి గుడ్డక ౪ ట్టిన దేమి లేదు; సమస్తభూపజయు సామంతనృపులు
పరికించు నెడఁ ಬಟ್ಟ * పగటివేళను దండ్రి "జగమల్లు రారాజు సలుపుఁ" డనుచు
గొంతెత్తి యనె; నందుఁ గూడిన వారెల్లఁ దల లూఁచి; రిపుడు నీ దండఁ జేరి
ప్రియభాషలాడు నీ శ్రీ కృష్ణసిం గానాఁడు చిత్తంబని కరంబు . శిరము వంచె;
గీ నేఁడుగద రాజరాజుల నిర్ణయించు దొడ్డయధికార మితని చేతులకుఁ జిక్కె!
విూర లిరువు రేకతమున మెదిపి మెదిపి కార్య మిటు త్రిప్పియుంటిరి కట్టకడకు .2%
చ॥ ఇఁక నొక వేయుమాటలఁ బనేమి! యిదే జగమల్లు రాజుఁ జే
యక జనకాజ్ఞవిఱుచు దు । రాశ ధ రేశత సంగ్రహించు నీ
వకట! మదీయవాక్యముల నాదృతి నుంతువె! తల్లిఁ జంపువా
నికిఁ బినతల్లి చేతులు గణింపఁ జివుళ్ళను చొప్పెఱుఁగవే.!
ఉ॥ ముందొకఁడాడి వెన్న-కును బోయి మఱక్కగతిక్ జరించు నా
చందము లెఫ్టి నేనెఱుఁగ; స్వాంతము విప్పివచింతుఁ; దండ్రియా
జ్ఞం దలఁదాల్చి భూరమణు సల్పుము మా జగమల్లు; లేనిచో
నిందలు గల్గుఁ; గష్టములు నీకును బెక్కులు వచ్చు నియ్యెడ ."
చ అని బిరుసెక్కు చూపులను నందఱఁ జూ చెడు తమ్మునిక్ గనుం
గొనుచుఁ బ్రతాపుఁ "డోకొమర! కూడునె తొందర! మంచి చెడ్డల
మనమున నిర్ణయించి జగ మల్లుని యోగ్యత నెంచి పౌరు లె
శ్రీ
ల్ల నుడువు మాటలెంచి యిటు లక్ బొనరించితి సుమ్ము సాగరా!.
ఎఱుఁగుదు నే మన మిరువదై దుగురలో జగమల్లునకుఁ దండ్రి మిగులఁ గూర్చు!
టెఱుఁగు దాతని వసుధేశుఁ జేయుఁడటంచు మనతండ్రి సృపులతో ననిన తెఱఁగు!
నెఱుఁగుదు నెదురాడ . కెల్లగు మంచిదం దొకమా థఁదల లూఁచుటయును
నెఱుఁగుదు జగమల్లుఁ । డెప్లైన మేవాణ్మహోర్వి నేలెదనంచు నూఁగుటయును!
•
॥ నిన్ని యెఱిఁగియె నా పైన నెసఁగు భార మవలఁజ నెనంచు. నాబూ శిఖాగ్రసీమ
నేకలింగేశు చరణనాళీకయుగము నెడఁదఁ గొలుచు నుపాయంబునెఱిఁగియుంటి.
.
52
g
291
13
· 298
299
I అతిపూజ్యుఁ డుదయసిం హ ఖ్మావరోత్తును కొడుకులలోఁ బెద్ద * కొడుకనౌట!
మారట తండ్రి స । న్మాన్యుఁడీ కృష్ణ భూజాని యానతి మీఱ శ్రీ రాని దగుట! .
♦
.</p>
<pb n="94" />
<p>ప్రథమాశ్వాసము.
సామంత మండలే । శముఖు లేక గ్రీవముగను సింహాసనం బునకుఁ గోరఁ. !
బ్రస్తుతస్థితిని నీ నీ పాలన లేకున్నఁ జెడుదు" మంచని పౌరు లడలు చుండ !
నిన్ని కష్టసుఖంబుల నెంచి యెంచి విముఖమై యున్న మనసును వెనుకఁ ద్రిప్పి
యన్నరో! పట్టభద్రుండ నైతిఁ; గాని కోరి భారంబు తలను గైకొనఁగలేదు. 801
గీ॥
:
చ॥ మన జనకుండు ధాత్రి జగ మల్లున కిచ్చె నటంచు విన్నయం
తనె "తొలఁగె౯ దల౯గలుగుతద్దయు భారము; నే స్వతంత్ర జీ
వనమును నెందుఁగాని జర పక్గల; దేవుఁడు కూర్మిఁ జూచెఁ బొ"
మ్మని మది యుబ్బి పోవునటు హర్షముఁ గాంచితి సుమ్ము సోదరా!
శా॥ ఈ మేవాడ నివాసము దవిలి నేనిందున్న ష్ ణీజనం
కొ
'53
ఆ బేమాడ్కి దలపోయునో మది నటంచే 'పర్షియా' చేరి యా
'భామాసాహి' పదాంబుజంబులకడ వర్తింపఁ గాంక్షించి యి
ప్డే మున్ముందు ప్రయాణము సలుప నుంటిక్ గంటకు ముందట".
ఉ॥ అప్పుడు కృష్ణసింహుఁడు ప్రజాళి నృపాళియు వెంటరాఁగ నే
ర్పొప్పఁగ వచ్చి "యూర కిటు లుండఁగ నేటికి! లేచి రమ్ము! నీ
విప్పృథిపీతలంబుఁ గొని యేల వలెక్ జుమి! నీవు తప్ప మా
యప్ప! యొరుల్ మహీరమణు లైనను రాజ్యము నిల్వ దీయెడ."
చ॥ అని యభిషేకముక్` సలిపి . యఙ్ఞ దుకూలముఁ గట్టఁ జేయుచుకో
గొని యిటు తెచ్చెఁ; బౌరులును "గూడదు కాదిక సింహపీఠమం
30!
3)3
804
It has been said that the brahmanical religion was foreign to India, but
as to the period of importation we have but loose assertion. We can easily give
credit to various creeds and tenets of faiths being from time to time incorporated
ere the present books were compcsed; and that previously the sons of royalty alone,
possessed the office. Authorities of weight inform us of these grafts for instance,
Mr. Colebrook gives a passage in his "Indian classes." "A chief of the twice born
tribe was brought by Vishnu's eagle, from 'Saca Dwipa.' By Saca-Dwipa, Scythi
is understood of which more will be said hereafter. Ferista also translating from
ancient authorities says to the same effect, that in the reign of Mahrage, King
Kanooj, a brahmin came from Persia, who introduced magic, idolatry and
worship of the stars, so that there is no want of authority for the introduction
new tenets of faith.
"Annals of Mewar."</p>
<pb n="95" />
<p>54
ప్రతాపసింహచరిత్ర.
దున వసియింపుమీ" యనినఁ ద్రోయఁగఁజాలక విజ్ఞు లాజ్ఞ చే
సిన యటు సింహపీఠిని వసించితి దేశము సేమ మెంచుచుకో.
b
Ph
మః పరమోత్కృష్టమృదుస్వభావుఁడు సలుం బ్రాస్వామి! యీధన్యు భా
♦
h
స్వర కారుణ్య కళా విశేషమున మే వాల్లక్ష్మీ శోభా పరం
పరలక్షా గోల్పడ కున్న దిప్పటికి! రా
గరుని దూఱుచు వ్రేళ్లు చూపి యఱవం
♦
ణ్మందారుఁ డిప్పుణ్యసా
గాఁ బాడియే! నీకిటక్.
మః ఎఱుఁగకయుందువొక్కొ! పురుటింటినిఁ బాయనిదాది తండ్రిన్ి
మఱువఁగఁజేసి యీభువన మాన్యుఁడు నన్నును నిన్నుఁ దమ్ములు
దఱఁ గొని యంతవారలను దద్దయుఁ బెద్దలఁ జేసి పెచె; నొ
క్కరుఁ చెదురైన నేఁటికిని గౌఁగిటఁ జేరుచుఁ దండ్రి భంగిగ౯.
30
గీ దుర్గమారణ్యములు చ్చే త్రుంపుమనుచుఁ దండ్రి పంపఁడె సూక్తు! నా తఁడు చిగారు
కైసలుంబ్రాపురమున సౌఖ్యమునమనుట యెవరిబలమూని! యీధన్యు కృపను గా!
క! పౌరుల సేమంబును జోణీ రాజ్యము సేమములును • నీ సేమం బా
ధీరుఁడెఱుంగు; నెఱుఁగఁగ నేర! వతఁడె తల్లి తండ్రి నీకు నాకు.
వ: కనముత్తాత యొకపు చండవిభుఁడాత్మత్యాగము జేసి త
మ్మునికై రాజ్యము వీ డెఁ; దజ్జనకుఁ డ పూజ్యుక్ సలుంబ్రాభు
^^^నరించె; దముదారవంశము యశంబుక్ బొంద జన్మించే ని
య్యనఘు:డుక్" మనతాతచందమునఁ బూజార్హుండు ముమ్మాటికీళ.
హిమ:కరునందుఁ గందుగల! దీశు గళంబున నల్పెసుగుఁ! బం
కము కమలంబు నంటుకొనుఁ! గాని జగంబులు క్రుంగిన గిం
ద్రము లవి బెండుదేలినను • ధన్యచరిత్రుఁడు కృష్ణసింగు స్వాం
తమునను గందొకించుకయుఁ దార్కొననేగదు! కోటి చెప్పినక్.
నేను నృపుఁడనై యీతని నెత్తిఁ బెద్ద మకుట మిడలేదు; మఱి జగ । మల్లుఁ డవని
నాథుఁడయి తీయునది లేదు; శ్రీ నడుమఁజిక్కి పరులచే నాఱుదూఱును । బడుట తక్క
చః జనకుఁడు పెద్దకాలము రు జా పరిపీడితుఁడౌట
.
31
30
నెట్టుల
మనమున నిర్ణయించెనో! కు 4 మారులలోఁ బ్రథముండు తండ్రి పో
యిన పిదపక్ ధరావలయమేలుట యెందును లేదె!
వై పకీ
త్వనియతి నేఁడు పుట్టెనె! క టా! యిది లోకము పాడియే కదా!
30
30%
3:
31</p>
<pb n="96" />
<p>ప్రథమాశ్వాసము.
.
చ॥ ఇది జనకోటి కిష్టమని యెక్కితి నిత్తఱి సింహపీఠి; ని
య్యదనను నీకు నొక్కనికి స్వాంతము సమ్మతిఁగాంచుకున్న నే
వదలుట యెట్లు సాధ్యమగు! బాలక! నేనిదె శక్తివంచనల్
గోదుకఁగనీక కష్టపడి ! క్షోణిని నేలఁ బ్రయత్న మూ నెదర్."
*) సాగరసింహుఁడు రాణాప్రతాపసింహు నిలువరించుట. (*
చ॥ అనుచుఁ బ్రశాంతరీతిని నయంబును వత్సలతానిరూఢి నె
క్కొనఁగఁ బ్రతాపసింహుఁడనఁ గోపము పట్టఁగ లేక సాగరం
"డనుజుఁడ వంచు మే ల్దలఁచి యాడిన నీతల కెక్క దయ్యె; గా
జ్యనియతిముందు నీతులు వి సుబుగఁ దోఁచెను నీకు నేఁడిటన్.
55
$14
31
సీ॥ బహుకాలముగను మేవార్దేశమేలిన జనకుండు దీర్ఘరు జా ప్రపీడుఁ
డై మెట్టులో నిర్ణయమొనర్చెనట! నతఁ డన్యాయవర్తనుం డంట! యణువు
మొదలుగా బ్రహ్మాండ మును మ్రింగి తేఁచెడు నీకృష్ణసింహుఁ డ స్తోక ధర్మ
* .
నిరతుఁడౌనట! బూర • లిరువురొక్కండయి ధర్మదేవత భారతంబు నుండి
గీ॥ లేవఁగొట్టంగఁ బుట్టు కలిస్వరూపులని తెలిసిఁ! బట్టపగలు ప్రజాళియెదుట
నింద్రజాలమునొనరించి యిట్టులుకనుఁ బ్రామఁగలిగితి! రేమన వచ్చు మిమ్ము.
మ॥ సదయుం డాజగమల్లునిక్ బిలిచి రాజ్యంబిమ్ము; కాని నేఁ
గదనంబందునఁ దాఁకి లోకమలరం గా ద్వంద్వయుద్ధంబు చే
సెద నీతోడ; మదీయమాన సము కించిత్తైన ధర్మంబు మీ
అను; ప్రాణంబు అశాశ్వతంబులగు; ధర్మంబే చిరస్థాయియా.
మ అవనీరాజ్యము నిత్తువో! వివిధశ స్ట్రాస్త్రంబుల దాల్చి యా
హవరంగంబున నన్నుఁ దాఁకెదవొ! యీ యర్థద్వయంబందు నీ
వవలంబింపు మొకండు; లేనియెడ శౌర్యస్ఫూర్తి నిట్టట్టులుకో'
లవ మేని గదలంగనీ! నిపుడె తెల్పక్ బోలు నీభావముక్."
క॥ అని బిఱ్ఱబిగిసి తనమోమునఁ జూడ్కులు నిలిపి యుద్ధ మును గోరెడు త
మ్ముని గనుఁగొనుచుఁ బ్రతాపుం డనె గాంభీర్యప్రధానుఁ డై జనులు విన౯. 319
మః "అడుగైనర్ గదలంగనీని శ్రమమే లా! రాచపుట్టొందు నె
వ్వఁడుగానీ రణమన్నఁ బండుగనుచుగా భావించు; నీయందఱుక్
317
318</p>
<pb n="97" />
<p>ణా ప్రతాపసింహ చరిత్ర.
గడుహర్షంబునఁ దెచ్చి నాపయినఁ జక్కకొనిల్పి రీరాజ్యమ్ు;
గడఁద్రోయక్ జన; దట్టు లౌట రణమే శర్తవ్యమై కన్పడు."
మ అని యజ్ఞప్పుడె మధ్యమందున సలుం బ్రాధీశుఁడు గట్టియుం
చిన నాగేంద్రసమానఖడ్గమునకై చేసా చె; నాసాగరు.
గని సాముతులు భూపజానివహముల్కట్టా! యితుడేడవ
చ్చెనో! పిడ్లు౯బలె మామనోరథము శుషీభూతమై పోవఁగ౯.
చ॥ కనికరమన్నమాటను జ గమ్మున నీతఁడు విన్న యట్టుల ౯
గనఁబడ; దిందుఁ జేరియు రణంబు రణం బనుచు క్షణక్షణం
బు నుడువు; స్థానమో సమయమో గ్రహీయింపఁడు; వాని కేమి! గె
ల్చిన సకలావనీభరము చేపడునన్న దురాశ తక్కఁగ.
310
మః॥ అమితప్రాభవ మొప్ప నిప్పుడు సలుంబ్రాధీశుఁ దాస్యంబు నం
దమునొంద నెలకొల్పు నాతిలకము మట్టారదే! ద్వంద్వయు
ద్ధము ము రానేల! ప్రతాపుఁడేటికి సమాధానఁబు సూచింపఁ! గ
ష్టములకా దెచ్చు నితండు! వల్లనుచు నా జ్ఞాపిషఁగా రాదొకో!
మ। కులశైలోపమ ధైర్యభూధవశిరః కోటీర కోటీ మణి
జ్వలదారక్తరుచుల్ పదంబులు సహించక్ జూచుచున్నట్టి క
న్నులతో దారుణసంగరాంగణమునందూక్ ఖడ్గముల్ చీల్పంగా
వెలికిక్ దూఁకెడు క్రొత్తరక్తములను వీక్షింపనౌ నేమొకో!''
కొ
"
మ!! అని యిట్లంచు వచింపరాని కడుఁజింతా వేశ దైన్యంబుల
గని దుఃఖింపఁగఁ గృష్ణసింగు "రణమే కర్తవ్యమే! వేఱుత్రో
వ నిరూపింపఁగరాదె! యిప్పు డిపుణే పట్టాభిషేకంబు శో
భనమై సాగెను; యుద్ధమెట్లయిన నిల్ప భావ్యమౌ నియ్యెడు. "
చ అనఁగఁ తాపసింహుఁడు "మహాత్మ! భవద్వచనంబు మాననీ
యనియతి నొప్పు; నైన నొరుఁ డాహనము బొనరింపఁగోరి పి
ల్చినను నిరాకరింపఁగలలేఁతమనం బది లేదు; కాని మీ
రనినటు లిట్టా సౌఖ్యసమయంబున నెట్లని ఛింత కల్గెడుక్,
కః దండించుట కౌర్యమ్మగు; దండింపమి దుర్బలతకుఁ. దావగు; నవనీ
శుండనయి నాపరిస్థితి యొండేటికి! సున్నితముగనున్నది.తండ్రీ..
●
1
1
శ్రీ
2
2
2
3
3</p>
<pb n="98" />
<p>ప్రధ మాశ్వా సము,
మ॥ సరి; యీ మంగళ వేళయందు రణము సాగింప కొండొక్కఁడే
కరణిక్ గార్యముఁద్రిప్పీ యీతనిఁ దొలం గజేతుఁ బొ"మ్మంచు "సా
గర! చిత్తూర్పురరాజ్యమెల్ల మదుద గ్రస్ఫార బాహాబల
స్ఫురణ రక్షణ సేయనెంచితి శుభంబుల్ నేఁడు సంధిల్లఁగ.
మ అనిశప్రేమ వెలుంగ నయ్యుదయసిం హ్మవరుం డీమహా
వనిఁ బాలించి యశంబు గాంచెను; సలుం
బ్రానాథుఁ డానేఁత'పో
యిన వెన్క్ దనకు లభింపఁగల ప్రత్యేకాధికారంబు పే
ర్శిని సన్నీ డకుఁ దోడి తెచ్చుచును ధా శ్రీనాథుఁ జేగా నడిక్.
మ॥ ఎనఁడో యొక్కఁడు రాజుగా నిలిచి యి స్పృశ్వీస్థలి వారి శ
4
క్తి విశేషమ్మున నేలు టొప్పుఁ; బ్రజ భ క్తి వాని యాజ్ఞాబలం
బవలంబించుట యొప్పు; లేనియెడఁ జీ కాకై విపత్కోటిచే
నవరుద్ధంబగు రాజ్య మెవ్వనికి వాఁడై యేలఁగాఁ బూనినక్.
ఉ॥ ఓరువరాని కార్యమిది; యూఱక కావర మూని నీతివి
ద్యారమణుండు కృష్ణవిభు నాడితి నోరికి వచ్చినట్లు; నా
తో రణమాచరింపుమని త్రుళ్లుచు నాదు మహాధికార ధి
క్కారము చేయుచుంటి; విఁకఁ । గాదు సహింప భవత్ప్రవర్తనల్.
♦
దండింపఁగా నొప్పు; వే
*) రాణాపతాపసింహుఁడు సాగరసింహుని దేశమువీడి పొమ్మనుట. (*
మ॥ నిను వీక్షించుచు మత్ప్రజల్ సుగుణని రిద్రుల్ భవద్దుష్టు వ
ర్తనముక్ నేర్చిన నేరు; కావున నిను
చను నాదేశమువీడి యిప్లై పరరా ష్ట్రశ్రేణుల జేర; నో
ర్వ నిమేషం; బిట నాలసించినను; శీర్షచ్ఛేదము జేసెదన్.
మ॥ ఇది నాయాజ్ఞ! బహిష్కరించితిని ని! న్నీ దేశమం దెచ్చట
మెదలక్ బోక''న సాగరుండు నగి "స్వా మీ! చాల సంతోషమై
నది! రాజ్యంబది యెతతీపనుచు డెందంబందు భావించితో
విదితంబయ్యె సమస్తభూజనులకు! బెక్కేల వాక్రువ్వఁగ.
మ॥ ఇది నాయూ రీది నాదు రాష్ట్రమనుచు హీనుల్ మఱి దుర్బలుల్
మది నూహింతురు; కాని విక్రమకళా లంకారులౌ వారి క
57
328
329.
330
331
332
333
1</p>
<pb n="99" />
<p>ప్రతాప సింహ చరిత్ర.
య్యుదయాస్తాచలమధ్యగంబయిన సర్వోక్వితలంబు ముదా
స్పదమా కొంగుపసిండివోలెఁ దమడై భాసిల్లు నెల్లప్పుడు.
మకి పరుపా భవ మొప్పు నీదయిన మేవాడ్ రాజ్య మందుండఁగా
నెరియుక్ నామది; నీవు శత్రుఁడగుట నీవారలు శత్రుతా
దుకు; నీకెప్పుడు గర్భశత్రువులు మిత్రుల్ నాకు; నట్లేట మ
చరణంబుల్ క్షణకాలముంచుచుఁ జరిం చక్ నీదు దేశంబున.
సీ పనియేమి పరభూమి పతులసీనులకేగ! మేవాడ నెపైపు మ్రింగుదునని
శ్రీ
కనువిచ్చియుండు నక్బరుధరామండలాఖండలుం! డాతని కడకుఁ బోదుఁ;
ద్వద్వికటప్రవ ర్త నమున నతనికి మిత్రలాభము గల్గు మేర యొద వె;
నిప్పుడె పయనించి , యేగెద ఢిల్లీ పురమునకుఁ గొన్ని దినములలోన!
గీః హెచ్చరికగల్గి రాజ్యంబు నేలుచుండు! మిదియె శాశ్వతమనియుండ!
* కప్పు డె
వెచట నేరీతి నిన్ను జయించి దాని నపహరింతురొ! తెలియఁబోడజనకైన."
JŠA + GRATAN_॥
*) రాణాపతాపసింహుఁ డనుచరులతో వేఁటకుఁ బోవుట. (*
మ' అని గాంభీర్యమెలర్పఁగాఁ బలికి య శ్వారూఢుఁడై పోయె నా
తని వీక్షించుచుఁ గొంత సేపటికి యో ధశ్రేష్ఠులు బెక్కురుక్
డశవెంటర్" జనుదేర నయ్యెడ నరణ్య ప్రాంతము జేరఁగాఁ
జనె వేఁటాఁడ బ్రతాపసింహుఁడు జనుల్ సంతోషమున్ బొందఁగ౯.
ఉ. కొమ్ములు లేని యమ్మహిష కోటులు, తొండములేని భద్రనా
గల్గిన మత్తమహావరాహ పో
దారుణ లీలల నీఁటియన్ శరీ
♦
గమ్ములు నాఁగనొప్పు పనిఁ
తమ్ముల నాప్రతాపుఁ డతి
ర్యాటోప మేపార, ను
కమ్ములు గాడఁగాఁ బొడిచి . రాసులురాసులువోసె నేలపై.
మః అరుణాంశుచ్ఛటలీన నేత్రములు, శౌ శ్రీ
శౌ.
గ్రరసోద్రేకమున బ్రతాపధరణీ కాంతుఁడు సర్దాత్రసం
భరితుం డె త్తినయీఁ టెఁదింపక మహా మాయాకి రాతుండటుల్.
నిరణోదగ్రవిహారముల్ నెరపి ఖండించె వరాహమ్ముల.
మ: మొ" సామఃత్తులు వీర యోధనివహం బ్దుల్ వారి దోశ్శక్తి కి
దగ్గు చందంబున నొక్కమైఁ గదిసి కాంతారమ్మునక్ గల్గు న
38
F
డా
♦
3
31</p>
<pb n="100" />
<p>ప్రథమాశ్వా స ము.
మ్మృగ సంతానముల౯ క్షణంబునను భూమిక్ గూల్చి పెక్కింటి గు
ప్పగఁ దా మొక్కెడఁజేర్చి రారుధిరముల్ పాఱంగఁ బెన్కాల్వలై.
చ॥ అరిది ముదంబు మీఱ మృగ యారతి సాగఁగఁజేసి నిల్పి స
త్వరముగ లెక్క సేయఁగఁ బ్రతాపుఁడు గూల్చు వరాహపంక్తి యం
దఱు సమయించు నమ్మృగవి తానము మీఱుటఁ జూచి హర్షముల్
వఱలఁగ మంచి కాలమది వచ్చు' నటంచుఁ దలంచి రందఱుక్.
మ!! శివుముత్తెదువ ప్రీతి కేకలముల జెండాడి చెండాడి యో
ధవితానంబులు నూతనోత్సవసముద్యత్స్వాంతులై భూమియుక్
దివియుక్ గ్రక్కదలంగ నార్చుముఁ గడు దేజంబు దీపింప ను
గ్రవనంబు౯ విడి రాజధానిని జొరం గాఁబోయి గొక్కుమ్మడి.
సీ॥ చిత్తూర్పురము శత్రు చేఁబడి రాజ్యభాగము తద్ద పెద్దదిగాక యున్నఁ!
దమదేశసామంత । ధరణీశు లొక్కరొక్కరు పోయి యక్బరుఁ గలియుచున్నఁ!
గడలేని యుద్ధసంఘర్షణంబులఁ దమ దేశమంతయుఁ బిప్పి తేలియున్నఁ!
బరిపంథియో నభో 4 భాగ భూభాగముల్ తలక్రిందు చేసెడు బలియుఁడైనఁ!
ను పద్యకావ్యమును
దుఁ బ్రథమా
శ్వాస
ము
త
310
గీః దమమది హరించు ఘనుఁడు దుర్దాంత తేజుఁ డర్క కులవర్ధనుఁడు సుగుణాంబురాశి
యాప్రతాపుడు రాజౌట హర్ష మొది మించి మిన్నంది ప్రజరమియించెనపుడు.
ఎ
గద్య:- ఇది శ్రీమ త్కామేశ్వరీ కరుణా కటాక్ష వీక్షా సమాసాదిత రసవత్కావ్య
నిర్మాణ చాతురీధురీణ, సుగుణగణపారీణ, దుర్భాక వంశ దుగ్గాంభోరాశి
రాకాకైరవమిత్ర, శాలంకాయనగోత్ర పవిత్ర, సుజనజనాను
గ్రహపాత్ర, వెంకటరామార్యపుత్ర, కవిసింహా 2 వధాని
పంచానన కావ్యకళాని రీత్యాదిబిరుద విఖ్యాత, సుకవి
రాజ శేఖర, రాజ శేఖరకవి ప్రణీతంబయిన
"రాణా ప్రతాపసింహ చరిత్రం" బ
సంపూర్ణము.
341
342</p>
</body>
</text>
</TEI>